తెలుగుజాతి వెలుగుబిడ్డ లేరా.. గడపదాటి తిరగబడగ రారా..
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్న ఈ మాటలు... తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్కి నిరసనగా ఉద్యమించాల్సిందిగా తెలుగు ప్రజలకు పిలుపునిస్తూ రూపొందించిన పాటలోనివి.
చంద్రబాబుకు సంఘీభావంగా పాట
నిర్మాత అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో రూపకల్పన
అదిగో... అది ఉన్మాదం పాలిస్తున్న రాజ్యం..
ఖైదీలకు హోదాలొచ్చిన కాలం..
అది దుర్మార్గం శాసిస్తున్న నేల...
నియంత మరింత దిగజారిన వేళ...
ఏమిటీ అన్యాయం అని ఆలోచిస్తూ,
బాధపడుతూ ఆగిపోతే ఎలా?
తెలుగుజాతి వెలుగుబిడ్డ లేరా
గడపదాటి తిరగబడగ రారా..
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్న ఈ మాటలు... తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్కి నిరసనగా ఉద్యమించాల్సిందిగా తెలుగు ప్రజలకు పిలుపునిస్తూ రూపొందించిన పాటలోనివి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్, సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో రూపొందించిన అ పాటను బుధవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఆ పాటను ఒక వీడియోగా రూపొందించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ప్రజా వేదిక కూల్చివేత, మద్యం దుకాణాల వద్ద టీచర్లకు డ్యూటీలు వేయడం, డా.సుధాకర్ తదితర దళితులు, ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలు, చంద్రబాబు అరెస్ట్ దృశ్యాలు, దానికి నిరసనగా ఊరూరా సాగుతున్న ప్రదర్శనల్ని ఈ వీడియోలో పొందుపరిచారు. ‘‘ఒక్కడినే అనుకుంటూ ఆగింది ఇక చాలురా... వెనుకబడితే ముందు చరిత ఎవరు రాయలేరురా.. చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా... ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా .. ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా...’’ అంటూ ఎవరికి వారు మన ఒక్కరి వల్లే ఏమవుతుందని ఆగిపోరాదని ఉద్బోధించారు. ‘ఒక్కరొస్తే బంధిస్తారు.. వందలొస్తే భయపెడతారు... వేలు, లక్షలుగా కదిలి, కోటి మంది తరలి వెళితే.. కూటకాల అడ్డుగోడలెంతరా... మోసకారి కేసులు గల్లంతురా..’’ అంటూ అందరూ కలసి కట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్మకు బాలేదంటూ తప్పించుకోలేదు... అబద్ధమని తెలిసినా తప్పుగ మాట్లాడలేదు.. చట్టాన్ని గౌరవించి... న్యాయానికి విలువనిచ్చి.. చెయ్యని తప్పుకు నేడు చెరసాలకు నడిచినాడు...మన చంద్రన్న. రాక్షసరాజ్యం లక్ష్యం ఒక్కటే చంద్రన్నను బంధించి వేధించడమే...’’ అంటూ వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ని తప్పించుకోవడానికి వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కర్నూలు ఆస్పత్రి వద్ద సృష్టించిన హంగామాను పరోక్షంగా ప్రస్తావించారు.
తప్పు చేయకపోయినా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించి చంద్రబాబు అరెస్టయ్యారని తెలిపారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్తు కోసం కృషి చేసిన చంద్రబాబుకి, అందరూ సంఘీభావంగా నిలవాలంటూ... ‘‘మన భవితలకే బలమైనోడు... తన బలమే మనమవ్వగా వచ్చే సమయమే... తెలుగుజాతి వెలుగుబిడ్డలేరా.. గడపదాటి తిరగబడగ రారా... నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... నాటుక పోతున్నది పాలనలో ద్వేషం... విలువలు దిగజారినవి... బూతులు చెలరేగినవి... ప్రశ్నించిన గొంతులపై ఉరితాడులు మొలిచినవి...’’ అని పిలుపునిచ్చారు. ‘‘తప్పులు చుట్టి... కేసులు పెట్టి... ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా.. పద్ధతిలేదు.. పాలనరాదు... సైకోలా మనుషులపై కక్షగట్టెరా... అందుకే తెలుగుజాతి వెలుగుబిడ్డలేరా... గడపదాటి తిరగబడగ రారా... పసుపుకుంకుమ అందుకున్న అక్కచెల్లెలందరూ... పట్టిసీమ నీళ్లు తాగు రైతులు ప్రతి ఒక్కరూ... సాఫ్ట్వేర్ సోదరులు... సమభావన సహచరులు... అందరిలో ఉన్నవి చంద్రన్న అడుగుజాడలు.. పిడికిలి ఎత్తి పోదాం రండి... చంద్రన్నకు మద్దతుగా చేయి కలిపి రండి... ఆంధ్రులకు అర్థం ఆత్మగౌరవం... అని తెలిసిన అన్నగారి ఆవేశమవ్వండి..’’ అంటూ ఉత్తేజం నింపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాప్తానిపాలేనికి చెందిన కౌలు రైతు యార్లగడ్డ వీరప్రసాద్.. రూ.1.35 లక్షల పెట్టుబడితో ఆరెకరాల్లో వరి నాట్లు వేశారు. -
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
కృష్ణా నదిలో ఇసుక లోడింగ్ చేస్తుండగా హఠాత్తుగా వరద రావడంతో ఎడ్ల బండి, యజమాని కొట్టుకుపోయారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
Anantapuram: మహిళాశక్తి.. బైబిల్ భక్తి!
