గ్రామ సచివాలయంలో పింఛన్ సొమ్ము హాంఫట్
గ్రామ సచివాలయానికి తీసుకొచ్చిన పింఛన్ల సొమ్ములో రూ.50 వేలు హాంఫట్ అయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.
వైకాపా నాయకుడి సమక్షంలో తెగిన పంచాయితీ
ఈనాడు, కర్నూలు: గ్రామ సచివాలయానికి తీసుకొచ్చిన పింఛన్ల సొమ్ములో రూ.50 వేలు హాంఫట్ అయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామ సచివాలయానికి చెందిన సంక్షేమ సహాయకురాలు మండల కేంద్రం నుంచి సోమవారం పింఛన్ సొమ్ము తెచ్చి సచివాలయంలో ఉంచారు. కాసేపటి తర్వాత చూడగా అందులో రూ.50 వేలు తగ్గాయి. దీంతో అక్కడున్న ఏడుగురు వాలంటీర్లను ప్రశ్నించగా తమకేమీ తెలియదని వారు సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి దృష్టికి ఆ ఉద్యోగి తీసుకెళ్లారు. తగ్గిన సొమ్మును సర్దుబాటు చేసేందుకు ఒక్కో లబ్ధిదారుకూ రూ.100 తగ్గిద్దామని వాలంటీర్లలో కొందరు సలహా ఇవ్వగా కార్యదర్శి అందుకు ఒప్పుకోలేదు. చేసేదిలేక ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయం మండల వైకాపా నాయకుడి వద్దకు వెళ్లడంతో ఆయన వారిని పిలిపించారు. పార్టీ పరువు పోతుందని చెప్పి వాలంటీర్లను హెచ్చరించారు. అనంతరం వాళ్లలో వాళ్లు సర్దుబాటు చేసుకుని సొమ్ము జమ చేసేలా పంచాయితీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వాలంటీర్లను ఇక ఎలా నమ్మాలంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు నోరు మెదపలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాన ముంచింది.. అన్నదాత గుండె ఆగింది
భారీ వర్షానికి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలోనే రైతు కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన బుధవారం పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకుంది. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
జగనన్న కాలనీలా.. చెరువులా?
‘ఇళ్లు కాదు...అవి ఊళ్లు’...జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన అనుచరగణమంతా చెప్పే మాటే ఇది. ఆ ఊళ్లను ఎంత సురక్షితంగా కడుతున్నారో....ఒక్క వర్షం వస్తే ఇట్టే తెలిసిపోతోంది. -
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి ఎట్టకేలకు విడుదల చేసింది. -
జగన్ ప్రభుత్వమా.. మజాకా
వాహనాల రద్దీ పెరిగే కొద్దీ గ్రామీణ రహదారులను జిల్లా రహదారులుగా, రాష్ట్ర రహదారులుగా, జాతీయ రహదారులుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. -
సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై దృష్టి పెట్టండి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. -
వివేకా హత్య కేసులో అభియోగాల నమోదుపై 20న విచారణ
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై అభియోగాల నమోదు నిమిత్తం సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త సాఫ్ట్వేర్, మొబైల్ యాప్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త సాఫ్ట్వేర్, మొబైల్ అప్లికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందిస్తోంది. -
మునిగేది రైతన్న.. ముంచేది ఎవరన్న?
మొన్న ఏం జరిగింది? నిన్న దాని ప్రభావం ఏమిటి? నేడు ఎలా ముందుకెళ్లాలి... అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. -
నిర్మాణాలపై మూడో పక్షానికి హక్కులు కల్పించొద్దు
భూ కేటాయింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్కు కేటాయించిన 12.51 ఎకరాలను రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
విశాఖకు కార్యాలయాల తరలింపు వ్యాజ్యంపై ఏజీ అభ్యంతరం
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం.. హైకోర్టు సింగిల్ జడ్జి వద్దకు విచారణకు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. -
క్రమబద్ధీకరణ హామీకి నాలుగేళ్లు
‘మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా. నిశ్చింతగా ఉండండి’ అని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటినా ఇంత వరకు ప్రభుత్వాసుపత్రుల్లోని ట్రామాకేర్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ కార్యరూపం దాల్చలేదు. -
చికిత్స వ్యయం మరో రూ.20 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు వ్యయమయ్యే చికిత్సను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. -
చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ 12కి వాయిదా
ఉచిత ఇసుక విధానం, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
అంబేడ్కర్ స్ఫూర్తితో దళితుల సంక్షేమం
బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో దళితుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత దీక్షతో కొనసాగిద్దామని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన వియ్యంకుడి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి నెలకొంది. -
.తాడిపత్రిలో బోగస్ ఓట్లు చేర్చారని నిరసన
అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా బోగస్ ఓట్లు చేర్చారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా కౌన్సిలర్లతో బైఠాయించి నిరసన తెలిపారు. -
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల మధ్య తేడా తెలియడం లేదు
‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమం ప్రభుత్వానిదో, పార్టీదో తెలియటం లేదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ(సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ వ్యాఖ్యానించారు. -
నిండా మునిగిన వరి రైతు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 20 శాతం ధాన్యం కూడా ఇప్పటి వరకు తరలించలేదు. -
రోడ్లకు రూ.2 వేల కోట్ల నష్టం
మిగ్జాం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో 3,700 కి.మీ.మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.