దీక్ష పూనిన అభిమానం
అభిమాన నాయకుడి కోసం ఊరూ వాడా కదిలింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్ష పూనింది. ‘సత్యమేవ జయతే’ అంటూ నినదించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో తెలుగువారున్న ప్రతిచోటా సోమవారం పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు జరిగాయి.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఊరూవాడా నిరాహార దీక్షలు
గాంధీ జయంతినాడు ‘సత్యమేవ జయతే’ నినాదంతో..
రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, కాగడాలతో సంఘీభావం
దేశ, విదేశాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు
ఈనాడు - అమరావతి
అభిమాన నాయకుడి కోసం ఊరూ వాడా కదిలింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్ష పూనింది. ‘సత్యమేవ జయతే’ అంటూ నినదించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో తెలుగువారున్న ప్రతిచోటా సోమవారం పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు జరిగాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో చేపట్టిన దీక్షలకు విశేష స్పందన లభించింది. వేల సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా నియోజకవర్గాల్లో దాదాపు అన్ని గ్రామాల్లోనూ దీక్షలు జరిగాయి. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన దీక్షకు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సహా వేల సంఖ్యలో మహిళలు హాజరై సంఘీభావం తెలిపారు. దిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దీక్ష చేశారు. పార్టీ ఎంపీలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో ఆయనతోపాటు దీక్షలో పాల్గొన్నారు. తెదేపా ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, ఇతర నాయకులు ఆయా నియోజవర్గాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తదితరులు లోకేశ్ ఇన్ఛార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కడపలో బలిజ సంఘాల ఆధ్వర్యంలోర్యాలీ నిర్వహించారు. జనసేన, సీపీఐ నాయకులు పలు చోట్ల మద్దతు ప్రకటించారు. విజయవాడ దీక్షలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. దీక్షకు కొనసాగింపుగా సోమవారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శనలు నిర్వహించి, సంఘీభావం ప్రకటించారు. ట్విటర్లో ‘భువనమ్మ దీక్ష’ హ్యాష్ ట్యాగ్ టాప్-3లో చాలాసేపు ట్రెండింగ్లో నిలిచింది.
హైదరాబాద్లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల దీక్ష
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నిరాహారదీక్ష చేశారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తె నిష్క, నారా రోహిత్ తల్లి ఇందిర తదితరులు పాల్గొన్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తదితరులతో కలిసి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నిరాహార దీక్ష చేశారు.
- అనంతపురం జిల్లా రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత నిరాహార దీక్ష చేశారు. మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో, కాల్వ శ్రీనివాసులు రాయదుర్గంలో దీక్షలో పాల్గొన్నారు. తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి.. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద దీక్ష చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు జరిగాయి.
- మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అవనిగడ్డలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి దీక్ష చేశారు.
- గుంటూరులో తెదేపా నాయకుడు ఉయ్యూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 రోజుల్లో సుమారు 2 వేల మంది పాల్గొన్నారు.
- గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పెద్ద ఎత్తున వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతుగా తెదేపా సానుభూతిపరులు రాత్రి 7 గంటల నుంచి అయిదు నిమిషాలపాటు ఇళ్లలో లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించారు.
- ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు జరిగాయి. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో రుద్ర, నవ చండీ హోమాలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం తిరుపతిలో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: రేపు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ రద్దు కేసు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు ఈ నెల 20వ తేదీన ఇచ్చిన సాధారణ బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన కేసు సుప్రీంకోర్టు ముందు మంగళవారం విచారణకు రానుంది. -
‘అనంత’ రైతుకు అంతర్జాతీయ గుర్తింపు
ఐక్యరాజ్యసమితి, కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య స్థాపించిన కర్మవీర్ చక్ర అవార్డు 2023-24 నారాయణప్పను వరించింది. -
దోపిడీకి రాజమార్గం
తెదేపా హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం తప్పంటూ గనుల శాఖ డైరెక్టర్, ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకటరెడ్డి గతంలో ఫిర్యాదు చేశారు. -
AP Ministers: మంత్రుల్లో సగం మందికి టికెట్లు అనుమానమే!
మంత్రుల్లో సగం మందికి మళ్లీ టికెట్ దక్కుతుందనే స్పష్టత ఇంకా లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 25 మంది మంత్రుల్లో 11 మందికే ఈసారి టికెట్లపై స్పష్టత కనిపిస్తోంది. -
పీజీ మెడికల్ సీట్ల స్కామ్పై జగన్ కిమ్మనరేం?
వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు సంబంధించి యావద్దేశం నివ్వెరపోయే భారీ కుంభకోణం రాష్ట్రంలో జరిగినా జగన్ ప్రభుత్వం కిమ్మనడం లేదు. -
తిరుమలకు ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆయన సోమవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
ఒకే ఇంటి నంబరుతో వందల ఓట్లు!
బందరు నియోజకవర్గంలో ఇంటి నంబరు 14/196లో ఏకంగా 97 ఓట్లు నమోదవడం కలకలం రేగుతోంది. దాదాపు ఇదే తరహాలో కొన్ని వందల ఓట్లు నమోదయ్యాయి. -
శ్రీశైలంలో వైభవంగా జ్వాలా తోరణోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం జ్వాలా తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
అదిరేటి అరటి
అరటి గెలకు సాధారణంగా 13 అత్తాలుండటం పరిపాటి. అటువంటిది ఏకంగా 23 అత్తాలున్న గెల (కూర అరటి) డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో ఆదివారం కనిపించింది. -
వేంకన్న సన్నిధి వెలుగుల నిధి
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తిక పర్వదీపోత్సవం కనులపండువగా జరిగింది. -
ఇంద్రకీలాద్రిపై కొండంత వెలుగు
కార్తిక పౌర్ణమి వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం కోటి దీపోత్సవం నిర్వహించారు. -
లక్ష్యాల పేరుతో అధికారుల వేధింపులు
లక్ష్యాల పేరుతో పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజినీర్లకు రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు నరకం చూపిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైకాపా నాయకుల స్వలాభంతో పేదలకు అన్యాయం
కాసులకు కక్కుర్తి పడిన వైకాపా నాయకులు చౌడు నేలలు, క్వారీల బాంబ్ బ్లాస్టింగ్లు జరిగే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు. -
బరితెగిస్తున్న మైనింగ్ మాఫియా
మైనింగ్ మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో తెల్లరాయి అక్రమంగా తరలిపోతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ పరిధిలో 32 ఎకరాల్లో మైకా గనులు ఉన్నాయి. -
ఓటర్ల జాబితాలో సిత్రాలెన్నో!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా పరిశీలనలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే పేరుతో ఉన్న ఓటర్లకు మీ ఓటు ఎక్కడ ఉంచాలో తెలపాలని నోటీసులు అందితే, పేర్లు, ఫొటోలు వేరైనా మీకు రెండు చోట్ల ఓటు ఉంది. -
చర్మకారులపై ఇదేనా శ్రద్ధ?
రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు ఇరుసుల్లాంటివి. యువత భవిష్యత్తును నిర్దేశించే వీటిని ఏర్పాటుచేసేందుకు ఏ ముఖ్యమంత్రి అయినా అత్యంత ప్రాధాన్యమిస్తారు. -
‘వీల్ఛైర్లు ఉండవు..’ స్ట్రెచర్లు కనబడవు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్.ఆర్. పురం మండలం పిలార్కుప్పం గ్రామానికి చెందిన 70ఏళ్ల జయన్న గత నెల పాముకాటుకు గురయ్యారు. -
51 రోజుల పాటు ‘ఆడుదాం ఆంధ్ర’
ఈ పోటీల కోసం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మస్కట్ను విడుదల చేసింది. ఆ బొమ్మకు వైకాపా రంగుల చొక్కా, మధ్యలో పొట్టపై నవరత్నాలతో కూడిన జగన్ చిత్రాన్ని ముద్రించడం విశేషం. -
రాజ్యాంగం దేశానికి మూల స్తంభం
‘‘రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదు. మారుతున్న ప్రజల ఆకాంక్షలు, అవసరాలను ప్రతిబింబించే సామాజిక, రాజకీయ డాక్యుమెంట్’’ అని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
రాజకీయ జోక్యం లేని న్యాయవ్యవస్థ అవసరం
రాజకీయ జోక్యం లేని న్యాయ వ్యవస్థతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని దిల్లీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ రేఖాశర్మ అన్నారు. -
డిసెంబరు నుంచి ఇంటింటికీ సర్పంచులు
రాష్ట్రంలోని సర్పంచుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు రాజీలేని పోరాటం చేస్తామని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Tirupati: తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి..14 మందికి గాయాలు
-
WHO: ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి తప్పని వేధింపులు!
-
Black Sea: తుపాను బీభత్సం.. 20 లక్షలమంది అంధకారంలో!
-
Akshara singh: ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్లో చేరిన భోజ్పురి నటి అక్షర సింగ్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chelluboyina Venugopal: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు గుండె నొప్పి