నిప్పుల్లా నిత్యావసరాలు!
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే.. నిత్యావసరాల ధరలు సగటున 30% నుంచి 50% వరకు పెరిగాయి. బియ్యం 32%, కందిపప్పు 107%, ఉల్లి 287% పెరిగాయి. ఇతర పప్పుధాన్యాలు, నూనెలు, పంచదార, బెల్లం తదితర సరకులతో పాటు చిరుధాన్యాలదీ అదేదారి.
వైకాపా పాలనలో సగటున 50% ధరల పెరుగుదల
పైపైకి ఎగబాకుతున్న బియ్యం, పప్పులు.. చిరుధాన్యాలదీ అదే దారి
ప్రతినెలా అదనపు మోతతో సామాన్య కుటుంబాల విలవిల
కరవుతో తగ్గనున్న దిగుబడులు.. ధరలు మరింత పెరిగే అవకాశం
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే.. నిత్యావసరాల ధరలు సగటున 30% నుంచి 50% వరకు పెరిగాయి. బియ్యం 32%, కందిపప్పు 107%, ఉల్లి 287% పెరిగాయి. ఇతర పప్పుధాన్యాలు, నూనెలు, పంచదార, బెల్లం తదితర సరకులతో పాటు చిరుధాన్యాలదీ అదేదారి. వీటికితోడు విద్యుత్తు బిల్లులు, వంటగ్యాస్, పాలు.. ఇతరత్రా బాదుడు భరించలేకున్నామని నిరుపేదలు వాపోతున్నారు. అయిదేళ్ల కిందటితో పోలిస్తే బియ్యం, ఉప్పు, పప్పులు తదితర సరకుల రూపంలోనే నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనంగా ఖర్చవుతోందని మధ్యతరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వీటికి నెలకు రూ.3 వేలు ఖర్చు చేసిన కుటుంబం ఇప్పుడు రూ.4,500 వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ఇలా ఒక్కో ఇంటిపై సగటున నెలకు రూ.1,200 వేసుకున్నా.. 54 నెలల జగన్ పాలనా కాలంలో సరకుల రూపంలో రూ.65 వేల అదనపు భారం పడింది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడులూ భారీగా తగ్గనున్నాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబరు నుంచి మొదలైన పెరుగుదల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గతేడాది జులై వరకు కిలో రూ.50 వరకు ఉన్న సన్నబియ్యం ధర క్రమంగా పెరుగుతూ ఇప్పుడు సగటున రూ.60 దాటింది. నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల్లో సన్నబియ్యం ధరలు రూ.65 నుంచి రూ.67 వరకు పలుకుతున్నాయి. కొన్నిచోట్ల సాధారణ రకం బియ్యమే కిలో రూ.50 కిపైగా అమ్మకం చేస్తున్నారు. దీంతో నెలకు 25 కిలోలు వినియోగించే కుటుంబంపై రూ.250 పైగా భారం పడుతోంది. అంటే ఏడాదికి రూ.3 వేల చొప్పున వంటింటి ఖర్చు పెరిగింది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాదీ ధాన్యం దిగుబడులు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ ఆయకట్టులో సన్న రకాల ధాన్యం సాగు భారీగా తగ్గింది. దీంతో వాటి ధర మరింత పెరుగుతుందన్న అభిప్రాయం మిల్లర్లలో వ్యక్తమవుతోంది. గోధుమపిండి ధర సైతం కిలో రూ.45 నుంచి రూ.55 వరకు ఎగబాకింది.
పప్పులు, పల్లీలు కొనగలమా?
కందిపప్పు ధరలూ ఈ ఏడాది జనవరి నుంచి ఉడుకుతున్నాయి. గత 11 నెలల్లో కిలోపై సగటున రూ.80కిపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో రూ.180 నుంచి రూ.190 మధ్య కొనసాగుతోంది. ఆన్లైన్లో కిలో రూ.200 పైనే ఉంది. సగటున కుటుంబానికి నెలకు కిలో వినియోగం చొప్పున చూసినా.. ఏడాదికి రూ.1200 మేర భారం పడుతోంది. మినపగుళ్ల ధర కూడా కిలో రూ.130 పైగా ఉంది. పల్లీలు (వేరుశనగ గుళ్లు) కిలో రూ.160 నుంచి రూ.180 పైగా పలుకుతున్నాయి. వేరుశనగ నూనె లీటరు రూ.170 పైనే ఉంది. రాష్ట్రంలో వేరుశనగ సాగు తగ్గిపోవడంతో పాటు కరవు నేపథ్యంలో దిగుబడులు క్షీణించాయి.
కిలో రూ.60 పైనే ఉల్లి
ఉల్లి ఉత్పత్తి పడిపోవడంతో ధరలు ఆకాశానికేసి చూస్తున్నాయి. ఎగుమతులపై ఆంక్షలు, నాఫెడ్ ద్వారా మార్కెట్లోకి నిల్వలు విడుదల నేపథ్యంలో పెరుగుదల ఆగినా.. ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో కిలో రూ.62 నుంచి రూ.70 మధ్య ఉంది. చింతపండు ధర కూడా కిలోకు రూ.35 పైనే పెరిగింది. అయిదేళ్ల కిందటితో పోలిస్తే.. పంచదార ధర కిలోకు రూ.7, బెల్లం రూ.12 చొప్పున పెరిగాయి.
చిరుధాన్యాల ధరలూ పెరిగాయ్..
ఆరోగ్యంపై శ్రద్ధతో చిరుధాన్యాల వినియోగం పెరుగుతోంది. వాటి ధరలూ అదే దారిలో నడుస్తున్నాయి. గతంలో పచ్చజొన్నల ధర కిలో రూ.60 ఉండగా.. ఇప్పుడు రూ.100 నుంచి రూ.110 వరకు పలుకుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ పంట దెబ్బతింది. తెల్లజొన్న ధర కూడా కిలో రూ.65 వరకు చేరింది. కొర్రలు, సామలు తదితర చిరుధాన్యాలు కిలో రూ.120 నుంచి రూ.160 మధ్య అమ్ముడవుతున్నాయి. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఇవి కిలోకు రూ.40 నుంచి రూ.60 వరకు పెరిగాయి.
రేషన్ దుకాణాల్ని ఖాళీ చేసి
వైకాపా హయాంలో రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో బియ్యం తప్పితే.. మరేమీ దొరకని దుస్థితి నెలకొంది. కార్డుదారులకు కనీసం కిలో చొప్పున కూడా కందిపప్పు పంపిణీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. గోధుమపిండి, చిరుధాన్యాలు ఇస్తున్నామంటున్నా.. కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. కనీసం పేదలనైనా ఆదుకుందామన్న ధ్యాసే కొరవడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబోస్కు గురజాడ విశిష్ట పురస్కారం
గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. -
‘ఎంఎస్ఎంఈ ఏపీ వన్’ పేరుతో కొత్త సర్వే
ఆర్భాటం.. ప్రచారం అనేది జగన్ ప్రభుత్వానికే సాధ్యమైన విద్యలు. చిన్న పరిశ్రమల కష్టాలను తామే తీర్చేస్తున్నంతగా మాటలు చెబుతూ.. ఉత్త చేయి అందించడం ప్రభుత్వానికే చెల్లింది. -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు హుష్కాకి
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మాయమయ్యాయి. -
Cyclone Michaung: ముంచుకొస్తున్న తుపాను
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. -
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు.. కాకినాడ, తిరుపతి చిరునామాలతో రాజంపేట జాబితాలో చోటు.. అసలు ఎవరో తెలియనివారి పేరిట వందలాది ఓట్లు.. ఒకే డోర్నంబరుతో పదులకొద్దీ బోగస్ ఓట్లు.. రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలిస్తున్నా కొద్దీ ఇలా లెక్కలేనన్ని అక్రమాలు, అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. -
సాగర్ వద్ద సాధారణ పరిస్థితులు
నాగార్జునసాగర్ జలాశయం వద్ద పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి. నవంబరు 29కి ముందునాటి వాతావరణం నెలకొంది. -
ఆర్అండ్బీని భయపెడుతున్న తుపాను
రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను.. రహదారులు భవనాలశాఖ ఇంజినీర్లను కూడా భయపెడుతోంది. తుపాను తీవ్రతతో రహదారులు దెబ్బతింటే చేతులెత్తేయాల్సిన దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు. -
కళ్ల ముందు 1977 నాటి పీడకల!
మిగ్జాం తీవ్ర తుపాను కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీని కేంద్ర స్థానం నుంచి 200 కి.మీ. మేర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కేసీఆర్ కన్నా జగన్ చిత్తుగా ఓడిపోతారు
మూడు రాజధానులంటూ అమరావతిని అరణ్యంలా మారుస్తున్న సీఎం జగన్.. భారాస అధినేత కేసీఆర్ కన్నా చిత్తుగా ఓడిపోతారని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. -
మేము రాము బిడ్డో జగనన్న కాలనీకి..!
నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని దొరపల్లె గుట్ట వద్ద ఉన్న జగనన్న కాలనీలోకి ఇంటి నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు తెగేసి చెప్పేస్తున్నారు. -
కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం..
తుపాను హెచ్చరికలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఏ క్షణంలో గాలులు వీచి చేతికొచ్చిన పంట నేలవాలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. -
తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. -
ఇలా ఇచ్చారు.. అలా చక్రం ఊడింది!
బ్యాటరీ ట్రై సైకిళ్లకు చక్రాలు సరిగ్గా బిగించకుండానే పంపిణీ చేయడంతో వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రమాదవశాత్తు ఓ దివ్యాంగుడు కింద పడ్డారు. -
కుప్పం ఓటరు జాబితా సవరణలో విచిత్ర దరఖాస్తు
చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పురపాలికలోని 173వ పోలింగ్ బూత్ పరిధిలో.. మరణించిన మహిళ ఓటును తొలగించాలని మృతి చెందిన ఇంకో మహిళ పేరుతో ఫారం-7 దాఖలు అయింది. -
రచయితలపై సామాజిక బాధ్యత
కవులు, రచయితలు, కథకులపై సామాజిక బాధ్యత ఉందని కవి కె.శివారెడ్డి పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానం రద్దు
తుపాను కారణంగా విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. న్యూదిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు. -
అమర్యాదగా మాట్లాడటం సరికాదు
విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంపీడీఓపై భీమిలి వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమర్యాదగా మాట్లాడటం సరికాదని ఏపీ పంచాయతీరాజ్ అధికారుల సంఘం మండిపడింది. -
బకాయిల తుది గడువుపై ఏం చేద్దాం?
ప్రభుత్వ బకాయిలను రాబట్టుకునేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సోమవారం మరోసారి భేటీ కానుంది. -
ఉద్యోగుల్ని వేధిస్తే తెలంగాణ ఫలితాలే
ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వేధిస్తే తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురైన ఫలితాలే ఏపీలోనూ పునరావృతమవుతాయని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా అభిషిక్త్ కిశోర్ నియామకం
ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎమ్.అభిషిక్త్ కిశోర్ను ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
-
Team India: ముగ్గురు కెప్టెన్లు.. భవిష్యత్తుకు సంకేతం కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
-
Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!
-
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసు కేసు
-
Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!