మాకూ ఉంది బటన్.. ముందుంది రిటర్న్!
గ్యారంటీడ్ పింఛను పథకం(జీపీఎస్) బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు.
ఉద్యోగుల పాలిట చీకటిరోజు
వారంలో ఓపీఎస్ అమలు చేస్తానని.. ఇప్పుడు జీపీఎస్తో మోసగించిన జగన్
సీపీఎస్ ఉద్యోగుల నిరసనలు
జీపీఎస్ బిల్లు ప్రతుల దహనం
ఈనాడు, అమరావతి: గ్యారంటీడ్ పింఛను పథకం(జీపీఎస్) బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. బిల్లు ప్రతులను దహనం చేశారు. ఉద్యోగుల చరిత్రలో దీన్ని చీకటిరోజుగా అభివర్ణించారు. ‘మాకూ ఉంది బటన్.. ముందుంది రిటర్న్’ అంటూ నినదించారు. పాత పింఛన్ పథకం(ఓపీఎస్)ను పునరుద్ధరించే దాకా పోరాడతామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వారంలో ఓపీఎస్ను అమలు చేస్తానని... ఎన్నికల ముందుకు హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు మాట తప్పి ఉద్యోగులను నిలువునా మోసగించారని విమర్శించారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసనల్లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జీపీఎస్ వద్దు.. ఓపీఎస్ను అమలు చేయాలంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు...
ఇక నుంచి జీపీఎస్పై పోరు
- హృదయరాజు, చిరంజీవి, ఏపీటీఎఫ్
జీపీఎస్ను ఉద్యోగులపై బలవంతంగా రుద్దడాన్ని సహించబోం. ఇప్పటిదాకా సీపీఎస్ను రద్దు చేయాలని పోరాడాం. ఇక నుంచి జీపీఎస్ అంతం కావాలని ఉద్యమిస్తాం. ఓపీఎస్ను పునరుద్ధరించే దాకా ఆందోళనలు ఆగవు.
కనీసం చర్చించకుండా...
- కోట్ల రాజేష్, అంబటి వెంకటేశ్వర్లు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్
బాధిత ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చించకుండా... వారు దాచుకున్న డబ్బుతోనే పింఛన్ హామీ పేరుతో జీపీఎస్ బిల్లు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసెంబ్లీలో చివరి రోజు.. అదీ ముందుగా ఎజెండాలో పెట్టకుండా జీపీఎస్ బిల్లు తీసుకు రావడం అన్యాయం.
ఈ ప్రభుత్వ అధ్యాయం ముగిసినట్లే
- అప్పలరాజు, కమిరి రాజేశ్వరరావు, దాస్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అసోసియేట్ అధ్యక్షుడు, ఏపీసీపీఎస్ఈఏ
సీపీఎస్ ఉద్యోగులకు ఇది బ్లాక్ డే. ఎన్నికలప్పుడు ఈ బ్లాక్ డేను గుర్తుపెట్టుకోండి. బలవంతంగా జీపీఎస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అప్రజాస్వామికం. రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారతారంటే ఇదేనేమో. మమ్మల్ని, మా ఆవేదనను ఓట్ల కోసం వాడుకున్నారు. ఇప్పుడు మా పీక పట్టుకున్నారు. హామీని నెరవేర్చాలని అడిగితే బైండోవర్ కేసులు పెట్టారు. ఇక ఈ ప్రభుత్వ అధ్యాయం ముగిసినట్లే.
నిలువునా మోసగించడమే..
- గణపతిరావు, ప్రకాష్రావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆప్తా
మధ్యంతర భృతి కంటే పీఆర్సీ ఫిట్మెంట్ తగ్గించారు. ఓపీఎస్ కావాలంటే జీపీఎస్ను తెచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా అని 3.5 లక్షల మంది ఉద్యోగులకు వ్యతిరేకంగా జీపీఎస్ను తేవడం నిలువునా మోసగించడమే.
ఉద్యోగులకు తీవ్ర అన్యాయం
- నరహరి, ఎన్వీ రమణయ్య, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీటీఎఫ్
జీపీఎస్తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఓపీఎస్ను ఇవ్వకపోగా.. ఇప్పుడు జీపీఎస్ తెచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను పట్టించుకోక పోవడం శోచనీయం.
బిల్లులో ఏముందో చెప్పలేదు
- శ్రావణ్కుమార్, బాలాజీ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆపస్
జీపీఎస్పై అన్ని వర్గాలతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. బిల్లులో ఏముందో ఉద్యోగ సంఘాలకు చెప్పలేదు.
