సీబీఎస్ఈ పాఠశాల పరీక్షల విధానంలో మార్పు
రాష్ట్రంలో సీబీఎస్ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పదోతరగతిలో ఆరో సబ్జెక్టుగా స్కిల్ పరీక్ష
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సీబీఎస్ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలుండగా వాటిని పీరియాడిక్, టర్మ్ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నారు. పీడబ్ల్యూటీలు మొత్తం నాలుగు ఉంటాయి. టర్మ్ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్-1 నవంబరులో, టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పదో తరగతిలో అయిదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు ఉంటుంది. మూడో భాష హిందీ ఉండదు. ఆరో సబ్జెక్టుగా స్కిల్ సబ్జెక్టును అమలు చేయనుండగా 50 మార్కులు థియరీ, 50 మార్కులు ప్రాక్టికల్స్ ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Cyclones: ఏపీలో అయిదు దశాబ్దాల్లో 60 తుపాన్లు
వాతావరణ మార్పులు, ఇతర కారణాలతో బంగాళాఖాతంలో తుపాన్ల సంఖ్య తగ్గినా.. అప్పుడప్పుడు ఏర్పడినవే తీవ్ర రూపం దాల్చుతున్నాయి. -
తనఖా బంగారం పోతే బ్యాంకుదే బాధ్యత
ఆర్థిక అవసరాలు వస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, నగదు అప్పు తెచ్చుకోవడం సులభమైన మార్గం. -
Polavaram: పోలవరంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. -
గాఢాంధకారంలో గ్రామాలు.. పట్టణాలు!
మిగ్జాం తుపాను ప్రభావంతో గాలులు, వర్షాలతో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్సరఫరా నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. -
Tirumala: ఇదేమి అన్న ప్రసాదం?
తిరుమలలో నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగ్గా లేదంటూ పలువురు భక్తులు తితిదే సిబ్బందిపై తిరగబడ్డారు. -
AP Unemployment: రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య
జాబ్ క్యాలెండర్ల జాడ లేదు... డీఎస్సీ మాటే లేదు... పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులకు ఇప్పటికీ మోక్షం లేదు... గ్రూప్-1, 2 కొలువుల భర్తీకి అతీగతీ లేదు... నాలుగున్నరేళ్ల వైకాపా పాలనలో ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూసి.. చూసి నిరుద్యోగుల గుండెలు పగిలిపోతున్నాయి. -
అన్నదాతను దెబ్బతీసిన మిగ్జాం
ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద.. వాననీటిలో తేలుతున్న వరి ఓదెలు.. కోతకు వచ్చిన పనలు నేలవాలి నీటమునగడంతో గల్లంతైన ఆశలు.. కుప్పలు పోసినా చెమ్మ చేరి దెబ్బతింటున్న ధాన్యం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే చేజారిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు.. కోస్తా జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. -
అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు జగన్ వికృత రూపం
రాష్ట్రంలోని రైతులు ఏటికేడు నష్టాల ఊబిలోకి దిగబడుతున్నారు. ప్రకృతితోపాటు వైకాపా సర్కారు పనితీరూ ఇందుకు కారణం. -
దేవాదాయశాఖలో ఉప, సహాయ కమిషనర్ పోస్టుల పెంపు
దేవాదాయశాఖ పరిధిలోని సంయుక్త కమిషనర్ (జేసీ), ఉప కమిషనర్ (డీసీ), సహాయ కమిషనర్ (ఏసీ), గ్రేడ్-1 ఈఓ పోస్టుల సంఖ్యలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. -
ఎస్టీ రిజర్వేషన్లతోనే వాల్మీకి బోయలకు న్యాయం
ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తేనే వాల్మీకి బోయలకు న్యాయం జరుగుతుందని, ఆ రిజర్వేషన్ సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరు సుభాష్ చంద్రబోస్ అన్నారు. -
3 నెలలుగా జీతాలందక ఎస్ఎస్ఏ ఉద్యోగుల అవస్థలు
మూడు నెలలుగా జీతాలు అందక సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. -
ఐఎస్ఏఎం కింద ఏపీకి రూ.39.97 కోట్లు విడుదల
సమీకృత వ్యవసాయ మార్కెటింగ్ పథకం (ఐఎస్ఏఎం) కింద ఆంధ్రప్రదేశ్కు 2020-21 నుంచి 2023-24 వరకు వివిధ ప్రాజెక్టులకు రూ.39.97 కోట్లు రాయితీ రూపంలో విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. -
3 వేల కి.మీ. రహదారులు ధ్వంసం
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కి.మీ. మేర ఆర్అండ్బీ రహదారులు ధ్వంసమయ్యాయి. సోమ, మంగళవారాల్లో జరిగిన నష్టాన్ని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
సర్కారు వారి బలవంతపు ఆట!
జగన్ ఆడమని చెబితే ఆడాల్సిందే... పోకిరి సినిమాలో ప్రకాష్రాజ్ అన్నట్టు గిల్లితే గిల్లించుకోవాల్సిందే..! మాకు ఆడటం తెలియదు మహాప్రభో వదిలేయండని మొత్తుకున్నా ప్రభుత్వం వినదు! -
కొండచరియలు పడి పట్టాలు తప్పిన గూడ్సు రైలు
కొత్తవలస - కిరండూల్ (కేకే) లైన్లో వెళ్తున్న గూడ్సు రైలుపై కొండచరియలు పడటంతో ఇంజిన్, ఓ బోగి పట్టాలు తప్పాయి. -
అరకు ఘాట్లో జారిపడిన కొండచరియలు
మిగ్జాం తుపాను కారణంగా అరకు ఘాట్ రోడ్డులో కొండచరియలు జారిపడటంతో అర్ధరాత్రి సమయంలో పర్యాటకులు అవస్థలు పడాల్సి వచ్చింది. -
పోలీసుల అకృత్యాల్లో మనదే ‘ఘనత’
ఎవరైనా న్యాయం కోసం పోలీసుస్టేషన్ను ఆశ్రయిస్తే బాధితులనే లాఠీలతో చితకబాదుతున్నారు. అధికార పార్టీ నాయకులకు ఎదురుతిరిగితే చాలు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. -
ఆరడుగులు మించిన అరటి గెల!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన తోటలో బొంత బక్కీస్ రకం అరటి గెల ఆరు అడుగులకు పైగా పెరిగింది. -
హజ్ యాత్రికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
హజ్కు వెళ్లే యాత్రికులు ఈ నెల 20 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్ లాజామ్ తెలిపారు. -
నిబంధనల మేరకు ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు చేయండి
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల 2023-26 సంవత్సర శ్లాబ్ కాలానికి చట్ట నిబంధనల మేరకు ఫీజులను నిర్ణయించాలని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. -
అమరావతి అభివృద్ధిలో అలసత్వం తగదు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలికవసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చూపిన అలసత్వం పట్ల రాజ్యసభ ఎష్యూరెన్స్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
TS High Court: రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ పక్కనున్న వ్యక్తీ కారణమంటే ఎలా..?
-
Rapido: క్యాబ్ సేవల విభాగంలోకి ర్యాపిడో
-
Cyclones: ఏపీలో అయిదు దశాబ్దాల్లో 60 తుపాన్లు
-
Vijayawada: నేడూ విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు
-
Congress: కొత్త ఎమ్మెల్యేలకు చిన్నారెడ్డి, నాగేశ్వర్ పాఠాలు
-
Donakonda: అబ్బో.. దొనకొండపై ప్రేమే!