Rushikonda: రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి రూ.433 కోట్లు
విశాఖపట్నంలో రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణాలకు ఎంత ఖర్చయిందో ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన ప్రభుత్వం.. ఎట్టకేలకు వాటిని బయటపెట్టింది.
విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలు
ఖర్చెంతో చెప్పకుండా.. ఇన్నాళ్లూ గోప్యత పాటించిన ప్రభుత్వం
న్యాయసమీక్ష తప్పించుకునేందుకు.. చిన్న పనులుగా విభజించి కేటాయింపు
అంచనా వ్యయం కంటే 16% అధిక ధరలకు పనుల అప్పగింత
ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణాలకు ఎంత ఖర్చయిందో ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన ప్రభుత్వం.. ఎట్టకేలకు వాటిని బయటపెట్టింది. ఏకంగా రూ.433 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టింది. అంచనా వ్యయం కంటే 16% అధిక ధరలకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టింది. రుషికొండ పునర్ అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నుంచి తొలుత రూ.350.16 కోట్లు కేటాయించింది. తర్వాత వాటికి అదనపు కేటాయింపులు చేసింది. కళింగ, వేంగి, గజపతి, విజయనగర బ్లాకుల పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు. జీవోలను ఆన్లైన్లో ఉంచడానికి అభ్యంతరమేంటని హైకోర్టు తలంటడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్నిశాఖల జీవోలను ఏపీ గెజిట్ వెబ్సైట్లో ఉంచుతోంది. ఈ క్రమంలోనే క్యాంపు కార్యాలయ భవనాలకు కేటాయింపు, ఖర్చు తదితర జీవోలు బయటకొచ్చాయి. రుషికొండ ప్రాజెక్టుకు సంబంధించి శనివారం రాత్రి ఒకేసారి 10 జీవోలను ప్రభుత్వం అప్లోడ్ చేసింది. అధికశాతం పనులను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి కేటాయించారు. రూ.100 కోట్లు దాటితే.. న్యాయసమీక్షకు వెళ్తామన్న ఉత్తర్వులను తామే ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా పనులు చేయించారు. తొలుత ఇవి పర్యాటక భవనాలంటూ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పింది. తర్వాత ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి.. సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమంటూ నివేదిక తెప్పించుకుంది.
మూడు దశల్లో పనులు.. ఇబ్బడి ముబ్బడిగా నిధులు
రుషికొండ పునర్ అభివృద్ధి ప్రాజెక్టు పేరుతోనే ప్రభుత్వం అక్కడ పనులకు శ్రీకారం చుట్టింది. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు దశలుగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు అమల్లో భాగంగా తొలిదశ పనులకు రూ.92 కోట్లు కేటాయించగా.. తర్వాత వాటిని రూ.159 కోట్లకు పెంచారు. రెండోదశ పనులకు రూ.94.49 కోట్లు ఖర్చుచేశారు. మూడోదశలో రూ.112.76 కోట్లు ఖర్చు చూపారు. రహదారులు, తాగునీటి సరఫరా, విద్యుత్తు, మురుగునీటి పారుదల తదితర పనులకు రూ.46 కోట్ల వరకు ఖర్చుపెట్టడం గమనార్హం. ల్యాండ్ స్కేపింగ్ పనులకే రూ.21.83 కోట్లు వెచ్చించారు. మూడోదశ పనులకు రూ.77.86 కోట్ల అంచనాతో టెండర్ పిలిచారు. 16.46% అధిక ధరలకు... అంటే రూ.90.68 కోట్లకు పనులు అప్పగించడం గమనార్హం.
