అంతుచిక్కని రీతిలో తుపాన్ల గమనం
పెరుగుతున్న భూతాపం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు.. వాతావరణ మార్పులతో తుపాన్లు అంతుచిక్కని విధంగా మారుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
భూతాపం, వాతావరణ మార్పులే కారణం
ఇన్కాయిస్-ఏయూ అధ్యయనం
ఈనాడు, హైదరాబాద్: పెరుగుతున్న భూతాపం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు.. వాతావరణ మార్పులతో తుపాన్లు అంతుచిక్కని విధంగా మారుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. తుపాన్లు వేగంగా బలం పుంజుకోవడం, బలహీనపడే సమయంలో మళ్లీ విజృంభించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని.. వాటిని అంచనా వేయడంలో, నష్ట నివారణ ప్రణాళిక రూపకల్పనలో శాస్త్రవేత్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ తరహా మార్పులు మున్ముందు మరింతగా పెరుగుతాయని పేర్కొంది. ఈమేరకు ఇన్కాయిస్ (భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవాకేంద్రం), విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో పలు అంశాలు వెల్లడయ్యాయి.
- పరిశోధకులు 1981-2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా మహా సముద్రాల్లో ఏర్పడ్డ తుపాన్ల సమాచారాన్ని అధ్యయనం చేశారు. ప్రపంచంలోని అన్ని తుపాన్ల సమాచారాన్ని అమెరికాకు చెందిన ఐబీ ట్రాక్స్ సంస్థ సేకరిస్తుంటుంది. అక్కడున్న సమాచారాన్ని విశ్లేషించి తుపాన్ల తీరుతెన్నులపై తెలుసుకున్నట్లు ప్రాజెక్టు శాస్త్రవేత్త ఎన్.డి.మణికంఠ తెలిపారు. ఇటీవలి కాలంలో బలహీనపడతాయనుకున్న సమయంలో తుపాన్లు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని, తీరం దాటేటప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని వివరించారు.
- 40 ఏళ్లలో చోటుచేసుకున్న 3,800 తుపాన్లను పరిశీలిస్తే చివరి 20 సంవత్సరాల్లో క్రమం తప్పినవి 80% పెరిగినట్లు శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్ జోసెఫ్ వెల్లడించారు. అధ్యయన ఫలితాలను మరింతగా విశ్లేషించి.. ఏఐ, ఇతర సాంకేతికతల వినియోగంతో వాతావరణ మార్పుల తీరుతెన్నులను పసిగట్టవచ్చన్నారు. తుపాన్ల మార్పులను గుర్తించడం వల్ల భవిష్యత్తు పరిశోధనలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రజలకు మరింత కచ్చిత సమాచారాన్ని అందించగలమని ఇన్కాయిస్ డైరెక్టర్ టి.శ్రీనివాసకుమార్ తెలిపారు.
- పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన తుపాన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023 మార్చిలో వచ్చిన ఫ్రెడ్డీ తుపాను 5సార్లు తగ్గిపోయి, మళ్లీ విజృంభించింది. నెలపాటు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలను ముంచెత్తింది. ఒడిశాలో 2019లో వచ్చిన ఫణి తుపాను అలాంటిదే. తీరం దాటే సమయంలో బలహీనపడినట్లు కనిపించి, మళ్లీ విజృంభించడంతో ప్రజలకు తీవ్రనష్టం వాటిల్లిందని ఇన్కాయిస్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త మణికంఠ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాప్తానిపాలేనికి చెందిన కౌలు రైతు యార్లగడ్డ వీరప్రసాద్.. రూ.1.35 లక్షల పెట్టుబడితో ఆరెకరాల్లో వరి నాట్లు వేశారు. -
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
కృష్ణా నదిలో ఇసుక లోడింగ్ చేస్తుండగా హఠాత్తుగా వరద రావడంతో ఎడ్ల బండి, యజమాని కొట్టుకుపోయారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
Anantapuram: మహిళాశక్తి.. బైబిల్ భక్తి!
కలెక్టరేట్లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వాడుకోవడం వివాదాస్పదమైంది. -
‘ఇవి నగరాలు కావు..’ ప్రత్యక్ష నరకాలు
నగరాలు... మానవ ప్రగతికి చిహ్నాలు. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువత ఉపాధికి ఊతమిస్తాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తాయి. -
బాబోయ్ ‘ఖర్సయిపోతాం’!
అధికార వైకాపాలో కొన్ని లోక్సభ స్థానాల టికెట్లకు పెద్దలు అడుగుతున్న ‘పార్టీ ఫండ్’ అంకె విని అభ్యర్థులు గుడ్లు తేలేస్తున్నారు. -
తుపాను ఊడ్చేసింది
మిగ్జాం అపారమైన పంటనష్టాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. -
‘ఎన్నికల ముంగిట్లో..’ గ్రూపు-2 ముచ్చట!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన నేడు
మిగ్జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. -
రాజ్భవన్లో సాయుధ దళాల జెండా దినోత్సవం
-
‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకావిష్కరణ
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువారి ప్రస్థానానికి ప్రతిబింబమే ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకమని రచయిత మల్లికేశ్వరరావు కొంచాడ తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్లతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. -
గుంతల దారుల్లో కూరుకుపోతున్నా పట్టించుకోరేం?
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. -
అవే పనులు.. 2 సార్లు శంకుస్థాపనలు
దుర్గగుడిలో అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదం పోటు, కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద రాజద్వారంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. -
హైకోర్టు ముందు జగన్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు
‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు. -
Polavaram: ‘పదండి దూసుకు..’ పదండి వెనక్కి!
పోలవరం... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. -
మీ ఓటు నమోదు చేసుకోండిలా..
ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తారుమారు కావచ్చు. అందునా రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ కీలకమే. -
రూ.5 కోట్లతో కడితే.. మరుగుదొడ్ల పక్కన పడేశారు!
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి కనకదుర్గానగర్ మీదుగా వెళ్లే మార్గంలో భక్తుల రాకపోకలకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లతో రాతి మండప దారిని నిర్మించారు. -
‘పెట్టింది తినాలి..’ పెట్టకపోతే పస్తులుండాలి!
టోఫెల్ శిక్షణ, ట్యాబ్లూ, స్మార్ట్టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు... ట్రిపుల్ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. -
ప్రకాశం బ్యారేజీ 30 గేట్ల ఎత్తివేత
భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి గురువారం ఉదయం సుమారు 30,000 క్యూసెక్కుల మేర వరద వచ్చింది. -
భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం
బాపట్ల జిల్లా భర్తిపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా సానుభూతిపరులు ధ్వంసం చేశారు. -
కేజీబీవీ కార్యదర్శికి జాతీయ అవార్డు
విద్యారంగంలో ఉత్తమ ఆవిష్కరణలు, అభ్యసన విధానం అమలుకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కార్యదర్శి మధుసూదనరావుకు జాతీయ అవార్డు లభించింది.


తాజా వార్తలు (Latest News)
-
Putin: రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!
-
Revanth Reddy: మల్కాజిగిరి ఎంపీ పదవికి రేవంత్రెడ్డి రాజీనామా
-
Indian Navy: భారత నేవీలో 10వేల మందికి పైగా భారీగా సిబ్బంది కొరత: కేంద్రం
-
USA: ఇజ్రాయెల్ చెప్పిన దానికి.. ఫలితానికి చాలా తేడా ఉంది: బ్లింకెన్
-
UPSC Main Results: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ ఫలితాలు విడుదల
-
Raja singh: ‘ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్.. అయితే, నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను’