ఓపీఎస్ను అమలు చేస్తే రాష్ట్రానికి అప్పు పుట్టదు
పాత పింఛను పథకం (ఓపీఎస్) అమలు చేస్తే రాష్ట్రానికి అప్పు పుట్టదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. 3% ఉండాల్సిన ఆర్థికలోటు ఓపీఎస్ అమలుతో 2030కి 4.8%, 2040కి 6.1%, 2050 కల్లా 8 శాతానికి చేరుతుందని చెప్పారు.
2050 నాటికి ఆర్థికలోటు 8 శాతానికి చేరుకుంటుంది
ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తుంది: మంత్రి బుగ్గన
జీపీఎస్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఈనాడు, అమరావతి: పాత పింఛను పథకం (ఓపీఎస్) అమలు చేస్తే రాష్ట్రానికి అప్పు పుట్టదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. 3% ఉండాల్సిన ఆర్థికలోటు ఓపీఎస్ అమలుతో 2030కి 4.8%, 2040కి 6.1%, 2050 కల్లా 8 శాతానికి చేరుతుందని చెప్పారు. అదే జరిగితే రాష్ట్రం ఆర్థికంగా స్తంభించి, అప్పుచేసే పరిస్థితి కూడా ఉండదని మంత్రి వివరించారు. భావితరాలను, ఉద్యోగుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని యాన్యుటీ మోడల్లో గ్యారంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) తీసుకొచ్చామని ఆర్థికమంత్రి తెలిపారు. ఇదే విధానాన్ని రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా అమలు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. జీపీఎస్ బిల్లు-2023ను ముందుగా నిర్ణయించిన ఎజెండాలో కాకుండా... టేబుల్ ఎజెండా ఐటంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం’ (సీపీఎస్)ను రివ్యూ చేయాలని అనేక ఏళ్లుగా ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై అనేక రకాలుగా అధ్యయనం చేశాక హైబ్రిడ్ మోడల్లో గ్యారంటీ పెన్షన్ స్కీం తెచ్చాం. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు సొంత అవసరాలు, అభిప్రాయాల కంటే ప్రజలకు సంబంధించిన అంశాలే ప్రధానం. ఓపీఎస్లో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారికి ఏడాదికి రూ.20,400 కోట్ల చొప్పున ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది. సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్కు వెళితే 2030లో రూ.33,546 కోట్లు అవసరమవుతాయి. 2045 నుంచి పరిస్థితి మరింత చేయి దాటిపోతుంది. ఎందుకంటే 2004 తరువాత నియమితులైన ఉద్యోగుల పదవీ విరమణ.. 2045 నాటికి భారీసంఖ్యలో ఉంటుంది. ఈరోజు ఎవరైతే సీపీఎస్ నుంచి ఓపీఎస్ తీసుకున్నామని సంబరపడతారో... వారు 2045 నాటికి ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలామంది ఓపీఎస్ను పెట్టాలని అంటున్నారు. మనస్సాక్షిగా పాలన చేయాలి. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా... 2070 వరకు ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించి ప్రభుత్వం జీపీఎస్ను తీసుకొచ్చింది’ అని ఆర్థికమంత్రి అన్నారు.
మధ్యే మార్గంగా జీపీఎస్
సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ను షేర్ మార్కెట్లో పెడుతున్నందున వారికి కలిగే ప్రయోజనం 20% కంటే ఎక్కువ లేదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు ప్రస్తుత, భవిష్యత్లో నియమితులయ్యే ఉద్యోగుల అవసరాలు, వారి పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి సీపీఎస్, ఓపీఎస్కు మధ్యేమార్గంగా జీపీఎస్ తీసుకొచ్చాం. ఒక వేళ ఓపీఎస్కు వెళితే రాష్ట్ర పింఛన్లు 2030 నాటికి 16%, 2040కి 19.5%, 2050కి 28.6%, 2100కి దాదాపుగా 40 శాతానికి వెళతాయి. ఇది 5-7 శాతమే ఉండాలి. స్థూల ఉత్పత్తికి అప్పు అనేది ఒక నిష్పత్తిగా తీసుకుంటే 35 శాతం కంటే ప్రస్తుతం తక్కువ ఉంటాం. ఓపీఎస్కు వెళితే అప్పు 2030కి 53%, 2040కి 70%, 2050కి 107 శాతానికి చేరుతుంది. దీనివల్ల భవిష్యత్లో ఆర్థికంగా తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని జీపీఎస్ను రూపొందించాం’ అని బుగ్గన వివరించారు.
జీపీఎస్తో ప్రయోజనాలివీ...
