సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో... తెదేపా మహిళా నాయకురాలి అరెస్టు
తండ్రి చనిపోయిన బాధలో అనారోగ్యం పాలైన ఓ మహిళను సోషల్మీడియా పోస్టింగ్ కేసులో గుంటూరు పట్టాభిపురం పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్కు పెట్టడాన్ని గుంటూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ జి.స్పందన తప్పుపట్టారు.
ఆరోగ్యం బాగోలేదన్నా వినిపించుకోని పోలీసులు
పోలీసుల తీరును తప్పుపట్టిన మేజిస్ట్రేట్
రిమాండ్ తిరస్కరిస్తూ ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, పట్టాభిపురం: తండ్రి చనిపోయిన బాధలో అనారోగ్యం పాలైన ఓ మహిళను సోషల్మీడియా పోస్టింగ్ కేసులో గుంటూరు పట్టాభిపురం పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్కు పెట్టడాన్ని గుంటూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ జి.స్పందన తప్పుపట్టారు. కేసు దర్యాప్తు అధికారి ఈ కేసులో సుప్రీం మార్గదర్శకాలను పాటించలేదని మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితులను రిమాండ్కు పెట్టడమేంటి? 41ఏ నోటీసులు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. రిమాండ్కు పెట్టిన ఎస్సైని పిలవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. నిందితురాలు శివపార్వతి రిమాండ్ను జడ్జి తిరస్కరించారు. ఆమెను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆమె నుంచి వచ్చే నెల 6వ తేదీలోపు రూ.5వేల విలువైన రెండు బాండ్లను తీసుకోవాలని సూచించారు. గుంటూరు విజయపురి కాలనీలో నివసించే పిడికిటి శివపార్వతి అలియాస్ లక్ష్మీగణేష్ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా కార్యదర్శిగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన నేపథ్యంలో సీఎం జగన్కు వ్యతిరేకంగా సోషల్మీడియాలో వచ్చిన ఓ వీడియోను ఆమె ఫార్వర్డ్ చేశారు.
వైకాపా నాయకులనుంచే ఫిర్యాదు
సీఎం ఫొటోను మార్ఫింగ్ చేసి పెట్టారని, తమ నాయకుడి గౌరవానికి భంగం కలిగేలా వీడియోలున్నాయని, వీటిని ఫార్వర్డ్ చేసిన సంబంధిత మహిళపై చర్యలు తీసుకోవాలని వైకాపాకు చెందిన గుంటూరు 42వ డివిజన్ ఇన్ఛార్జి చల్లా శేషిరెడ్డి, ఆ పార్టీకే చెందిన పశ్చిమ నియోజకవర్గ సోషల్మీడియా కోఆర్డినేటర్ రాజవరపు జగదీష్, షేక్ ఉస్మాన్ ఈ నెల 25న ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభిపురం పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లు వేర్వేరుగా నమోదు చేసి శివపార్వతిపై 153, 502, 504, 505(2) ఐపీసీ సెక్షన్లు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి పట్టాభిపురం స్టేషన్కు చెందిన ఆరుగురు పోలీసులు ఇద్దరు మహిళా సిబ్బందితో సహా ఆమె ఇంటికి బుధవారం ఉదయం వెళ్లారు. తనకు ఆరోగ్యం బాగోలేదని.. తర్వాత స్టేషన్కు వస్తానని చెప్పగా కుదరదని రిమాండ్కు పెడుతున్నామని, రావాల్సిందేనని పట్టుబట్టి ఇంటి వద్దే కూర్చున్నారు. దీంతో ఆమె తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్కు సమాచారమిచ్చారు. వెంటనే ఆయన వచ్చి చట్టవిరుద్ధమైన అరెస్టుపై పోలీసులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో శివపార్వతి బయలుదేరి పోలీసులతో స్టేషన్కు వెళ్లారు. పోలీసుల విచారణలో తానే వీడియో ఫార్వర్డ్ చేసినట్లు అంగీకరించారు. ఆ వెంటనే ఆమెను అరెస్టు చేసి జీజీహెచ్కు పంపారు. మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. నిందితురాలి తరఫున తెదేపా లీగల్సెల్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వచ్చే నెల 2న శివపార్వతి తండ్రి పెద్ద కర్మ ఉందని, ఆ బాధలో ఉన్న ఆమెకు ఎలాంటి నోటీసులివ్వకుండా బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్ పెట్టారని వారు తెలిపారు. సోషల్మీడియాకు సంబంధించి గతంలో సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసి విచారించగా, తాజాగా శాంతిభద్రతల విభాగం పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’కు వాలంటీర్లే అంపైర్లు
ఎన్ని విమర్శలు ఎదురైనా.. లోటుపాట్లు కనిపిస్తున్నా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను మమ అనిపించడానికే ప్రభుత్వం, అధికారులు సిద్ధమయ్యారు. తగిన సాధన సంపత్తి లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి క్రీడల సందడి మొదలుకానుంది. -
Amaravati: ఏపీలో ప్లాట్ల కేటాయింపునకు ఈ-లాటరీ 15న
ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందినవారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు ఈ నెల 15న ఈ-లా టరీ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. -
అయిదు ఎకరాలు ఎందుకు? ఆరున్నరెకరాలు ఇస్తాం తీసుకో..!