వేడిని తట్టుకునేలా
గోడలకు ఇంటర్లాకింగ్ రాఫ్టర్స్, వేడిని, నీటిని తట్టుకునేలా 18 ఎంఎం మందంతో కూడిన ప్లైవుడ్, వేడి, బ్యాక్టీరియా, నీరు, రసాయనాలకు దెబ్బతినకుండా ఉండేలా 3, 9 మి.మీ. మందంతో లామినేటెడ్ ప్యానెల్స్తో పాటు పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఆధునికమైన 138 సింగిల్ సీటర్ సోఫాలు, టూ సీటర్ సోఫాలు 42, త్రీ సీటర్ సోఫాలు 25, ఎగ్జిక్యూటివ్ కుర్చీలు 721, టేబుల్స్ 205, పడకలు 20 ఏర్పాటుచేయాలని తెలిపారు. ఫర్నిచర్కే రూ.14 కోట్లకు పైగా ఖర్చుపెట్టడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబోస్కు గురజాడ విశిష్ట పురస్కారం
గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. -
‘ఎంఎస్ఎంఈ ఏపీ వన్’ పేరుతో కొత్త సర్వే
ఆర్భాటం.. ప్రచారం అనేది జగన్ ప్రభుత్వానికే సాధ్యమైన విద్యలు. చిన్న పరిశ్రమల కష్టాలను తామే తీర్చేస్తున్నంతగా మాటలు చెబుతూ.. ఉత్త చేయి అందించడం ప్రభుత్వానికే చెల్లింది. -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు హుష్కాకి
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మాయమయ్యాయి. -
Cyclone Michaung: ముంచుకొస్తున్న తుపాను
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. -
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు.. కాకినాడ, తిరుపతి చిరునామాలతో రాజంపేట జాబితాలో చోటు.. అసలు ఎవరో తెలియనివారి పేరిట వందలాది ఓట్లు.. ఒకే డోర్నంబరుతో పదులకొద్దీ బోగస్ ఓట్లు.. రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలిస్తున్నా కొద్దీ ఇలా లెక్కలేనన్ని అక్రమాలు, అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. -
సాగర్ వద్ద సాధారణ పరిస్థితులు
నాగార్జునసాగర్ జలాశయం వద్ద పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి. నవంబరు 29కి ముందునాటి వాతావరణం నెలకొంది. -
ఆర్అండ్బీని భయపెడుతున్న తుపాను
రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను.. రహదారులు భవనాలశాఖ ఇంజినీర్లను కూడా భయపెడుతోంది. తుపాను తీవ్రతతో రహదారులు దెబ్బతింటే చేతులెత్తేయాల్సిన దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు. -
కళ్ల ముందు 1977 నాటి పీడకల!
మిగ్జాం తీవ్ర తుపాను కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీని కేంద్ర స్థానం నుంచి 200 కి.మీ. మేర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కేసీఆర్ కన్నా జగన్ చిత్తుగా ఓడిపోతారు
మూడు రాజధానులంటూ అమరావతిని అరణ్యంలా మారుస్తున్న సీఎం జగన్.. భారాస అధినేత కేసీఆర్ కన్నా చిత్తుగా ఓడిపోతారని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. -
మేము రాము బిడ్డో జగనన్న కాలనీకి..!
నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని దొరపల్లె గుట్ట వద్ద ఉన్న జగనన్న కాలనీలోకి ఇంటి నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు తెగేసి చెప్పేస్తున్నారు. -
కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం..
తుపాను హెచ్చరికలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఏ క్షణంలో గాలులు వీచి చేతికొచ్చిన పంట నేలవాలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. -
తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. -
ఇలా ఇచ్చారు.. అలా చక్రం ఊడింది!
బ్యాటరీ ట్రై సైకిళ్లకు చక్రాలు సరిగ్గా బిగించకుండానే పంపిణీ చేయడంతో వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రమాదవశాత్తు ఓ దివ్యాంగుడు కింద పడ్డారు. -
కుప్పం ఓటరు జాబితా సవరణలో విచిత్ర దరఖాస్తు
చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పురపాలికలోని 173వ పోలింగ్ బూత్ పరిధిలో.. మరణించిన మహిళ ఓటును తొలగించాలని మృతి చెందిన ఇంకో మహిళ పేరుతో ఫారం-7 దాఖలు అయింది. -
రచయితలపై సామాజిక బాధ్యత
కవులు, రచయితలు, కథకులపై సామాజిక బాధ్యత ఉందని కవి కె.శివారెడ్డి పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానం రద్దు
తుపాను కారణంగా విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. న్యూదిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు. -
అమర్యాదగా మాట్లాడటం సరికాదు
విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంపీడీఓపై భీమిలి వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమర్యాదగా మాట్లాడటం సరికాదని ఏపీ పంచాయతీరాజ్ అధికారుల సంఘం మండిపడింది. -
బకాయిల తుది గడువుపై ఏం చేద్దాం?
ప్రభుత్వ బకాయిలను రాబట్టుకునేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సోమవారం మరోసారి భేటీ కానుంది. -
ఉద్యోగుల్ని వేధిస్తే తెలంగాణ ఫలితాలే
ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వేధిస్తే తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురైన ఫలితాలే ఏపీలోనూ పునరావృతమవుతాయని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా అభిషిక్త్ కిశోర్ నియామకం
ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎమ్.అభిషిక్త్ కిశోర్ను ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Telangana Election Results: అప్పుడలా.. ఇప్పుడిలా..!
-
Hyderabad: భారాసకు జైకొట్టిన కాలనీలు, బస్తీలు
-
Telangana Elections: తొలి అడుగులోనే సంచలన గెలుపు
-
Hyderabad: హ్యాట్రిక్ వీరులు.. హైదరాబాద్లో 10 మంది..
-
Telangana Election Results: 51 మంది అభ్యర్థులకు 50% పైగా ఓట్లు
-
BRS: భారాసకి కొరుకుడుపడని 6 స్థానాలివే..