వాట్సప్లో ప్రశ్నపత్రాలు.. బోర్డుపై ప్రశ్నలు
పాఠశాల స్థాయి పరీక్షల్లో ఎన్నో మార్పులు చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. విద్యార్థులకు కనీసం ప్రశ్నపత్రాన్ని ముద్రించి ఇవ్వలేకపోతోంది.
నేటి నుంచి ఫార్మెటివ్-2 పరీక్షలు
ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులివ్వని ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: పాఠశాల స్థాయి పరీక్షల్లో ఎన్నో మార్పులు చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. విద్యార్థులకు కనీసం ప్రశ్నపత్రాన్ని ముద్రించి ఇవ్వలేకపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3 (మంగళవారం) నుంచి 6వ తేదీ వరకు ఫార్మెటివ్-2 పరీక్షలను నిర్వహించనుండగా వీటి ప్రశ్నపత్రాలను వాట్సప్ల్లో పంపిస్తామంటూ ఎస్సీఈఆర్టీ ఆదేశాలు ఇచ్చింది. పరీక్షకు ముందు రోజు రాత్రి ప్రశ్నపత్రాలు జిల్లా అధికారులకు పంపిస్తారు. అక్కడి నుంచి ప్రధానోపాధ్యాయుడికి చేరతాయి. ఇలా వాట్సప్ల్లో పంపిస్తున్న సమయంలో అవి బయటకు వచ్చేస్తున్నాయి. గతేడాది ఇలానే నిర్వహించిన పరీక్షల్లో అన్ని ప్రశ్నపత్రాలు లీక్య్యాయి. దీంతో ఈ పరీక్షలు తూతూమంత్రంగా మారుతున్నాయన్న అభిప్రాయం నెలకొంది.
ఉపాధ్యాయులకు ఇబ్బందులు
ఆంగ్లం, హిందీ సబ్జెక్టుల్లో ఉండే ప్యాసేజ్లు, గణితం, సామాన్య శాస్త్రంలో ఉండే బొమ్మలను బోర్డుపై ఎలా రాయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. బోర్డు మీద వీటన్నింటినీ రాయడానికే 45 నిమిషాల సమయం పడుతోందని.. ఇక పరీక్షలు ఎలా నిర్వహించాలని వాపోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలను సొంత డబ్బులతో జిరాక్స్ తీసి, పిల్లలకు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు పాఠశాలల నిర్వహణ నిధులు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులే జిరాక్స్ వ్యయం భరించాల్సి వస్తోంది.
సెల్ఫోన్లో టోఫెల్..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆంగ్ల సబ్జెక్టులో రెండో పేపర్గా టోఫెల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్(ఐఎఫ్పీ) ఉన్న చోట ఆడియోలను ఆన్లైన్లో పంపిస్తున్నారు. ఐఎఫ్పీలు లేని చోట ఉపాధ్యాయుల సెల్ఫోన్లకు వాట్సప్లో ఆడియోలు పంపిస్తున్నారు. వీరు సెల్ఫోన్లోనే ఆడియోలు వినిపించి పరీక్ష పెట్టాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా ఐఎఫ్పీలు అవసరం కాగా 50 శాతం లోపు బడుల్లోనే ఇవి ఉన్నాయి. ఈ పరీక్షకు 10 నిమిషాలు మాత్రమే సమయం కేటాయించారు. ఈ సమయంలో ఏ కారణం చేతనైనా సెల్ఫోన్ ఆడియో వినబడకపోతే విద్యార్థులు పరీక్ష ఎలా రాస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకు సిలబస్ ఇవ్వకపోవడం గమనార్హం.
ప్రశ్నపత్రాలను ముద్రించి ఇవ్వాలి
నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్
ఈనాడు, అమరావతి: రెండో ఫార్మెటివ్ అసెస్మెంట్లో ప్రశ్నలను పరీక్షకు గంట ముందు బోర్డుమీద రాయడం ప్రయాసతో కూడుకున్నదని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి బదులు ప్రశ్నపత్రాలను డీసీబీఈల ద్వారా ముద్రించి ఇవ్వాలని కోరారు. పరీక్ష పత్రం 10 నిమిషాల ముందు ఉపాధ్యాయులకు వాట్సప్లో పంపడం అన్నది మాస్కాపీయింగ్కు అవకాశం ఇవ్వడమేనని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత బీమాపై జగన్నాటకం!
కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పోర్టల్లో ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నమోదైన ఈ వివరాలు నివ్వెర పరుస్తున్నాయి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో ఈ సీజన్ మొత్తంలో సాగైన పంటల విస్తీర్ణం 0.04 హెక్టార్లేనా? పంట పండిస్తున్న రైతులు 16 మందేనా.. అని ఆశ్చర్యం కలుగుతోందా...? -
అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలొద్దు
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు, ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందకుండా రాష్ట్రంలో ఇసుక రీచ్లలో తవ్వకాలు చేపట్టడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. -
బలహీనపడిన తుపాను
మిగ్జాం తీవ్ర తుపాను తీరం దాటాక.. కోస్తాను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో ముంచెత్తింది. -
ఓటర్ల మెడపై నోటీసుల కత్తి
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల మెడపై కత్తి పెడుతోంది. ‘‘మీ ఫొటోతో పలానా పలానా చోట్ల ఓట్లున్నాయి. వాటిల్లో దేన్ని తొలగించాలి? దేన్ని కొనసాగించాలి? నిర్దేశిత తేదీలోగా తెలపండి’’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి నోటీసులిస్తోంది. -
నాడు ఆదర్శం... నేడు నిర్వీర్యం
రాళ్లూరప్పలూ.. కొండలూగుట్టలూ.. నడిచేందుకూ వీలులేని దారుల్లో... డోలీ మోతల్లో గిరిశిఖర గ్రామాల మహిళలు పడే ప్రసవ వేదన మాటల్లో చెప్పలేనిది. చిమ్మచీకటి, జోరు వర్షం నడుమ సకాలంలో వైద్యం అందక, పురిటినొప్పులు భరించలేక ఊపిరి వదిలిన తల్లులెందరో. అమ్మఒడిని చేరకుండానే రాలిపోయిన పసిబిడ్డలు ఇంకెందరో. -
ఆరు గ్యారంటీలతో ఆరంభం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
వాన ముంచింది.. అన్నదాత గుండె ఆగింది
భారీ వర్షానికి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలోనే రైతు కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన బుధవారం పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకుంది. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
జగనన్న కాలనీలా.. చెరువులా?
‘ఇళ్లు కాదు...అవి ఊళ్లు’...జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన అనుచరగణమంతా చెప్పే మాటే ఇది. ఆ ఊళ్లను ఎంత సురక్షితంగా కడుతున్నారో....ఒక్క వర్షం వస్తే ఇట్టే తెలిసిపోతోంది. -
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి ఎట్టకేలకు విడుదల చేసింది. -
జగన్ ప్రభుత్వమా.. మజాకా
వాహనాల రద్దీ పెరిగే కొద్దీ గ్రామీణ రహదారులను జిల్లా రహదారులుగా, రాష్ట్ర రహదారులుగా, జాతీయ రహదారులుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. -
సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై దృష్టి పెట్టండి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. -
వివేకా హత్య కేసులో అభియోగాల నమోదుపై 20న విచారణ
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై అభియోగాల నమోదు నిమిత్తం సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త సాఫ్ట్వేర్, మొబైల్ యాప్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త సాఫ్ట్వేర్, మొబైల్ అప్లికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందిస్తోంది. -
మునిగేది రైతన్న.. ముంచేది ఎవరన్న?
మొన్న ఏం జరిగింది? నిన్న దాని ప్రభావం ఏమిటి? నేడు ఎలా ముందుకెళ్లాలి... అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. -
నిర్మాణాలపై మూడో పక్షానికి హక్కులు కల్పించొద్దు
భూ కేటాయింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్కు కేటాయించిన 12.51 ఎకరాలను రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
విశాఖకు కార్యాలయాల తరలింపు వ్యాజ్యంపై ఏజీ అభ్యంతరం
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం.. హైకోర్టు సింగిల్ జడ్జి వద్దకు విచారణకు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. -
క్రమబద్ధీకరణ హామీకి నాలుగేళ్లు
‘మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా. నిశ్చింతగా ఉండండి’ అని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటినా ఇంత వరకు ప్రభుత్వాసుపత్రుల్లోని ట్రామాకేర్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ కార్యరూపం దాల్చలేదు. -
చికిత్స వ్యయం మరో రూ.20 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు వ్యయమయ్యే చికిత్సను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. -
చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ 12కి వాయిదా
ఉచిత ఇసుక విధానం, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


తాజా వార్తలు (Latest News)
-
Kadiyam Srihari: ఏడాదిలోగా మళ్లీ భారాస సర్కారే: ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు
-
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
-
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!
-
అత్తమామల చేతిలో శివాని బలి.. చితిలో కాలిన శవంతో ఠాణాకు!
-
13 వేల బాతు పిల్లల మృత్యువాత.. నష్టాన్ని తట్టుకోలేక..
-
భార్యాబిడ్డలను చంపి రైల్వే వైద్యుడి ఆత్మహత్య!