కలెక్టరేట్లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వాడుకోవడం వివాదాస్పదమైంది. -
‘ఇవి నగరాలు కావు..’ ప్రత్యక్ష నరకాలు
నగరాలు... మానవ ప్రగతికి చిహ్నాలు. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువత ఉపాధికి ఊతమిస్తాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తాయి. -
బాబోయ్ ‘ఖర్సయిపోతాం’!
అధికార వైకాపాలో కొన్ని లోక్సభ స్థానాల టికెట్లకు పెద్దలు అడుగుతున్న ‘పార్టీ ఫండ్’ అంకె విని అభ్యర్థులు గుడ్లు తేలేస్తున్నారు. -
తుపాను ఊడ్చేసింది
మిగ్జాం అపారమైన పంటనష్టాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. -
‘ఎన్నికల ముంగిట్లో..’ గ్రూపు-2 ముచ్చట!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన నేడు
మిగ్జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. -
రాజ్భవన్లో సాయుధ దళాల జెండా దినోత్సవం
-
‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకావిష్కరణ
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువారి ప్రస్థానానికి ప్రతిబింబమే ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకమని రచయిత మల్లికేశ్వరరావు కొంచాడ తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్లతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. -
గుంతల దారుల్లో కూరుకుపోతున్నా పట్టించుకోరేం?
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. -
అవే పనులు.. 2 సార్లు శంకుస్థాపనలు
దుర్గగుడిలో అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదం పోటు, కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద రాజద్వారంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. -
హైకోర్టు ముందు జగన్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు
‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు. -
Polavaram: ‘పదండి దూసుకు..’ పదండి వెనక్కి!
పోలవరం... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. -
మీ ఓటు నమోదు చేసుకోండిలా..
ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తారుమారు కావచ్చు. అందునా రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ కీలకమే. -
రూ.5 కోట్లతో కడితే.. మరుగుదొడ్ల పక్కన పడేశారు!
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి కనకదుర్గానగర్ మీదుగా వెళ్లే మార్గంలో భక్తుల రాకపోకలకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లతో రాతి మండప దారిని నిర్మించారు. -
‘పెట్టింది తినాలి..’ పెట్టకపోతే పస్తులుండాలి!
టోఫెల్ శిక్షణ, ట్యాబ్లూ, స్మార్ట్టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు... ట్రిపుల్ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. -
ప్రకాశం బ్యారేజీ 30 గేట్ల ఎత్తివేత
భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి గురువారం ఉదయం సుమారు 30,000 క్యూసెక్కుల మేర వరద వచ్చింది. -
భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం
బాపట్ల జిల్లా భర్తిపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా సానుభూతిపరులు ధ్వంసం చేశారు. -
కేజీబీవీ కార్యదర్శికి జాతీయ అవార్డు
విద్యారంగంలో ఉత్తమ ఆవిష్కరణలు, అభ్యసన విధానం అమలుకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కార్యదర్శి మధుసూదనరావుకు జాతీయ అవార్డు లభించింది.


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: శనివారం నుంచి యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Prakasam: గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన రెండో గేటు
-
Rashmika: ఒక నటిగా సందీప్ను ఎన్నోసార్లు ప్రశ్నించా..: రష్మిక
-
YouTube: యూట్యూబ్లో ఇక కామెంట్లను పాజ్ చేయొచ్చు!
-
Royal Enfield: తుపాను బాధిత కస్టమర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ సాయం
-
Aditya L1: ఆదిత్య తీసిన ‘సూర్యుడి’ అరుదైన చిత్రాలు!