రాష్ట్ర పరిస్థితి చూసి సిగ్గుపడాలా? జాలిపడాలా?
చూడడానికి వాళ్లు బుడతలే. కానీ వారి ప్రతి పలుకు ఆలోచింపజేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతూ జగన్ అరాచక పాలనను ఎండగడుతూ నాయకులకు దీటుగా ప్రసంగిస్తూ చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు.
‘సత్యమేవ జయతే దీక్ష’లో చిచ్చర పిడుగుల గర్జన
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ: చూడడానికి వాళ్లు బుడతలే. కానీ వారి ప్రతి పలుకు ఆలోచింపజేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతూ జగన్ అరాచక పాలనను ఎండగడుతూ నాయకులకు దీటుగా ప్రసంగిస్తూ చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన దీక్షలో పలువురు చిన్నారులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓ ముస్లిం బాలిక చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని వేదికపై ప్రార్థించగా మరికొందరు చిన్నారులు తమ వాగ్ధాటితో కట్టిపడేశారు.
రాజధాని లేని, నేరస్థులు పాలిస్తున్న రాష్ట్రం
ధర్మం తప్పని రాముడికి అరణ్యవాసం. అవినీతి చేయని చంద్రుడికి జైలు వాసం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడాలా? సిగ్గుపడాలా? జాలిపడాలా? అంటూ రాజమహేంద్రవరానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి ఎ.పార్థు ప్రశ్నించాడు. దీక్షా వేదికపై నుంచి వేల మందిని ఉద్దేశించి మాట్లాడాడు. ‘దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నేరస్థులు పాలిస్తున్న రాష్ట్రం.. ముద్దాయిలు మంత్రులైన రాష్ట్రం.. ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము ఖర్చుచేసే రాష్ట్రం.. చట్టసభల్లో బూతులు మాట్లాడే రాష్ట్రం.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే రాష్ట్రం దేవుడి డబ్బులు ఖర్చుచేసి తల నీలాలు అమ్ముకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి, భజన చేసే వారికి మంత్రి పదవులు ఇచ్చిన రాష్ట్రం.. పరిపాలన గాలికి వదిలేసి సినిమా టికెట్లు, చేపలు, మాంసం అమ్ముకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2024 ఎన్నికల్లో తెదేపా గెలుపు కోసం మీరంతా కృషి చేస్తే అది మా లాంటి వేల మంది పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సైకిల్ గుర్తుకు ఓటేసి. తెదేపాను గెలిపించండి’ అని పార్థు తన ప్రసంగాన్ని ముగించాడు.
ఆకట్టుకున్న ప్రసంగం
గూడూరుకు చెందిన బాలుడు అనిత్ మాట్లాడుతూ.. ‘అయిదు కోట్ల ఆంధ్రులకు బాసటగా ఉన్న చంద్రబాబును సైకో జగన్ అరెస్టు చేయించారు. తెలుగు ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ముందుచూపుతో ఆలోచించిన పార్టీ తెదేపా. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు. యువగళంతో ఒంటికి అలుపు, కంటికి నిద్ర లేకుండా భార్యాబిడ్డలను చూడకుండా, కాళ్ల నొప్పులు వచ్చినా వెరవకుండా పోరాడుతున్న తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నకు అభినందనలు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం. నేను చంద్ర తాతయ్యతో కలిసి ప్రజలకు సేవచేస్తా. మనం గెలుద్దాం. మనం అభివృద్ధి చెందుదాం. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు అరికట్టాలంటే చంద్రన్న రాజ్యం రావాలి’ అంటూ అనిత్ పిలుపునిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
వైకాపా తన ప్రచారానికి దేనిని వదలడం లేదు. చివరికి ప్రభుత్వ నిధులతో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలకు సంబంధించిన పరికరాలను సైతం పార్టీ ప్రచారానికి వాడుకుంటోంది. -
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్మెన్ సుజిత్ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్ప్రెస్కు సోమవారం పెను ప్రమాదం తప్పింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రామాణిక విద్యకు ఛార్జి మెమోలే పరిష్కారమా?
ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసి, ఛార్జిమెమో ఇవ్వడం ద్వారా విద్యారంగంలోని సమస్యలు పరిష్కారం అవుతాయా అని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
ఏపీలో ఎయిర్ఫైబర్ సేవలు విస్తరించిన జియో
రిలయన్స్ జియో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఎయిర్ఫైబర్ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
Ramana Deekshitulu: తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు
తితిదే అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్ (ట్విటర్)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. -
ఐఐటీఎఫ్లో ఏపీ పెవిలియన్కు మూడో బహుమతి
దేశ రాజధాని దిల్లీ ప్రగతిమైదాన్లో ఈనెల 14 నుంచి 27 వరకు నిర్వహించిన భారత అంతర్జాతీయ వ్యాపారమేళా (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ఫెయిర్- ఐఐటీఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసిన పెవిలియన్కు మూడో బహుమతి దక్కింది. -
కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప!
విద్యుత్ పంపిణీ సంస్థలకూ (డిస్కంలు) జగన్ ‘షాక్’ తప్పలేదు. ఈ ఏడాది జులై నాటికి వాటి నెత్తిన ప్రభుత్వం రూ.19 వేల కోట్ల కొత్త అప్పులు పెట్టింది. ఇప్పటికే డిస్కంలు నెలవారీ నిర్వహణ ఖర్చులకూ సతమతమవుతున్నాయి. -
అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో అంచనాలకు మించి తరలివచ్చారు. సుమారు రెండు లక్షలకు పైగా ప్రదక్షిణలో పాల్గొన్నారని అధికారుల అంచనా. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
స్మార్ట్మీటర్ల ఏర్పాటు.. మోదీ మెప్పుకోసమే
‘స్మార్ట్మీటర్ల ఏర్పాటును భాజపా పాలిత రాష్ట్రాలు సహా అందరూ వ్యతిరేకిస్తున్నారు. మోదీ మెప్పు కోసం ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల వ్యవసాయ పంపుసెట్లు సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్మార్ట్మీటర్లను బిగించడానికి సన్నాహాలు చేస్తోంది’ -
రాజధానిలో యథేచ్ఛగా రహదారుల విధ్వంసం
రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం బోరుపాలెం ఇసుక రీచ్ వద్ద రోడ్డు తవ్వుకుపోయిన దొంగలు.. -
పుడమితల్లికి సేవ.. లాభాల సాగుకు తోవ
ఏ పంటైనా సరే.. విత్తు దగ్గర నుంచి కోత వరకు కనీసం 60- 180 రోజుల సమయం పడుతుంది. అదే ప్రతివారం ఏదో ఒక పంట కోతకు వచ్చి ఆదాయం చేతికందితే ఎలా ఉంటుంది. అదే చేసి చూపించారు.. అనంతపురం జిల్లాకు చెందిన రైతు నారాయణప్ప. -
పశువులూ అల్లాడుతున్నాయ్!
నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి. -
వచ్చామా.. చూశామా.. వెళ్లామా..!
ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన హడావుడిగా సాగింది. కొన్ని చోట్ల ఆయన పదేసి నిమిషాలపాటు మాత్రమే పరిశీలించారు. -
Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
పెద్దిరెడ్డి ఇలాకాలో భూసేకరణపై రైతుల మండిపాటు
విద్యుత్తు బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్కు తమ భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. -
వెలిగొండ గుండె మండుతోంది!
వచ్చే ఏడాది సెప్టెంబరు, అక్టోబరుకల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, జలాశయంలో నీటిని నిలుపుతాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టు నిర్వాసితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ప్యాకేజీ అందిస్తాం. -
డి-ఫార్మసీ(పాలిటెక్నిక్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కళాశాలల్లో డి-ఫార్మసీ కోర్సు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. -
ఇటొస్తే.. ఇరుక్కున్నట్లే..!
గుంతల రహదారులు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. రాకపోకలు సాగించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రహదారుల దుస్థితికి ఈ చిత్రం నిదర్శనం.


తాజా వార్తలు (Latest News)
-
Kriti Sanon: అల్లు అర్జున్తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
-
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!
-
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
-
అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం నో: కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు
-
Animal: అసలు రన్ టైమ్ 3 గంటల 21నిమిషాలు కాదు.. తెలిస్తే షాకే!
-
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!