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని అయిదు ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? కబ్జా నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలి. -
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు. -
సొంతిల్లు ఉన్నంత మాత్రాన నివాసితుడిగా పరిగణించొద్దు
‘ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు. -
Telangana: విద్యుత్ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు
రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..
ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు! -
Gundlakamma Reservoir: గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. -
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. -
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా..
సీఎం జగన్ తిరుపతి జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ.. ‘బాధితులకు రేషన్ బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ లీటరు, ఒక కిలో ఆనియన్, ఒక కేజీ ఉల్లిగడ్డ. -
వరద మింగిన రైతు కష్టం
మిగ్జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో పంట కోశారు. -
విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు జగన్ ప్రభుత్వం రాజకీయ చెద పట్టించింది. సరస్వతి నిలయాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చి భ్రష్ఠు పట్టించింది. అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉపకులపతు (వీసీ)లను నియమించడం.. అలా వచ్చిన వీసీలు విద్యను, విద్యార్థులను పట్టించుకోకుండా... -
తెల్లకాగితం మీద పేర్లు రాసిస్తే... ఓట్లు తొలగిస్తున్నారు
చాలా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు తెల్లకాగితాలపై పేర్లు రాసిస్తుంటే.. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
ప్రభుత్వ తీరుపై వ్యాజ్యం వేయడమే పాపమా?
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. -
కరవు కాటు.. తుపాను పోటు.. కనికరం చూపని సర్కారు
ఖరీఫ్లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్జాం తుపాను చిదిమేసింది. -
రోడ్డెక్కిన పాడి రైతులు
సీఎం జగన్ సొంత జిల్లాలోనే పాడిరైతులు గిట్టుబాటు ధర కోసం శుక్రవారం రోడ్డెక్కారు. పాలను నేలపై పారబోసి ఆగ్రహం ప్రదర్శించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమస్యపై వేడుకున్నారు. ఆపై ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయించారు. -
35 నిమిషాల్లోనే ముగించేశారు!
ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ప్రతిపక్షాలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు రెండు- మూడు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మమ అనిపిస్తున్నారు. -
తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ నారాయణ
మిగ్జాం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. -
నలుగురి ఉసురు తీసిన ముసురు
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో తట్టుకోలేక నలుగురు కౌలు రైతులు తనువు చాలించారు. కంటిపాపలా కాపాడుకున్న పంట పొలం కళ్లముందు కొట్టుకుపోవడం, వరి పనల నుంచి మొలకలు రావడం చూసి వారు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. -
ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు.. ఓట్లెలా అడుగుతాం!
కౌన్సిలర్లుగా అధికార పార్టీ నుంచి ఎన్నికైనా.. ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయామని, మరికొన్ని నెలల్లో ఎన్నికల కోడ్ వస్తుండటంతో ప్రజలను ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతామని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు తెదేపా రూ.60 లక్షల సాయం
విశాఖ చేపలరేవులో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు తెదేపా అధికారంలోకి రాగానే కొత్త బోట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు