‘జగన్ మాట..’ కొల్లేటి పాలు!
జగన్ అధికారంలోకి వచ్చిన గత నాలుగున్నరేళ్లుగా కొల్లేరు ఉప్పునీటి సమస్య పరిష్కారానికి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వైకాపా హయాంలో రాష్ట్ర సర్కారు అప్పుల ఊబిలో చిక్కుకుంది.
ఉప్పు ముప్పు తప్పిస్తానన్న హామీ నెరవేర్చని వైనం
వైకాపా సర్కారు బిల్లులు చెల్లించడంలేదని ముందుకు రాని గుత్తేదారులు
టెండర్లు పిలిచినా స్పందించని తీరు
ఈనాడు, అమరావతి
కొల్లేరు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా. ఉప్పునీటితో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తా.
2018 మే 12న కైకలూరులో ప్రజా సంకల్ప యాత్ర సభలో ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన మాట.
కొల్లేరులో రెగ్యులేటర్లు నిర్మించాలని ప్రజలు గతంలో విజ్ఞప్తి చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తవుతోంది. జూన్లో శంకుస్థాపన చేస్తాను.
2022 మే 16న ఏలూరు జిల్లా గణపవరంలో రైతుభరోసా పెట్టుబడి సాయం జమ సభలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ హామీ.
జగన్ అధికారంలోకి వచ్చిన గత నాలుగున్నరేళ్లుగా కొల్లేరు ఉప్పునీటి సమస్య పరిష్కారానికి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వైకాపా హయాంలో రాష్ట్ర సర్కారు అప్పుల ఊబిలో చిక్కుకుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఎవరూ స్పందించలేదు. దీంతో జగన్ హామీ కొల్లేటి పాలయింది.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరుకు ఉప్పునీరు పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆ ముప్పును తప్పించుకునేందుకు ప్రతిపాదించిందే రెగ్యులేటర్ల నిర్మాణం. దాదాపు 77,138 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు మంచి నీటి సరస్సు ఇప్పుడు కాలుష్య కాసారంగా, ఉప్పునీటి మయంగా మారిపోయింది. సముద్రంలో నుంచి ఉప్పునీరు ఉప్పుటేరు ద్వారా ఎగదన్నుతూ ఏకంగా కొల్లేరు వరకు చేరుతోంది. అది అనేక సమస్యలను సృష్టిస్తోంది.
ఎందుకీ ఉప్పునీరు?
కృష్ణా, గోదావరి నదుల మధ్య కొల్లేరు సహజ మంచినీటి సరస్సు. అనేక వాగులు, వంకలు దీనిలో చేరతాయి. వర్షాకాలంలో, వరద సమయంలో ఆ నీరంతా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరుతుంది. కానీ కొల్లేరు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు విస్తరించడం.. వానలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో ఉప్పుటేరులోకి వరద ప్రవాహం ఉండటం లేదు. ఆ సమయంలో సముద్ర ఆటుపోటులతో ఉప్పునీరు వెనకకు ఎగదన్నుతోంది. ఆ నీరు ఏకంగా 54 కిలోమీటర్లకు పైగా ఉప్పుటేరులో ప్రవహించి కొల్లేరుకు చేరుతోంది.
రైతులు, మత్స్యకారులకూ నష్టమే
సముద్రం నుంచి ఉప్పునీరు వెనకకు ఎగదన్నడంతో ఉప్పుటేరుకు రెండు వైపులా ఉన్న పంటపొలాలు చౌడుబారిపోతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉప్పుటేరును ఆనుకుని చేపట్టిన ఆక్వా సాగుకు సైతం నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉప్పుటేరు ఆధారంగా వేలాది మత్స్యకార కుటుంబాలు చేపలు పట్టుకుంటూ జీవించేవి. ఉప్పునీరు ఎగదన్నడంతో చేపలు బతకడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఉప్పుటేరుపై మూడు చోట్ల రెగ్యులేటర్లు నిర్మించాలని నిర్ణయించారు. సముద్రంలో ఉప్పునీరు ఎగదన్నకుండా అదే సమయంలో వానాకాలం కొల్లేరు నీరు సముద్రంలో కలిసేందుకు ఇబ్బందులు లేకుండా వీటిని ప్రతిపాదించారు. జలవనరుల శాఖ రూ.412 కోట్లతో 2022 ఫిబ్రవరిలో ఈ పనులకు పాలనామోదం ఇచ్చింది. ఆకివీడు మండలం దుంపగడప వద్ద ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.87 కోట్లు, మొగల్తూరు మండలం పడతడిక వద్ద ఉప్పుటేరుపై రెగ్యులేటర్ కం బ్రిడ్జి నిర్మాణానికి రూ.136.60 కోట్లు, అదే మండలం మొల్లపర్రు వద్ద ఉప్పుటేరుపై రెగ్యులేటర్, వంతెనల నిర్మాణానికి రూ.188.40 కోట్లతో నిధులు మంజూరు చేసింది. కృత్తివెన్ను మండలం నిడమర్రు వద్ద పెదలంక మేజర్ డ్రెయిన్పై అవుట్ ఫాల్ స్లూయిస్, రెండు వరుసల వంతెన నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. రెండు సార్లు జలవనరులశాఖ టెండర్లు పిలిచినా గుత్తేదారులు స్పందించలేదు. దీంతో మళ్లీ రూ.468 కోట్లకు ప్రతిపాదనలు అంచనాలు సవరించి ప్రభుత్వానికి పంపారు. కానీ ఇప్పటికీ తదుపరి అడుగులు పడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబోస్కు గురజాడ విశిష్ట పురస్కారం
గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. -
‘ఎంఎస్ఎంఈ ఏపీ వన్’ పేరుతో కొత్త సర్వే
ఆర్భాటం.. ప్రచారం అనేది జగన్ ప్రభుత్వానికే సాధ్యమైన విద్యలు. చిన్న పరిశ్రమల కష్టాలను తామే తీర్చేస్తున్నంతగా మాటలు చెబుతూ.. ఉత్త చేయి అందించడం ప్రభుత్వానికే చెల్లింది. -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు హుష్కాకి
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మాయమయ్యాయి. -
Cyclone Michaung: ముంచుకొస్తున్న తుపాను
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. -
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు.. కాకినాడ, తిరుపతి చిరునామాలతో రాజంపేట జాబితాలో చోటు.. అసలు ఎవరో తెలియనివారి పేరిట వందలాది ఓట్లు.. ఒకే డోర్నంబరుతో పదులకొద్దీ బోగస్ ఓట్లు.. రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలిస్తున్నా కొద్దీ ఇలా లెక్కలేనన్ని అక్రమాలు, అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. -
సాగర్ వద్ద సాధారణ పరిస్థితులు
నాగార్జునసాగర్ జలాశయం వద్ద పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి. నవంబరు 29కి ముందునాటి వాతావరణం నెలకొంది. -
ఆర్అండ్బీని భయపెడుతున్న తుపాను
రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను.. రహదారులు భవనాలశాఖ ఇంజినీర్లను కూడా భయపెడుతోంది. తుపాను తీవ్రతతో రహదారులు దెబ్బతింటే చేతులెత్తేయాల్సిన దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు. -
కళ్ల ముందు 1977 నాటి పీడకల!
మిగ్జాం తీవ్ర తుపాను కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీని కేంద్ర స్థానం నుంచి 200 కి.మీ. మేర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కేసీఆర్ కన్నా జగన్ చిత్తుగా ఓడిపోతారు
మూడు రాజధానులంటూ అమరావతిని అరణ్యంలా మారుస్తున్న సీఎం జగన్.. భారాస అధినేత కేసీఆర్ కన్నా చిత్తుగా ఓడిపోతారని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. -
మేము రాము బిడ్డో జగనన్న కాలనీకి..!
నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని దొరపల్లె గుట్ట వద్ద ఉన్న జగనన్న కాలనీలోకి ఇంటి నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు తెగేసి చెప్పేస్తున్నారు. -
కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం..
తుపాను హెచ్చరికలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఏ క్షణంలో గాలులు వీచి చేతికొచ్చిన పంట నేలవాలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. -
తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. -
ఇలా ఇచ్చారు.. అలా చక్రం ఊడింది!
బ్యాటరీ ట్రై సైకిళ్లకు చక్రాలు సరిగ్గా బిగించకుండానే పంపిణీ చేయడంతో వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రమాదవశాత్తు ఓ దివ్యాంగుడు కింద పడ్డారు. -
కుప్పం ఓటరు జాబితా సవరణలో విచిత్ర దరఖాస్తు
చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పురపాలికలోని 173వ పోలింగ్ బూత్ పరిధిలో.. మరణించిన మహిళ ఓటును తొలగించాలని మృతి చెందిన ఇంకో మహిళ పేరుతో ఫారం-7 దాఖలు అయింది. -
రచయితలపై సామాజిక బాధ్యత
కవులు, రచయితలు, కథకులపై సామాజిక బాధ్యత ఉందని కవి కె.శివారెడ్డి పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానం రద్దు
తుపాను కారణంగా విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. న్యూదిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు. -
అమర్యాదగా మాట్లాడటం సరికాదు
విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంపీడీఓపై భీమిలి వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమర్యాదగా మాట్లాడటం సరికాదని ఏపీ పంచాయతీరాజ్ అధికారుల సంఘం మండిపడింది. -
బకాయిల తుది గడువుపై ఏం చేద్దాం?
ప్రభుత్వ బకాయిలను రాబట్టుకునేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సోమవారం మరోసారి భేటీ కానుంది. -
ఉద్యోగుల్ని వేధిస్తే తెలంగాణ ఫలితాలే
ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వేధిస్తే తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురైన ఫలితాలే ఏపీలోనూ పునరావృతమవుతాయని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా అభిషిక్త్ కిశోర్ నియామకం
ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎమ్.అభిషిక్త్ కిశోర్ను ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Jobs: ఐఐటీ కాన్పూర్లో కొలువుల జోష్.. ఒకేరోజు 485మందికి జాబ్ ఆఫర్లు
-
TS News: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు.. ఇక ముఖ్యమంత్రే తరువాయి!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
IND vs SA: భారత్తో టీ20, వన్డే, టెస్టు సిరీస్లు.. జట్లను ప్రకటించిన దక్షిణాఫ్రికా
-
Raghav Chadha: ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డాపై సస్పెన్షన్ ఎత్తివేత
-
Arshdeep Singh: ‘చివరి ఓవర్లో సూర్య భాయ్ ఒకే మాట చెప్పాడు’.. అర్ష్దీప్ వెల్లడి