‘పదవీ విరమణ చేసే నాటికి చివరిసారిగా డ్రా చేసిన మూల వేతనంలో 50% చొప్పున నెల వారీ పింఛన్ ఉండేలా గ్యారంటీ ఇస్తున్నాం. పింఛన్దారు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 60% పింఛన్ వర్తింపజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జీపీఎస్ ఉద్యోగులకు హెల్త్ స్కీం అమలు చేస్తాం. పదేళ్ల సర్వీసు కలిగిన ఉద్యోగులకూ రూ.10 వేల పింఛన్ గ్యారంటీ ఉంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు.
10,117 మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ
వివిధ ప్రభుత్వ శాఖల్లో 2014 జూన్ 2 నాటికి పని చేస్తున్న 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజేషన్ బిల్లు-2013ను అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టారు. సభ ఆమోదించాక మంత్రి మాట్లాడారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు లోబడి క్రమబద్ధీకరించిన ఉద్యోగులను... ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమిస్తామని వెల్లడించారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 2 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను ప్రభుత్వం నియమించిందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’కు వాలంటీర్లే అంపైర్లు
ఎన్ని విమర్శలు ఎదురైనా.. లోటుపాట్లు కనిపిస్తున్నా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను మమ అనిపించడానికే ప్రభుత్వం, అధికారులు సిద్ధమయ్యారు. తగిన సాధన సంపత్తి లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి క్రీడల సందడి మొదలుకానుంది. -
Amaravati: ఏపీలో ప్లాట్ల కేటాయింపునకు ఈ-లాటరీ 15న
ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందినవారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు ఈ నెల 15న ఈ-లా టరీ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. -
అయిదు ఎకరాలు ఎందుకు? ఆరున్నరెకరాలు ఇస్తాం తీసుకో..!
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని అయిదు ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? కబ్జా నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలి. -
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు. -
సొంతిల్లు ఉన్నంత మాత్రాన నివాసితుడిగా పరిగణించొద్దు
‘ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు. -
Telangana: విద్యుత్ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు
రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..
ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు! -
Gundlakamma Reservoir: గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. -
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. -
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా..
సీఎం జగన్ తిరుపతి జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ.. ‘బాధితులకు రేషన్ బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ లీటరు, ఒక కిలో ఆనియన్, ఒక కేజీ ఉల్లిగడ్డ. -
వరద మింగిన రైతు కష్టం
మిగ్జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో పంట కోశారు. -
విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు జగన్ ప్రభుత్వం రాజకీయ చెద పట్టించింది. సరస్వతి నిలయాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చి భ్రష్ఠు పట్టించింది. అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉపకులపతు (వీసీ)లను నియమించడం.. అలా వచ్చిన వీసీలు విద్యను, విద్యార్థులను పట్టించుకోకుండా... -
తెల్లకాగితం మీద పేర్లు రాసిస్తే... ఓట్లు తొలగిస్తున్నారు
చాలా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు తెల్లకాగితాలపై పేర్లు రాసిస్తుంటే.. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
ప్రభుత్వ తీరుపై వ్యాజ్యం వేయడమే పాపమా?
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. -
కరవు కాటు.. తుపాను పోటు.. కనికరం చూపని సర్కారు
ఖరీఫ్లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్జాం తుపాను చిదిమేసింది. -
రోడ్డెక్కిన పాడి రైతులు
సీఎం జగన్ సొంత జిల్లాలోనే పాడిరైతులు గిట్టుబాటు ధర కోసం శుక్రవారం రోడ్డెక్కారు. పాలను నేలపై పారబోసి ఆగ్రహం ప్రదర్శించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమస్యపై వేడుకున్నారు. ఆపై ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయించారు. -
35 నిమిషాల్లోనే ముగించేశారు!
ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ప్రతిపక్షాలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు రెండు- మూడు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మమ అనిపిస్తున్నారు. -
తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ నారాయణ
మిగ్జాం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. -
నలుగురి ఉసురు తీసిన ముసురు
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో తట్టుకోలేక నలుగురు కౌలు రైతులు తనువు చాలించారు. కంటిపాపలా కాపాడుకున్న పంట పొలం కళ్లముందు కొట్టుకుపోవడం, వరి పనల నుంచి మొలకలు రావడం చూసి వారు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. -
ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు.. ఓట్లెలా అడుగుతాం!
కౌన్సిలర్లుగా అధికార పార్టీ నుంచి ఎన్నికైనా.. ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయామని, మరికొన్ని నెలల్లో ఎన్నికల కోడ్ వస్తుండటంతో ప్రజలను ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతామని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు తెదేపా రూ.60 లక్షల సాయం
విశాఖ చేపలరేవులో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు తెదేపా అధికారంలోకి రాగానే కొత్త బోట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
Allu arjun: వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు
-
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..
-
WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..