నోరు మెదపని ఐకాస నాయకులు
జీపీఎస్ను అందరూ వ్యతిరేకిస్తున్నా జగన్ భజనలోనే కొనసాగుతున్న వైనం
రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు... జీపీఎస్ను వ్యతిరేకిస్తూ నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే ప్రధాన ఐకాసలు మాత్రం నోరుమెదపడం లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ మౌనం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా జీపీఎస్కు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు, ధర్నాలు చేస్తున్నా ఎక్కడా ఒక్క ఐకాస కూడా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చేయలేదు. జీపీఎస్పై చర్చల సమయంలోనూ సీపీఎస్ ఉద్యోగుల మనోభావాలను పట్టించుకోకుండా జీపీఎస్ను స్వాగతిస్తున్నట్లు చెప్పారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గతంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఐకాస నాయకులతో పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించడంపై... ‘మాట తప్పని మా జగనన్న’ అంటూ ఏపీ ఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి ప్రకటన విడుదల చేయడంపైనా ఉద్యోగులు మండిపడుతున్నారు. ఓపీఎస్పై మాట తప్పితే కనీసం ప్రకటన కూడా ఇవ్వలేని దుస్థితిలో ఐకాస నాయకులు ఉన్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’కు వాలంటీర్లే అంపైర్లు
ఎన్ని విమర్శలు ఎదురైనా.. లోటుపాట్లు కనిపిస్తున్నా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను మమ అనిపించడానికే ప్రభుత్వం, అధికారులు సిద్ధమయ్యారు. తగిన సాధన సంపత్తి లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి క్రీడల సందడి మొదలుకానుంది. -
Amaravati: ఏపీలో ప్లాట్ల కేటాయింపునకు ఈ-లాటరీ 15న
ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందినవారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు ఈ నెల 15న ఈ-లా టరీ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. -
అయిదు ఎకరాలు ఎందుకు? ఆరున్నరెకరాలు ఇస్తాం తీసుకో..!
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని అయిదు ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? కబ్జా నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలి. -
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు. -
సొంతిల్లు ఉన్నంత మాత్రాన నివాసితుడిగా పరిగణించొద్దు
‘ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు. -
Telangana: విద్యుత్ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు
రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..
ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు! -
Gundlakamma Reservoir: గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. -
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. -
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా..
సీఎం జగన్ తిరుపతి జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ.. ‘బాధితులకు రేషన్ బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ లీటరు, ఒక కిలో ఆనియన్, ఒక కేజీ ఉల్లిగడ్డ. -
వరద మింగిన రైతు కష్టం
మిగ్జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో పంట కోశారు. -
విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు జగన్ ప్రభుత్వం రాజకీయ చెద పట్టించింది. సరస్వతి నిలయాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చి భ్రష్ఠు పట్టించింది. అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉపకులపతు (వీసీ)లను నియమించడం.. అలా వచ్చిన వీసీలు విద్యను, విద్యార్థులను పట్టించుకోకుండా... -
తెల్లకాగితం మీద పేర్లు రాసిస్తే... ఓట్లు తొలగిస్తున్నారు
చాలా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు తెల్లకాగితాలపై పేర్లు రాసిస్తుంటే.. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
ప్రభుత్వ తీరుపై వ్యాజ్యం వేయడమే పాపమా?
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. -
కరవు కాటు.. తుపాను పోటు.. కనికరం చూపని సర్కారు
ఖరీఫ్లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్జాం తుపాను చిదిమేసింది. -
రోడ్డెక్కిన పాడి రైతులు
సీఎం జగన్ సొంత జిల్లాలోనే పాడిరైతులు గిట్టుబాటు ధర కోసం శుక్రవారం రోడ్డెక్కారు. పాలను నేలపై పారబోసి ఆగ్రహం ప్రదర్శించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమస్యపై వేడుకున్నారు. ఆపై ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయించారు. -
35 నిమిషాల్లోనే ముగించేశారు!
ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ప్రతిపక్షాలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు రెండు- మూడు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మమ అనిపిస్తున్నారు. -
తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ నారాయణ
మిగ్జాం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. -
నలుగురి ఉసురు తీసిన ముసురు
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో తట్టుకోలేక నలుగురు కౌలు రైతులు తనువు చాలించారు. కంటిపాపలా కాపాడుకున్న పంట పొలం కళ్లముందు కొట్టుకుపోవడం, వరి పనల నుంచి మొలకలు రావడం చూసి వారు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. -
ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు.. ఓట్లెలా అడుగుతాం!
కౌన్సిలర్లుగా అధికార పార్టీ నుంచి ఎన్నికైనా.. ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయామని, మరికొన్ని నెలల్లో ఎన్నికల కోడ్ వస్తుండటంతో ప్రజలను ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతామని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు తెదేపా రూ.60 లక్షల సాయం
విశాఖ చేపలరేవులో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు తెదేపా అధికారంలోకి రాగానే కొత్త బోట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: రాహుల్ ద్రవిడ్ చెప్పిందే ఫాలో అవుతున్నా: రింకు సింగ్
-
Chandra Babu: తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు
-
Chiranjeevi: చిరంజీవితో సినిమా చేస్తా: సందీప్ రెడ్డి వంగా
-
సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి