బాబు అరెస్టుతో మనోవేదనకు గురై మరో నలుగురి మృతి
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదనకు గురై మరో నలుగురు మృతి చెందారు. చంద్రబాబును నిర్బంధించారని మనస్తాపానికి గురై విశాఖ నగరం గాజువాక భానోజీతోటకు చెందిన ఉప్పలపాటి సరోజిని(58) ఆదివారం రాత్రి మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
న్యూస్టుడే బృందం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదనకు గురై మరో నలుగురు మృతి చెందారు. చంద్రబాబును నిర్బంధించారని మనస్తాపానికి గురై విశాఖ నగరం గాజువాక భానోజీతోటకు చెందిన ఉప్పలపాటి సరోజిని(58) ఆదివారం రాత్రి మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే కోవలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామ తెదేపా ప్రధాన కార్యదర్శి వేముల రామారావు(53) సోమవారం, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ శివారు గవర్ల అనకాపల్లికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త మత్తుర్తి వెంకటరావు (53) ఆదివారం రాత్రి, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామానికి చెందిన దేవినేని శకుంతల(82) ఆదివారం మృతిచెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత బీమాపై జగన్నాటకం!
కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పోర్టల్లో ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నమోదైన ఈ వివరాలు నివ్వెర పరుస్తున్నాయి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో ఈ సీజన్ మొత్తంలో సాగైన పంటల విస్తీర్ణం 0.04 హెక్టార్లేనా? పంట పండిస్తున్న రైతులు 16 మందేనా.. అని ఆశ్చర్యం కలుగుతోందా...? -
అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలొద్దు
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు, ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందకుండా రాష్ట్రంలో ఇసుక రీచ్లలో తవ్వకాలు చేపట్టడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. -
బలహీనపడిన తుపాను
మిగ్జాం తీవ్ర తుపాను తీరం దాటాక.. కోస్తాను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో ముంచెత్తింది. -
ఓటర్ల మెడపై నోటీసుల కత్తి
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల మెడపై కత్తి పెడుతోంది. ‘‘మీ ఫొటోతో పలానా పలానా చోట్ల ఓట్లున్నాయి. వాటిల్లో దేన్ని తొలగించాలి? దేన్ని కొనసాగించాలి? నిర్దేశిత తేదీలోగా తెలపండి’’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి నోటీసులిస్తోంది. -
నాడు ఆదర్శం... నేడు నిర్వీర్యం
రాళ్లూరప్పలూ.. కొండలూగుట్టలూ.. నడిచేందుకూ వీలులేని దారుల్లో... డోలీ మోతల్లో గిరిశిఖర గ్రామాల మహిళలు పడే ప్రసవ వేదన మాటల్లో చెప్పలేనిది. చిమ్మచీకటి, జోరు వర్షం నడుమ సకాలంలో వైద్యం అందక, పురిటినొప్పులు భరించలేక ఊపిరి వదిలిన తల్లులెందరో. అమ్మఒడిని చేరకుండానే రాలిపోయిన పసిబిడ్డలు ఇంకెందరో. -
వాన ముంచింది.. అన్నదాత గుండె ఆగింది
భారీ వర్షానికి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలోనే రైతు కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన బుధవారం పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకుంది. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
జగనన్న కాలనీలా.. చెరువులా?
‘ఇళ్లు కాదు...అవి ఊళ్లు’...జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన అనుచరగణమంతా చెప్పే మాటే ఇది. ఆ ఊళ్లను ఎంత సురక్షితంగా కడుతున్నారో....ఒక్క వర్షం వస్తే ఇట్టే తెలిసిపోతోంది. -
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి ఎట్టకేలకు విడుదల చేసింది. -
జగన్ ప్రభుత్వమా.. మజాకా
వాహనాల రద్దీ పెరిగే కొద్దీ గ్రామీణ రహదారులను జిల్లా రహదారులుగా, రాష్ట్ర రహదారులుగా, జాతీయ రహదారులుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. -
సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై దృష్టి పెట్టండి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. -
వివేకా హత్య కేసులో అభియోగాల నమోదుపై 20న విచారణ
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై అభియోగాల నమోదు నిమిత్తం సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త సాఫ్ట్వేర్, మొబైల్ యాప్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త సాఫ్ట్వేర్, మొబైల్ అప్లికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందిస్తోంది. -
మునిగేది రైతన్న.. ముంచేది ఎవరన్న?
మొన్న ఏం జరిగింది? నిన్న దాని ప్రభావం ఏమిటి? నేడు ఎలా ముందుకెళ్లాలి... అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. -
నిర్మాణాలపై మూడో పక్షానికి హక్కులు కల్పించొద్దు
భూ కేటాయింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్కు కేటాయించిన 12.51 ఎకరాలను రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
విశాఖకు కార్యాలయాల తరలింపు వ్యాజ్యంపై ఏజీ అభ్యంతరం
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం.. హైకోర్టు సింగిల్ జడ్జి వద్దకు విచారణకు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. -
క్రమబద్ధీకరణ హామీకి నాలుగేళ్లు
‘మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా. నిశ్చింతగా ఉండండి’ అని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటినా ఇంత వరకు ప్రభుత్వాసుపత్రుల్లోని ట్రామాకేర్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ కార్యరూపం దాల్చలేదు. -
చికిత్స వ్యయం మరో రూ.20 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు వ్యయమయ్యే చికిత్సను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. -
చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ 12కి వాయిదా
ఉచిత ఇసుక విధానం, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
అంబేడ్కర్ స్ఫూర్తితో దళితుల సంక్షేమం
బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో దళితుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత దీక్షతో కొనసాగిద్దామని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.