కొండను తవ్వి ఎలుకను పట్టారు!
ఎసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంపై ముఖ్యమంత్రి జగన్ కాకి లెక్కలు చెబుతున్నారు. 27.14 లక్షల ఎకరాలకు సంబంధించి 15.21 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని ఇటీవల నూజివీడులో సీఎం ఆర్భాటంగా ప్రకటించారు.
రికార్డుల్లోని అనుభవదారుల పేర్లు గల్లంతు
పెద్దల చేతుల్లోకి వెళ్లిన వైనం..
ఈనాడు-అమరావతి: ఎసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంపై ముఖ్యమంత్రి జగన్ కాకి లెక్కలు చెబుతున్నారు. 27.14 లక్షల ఎకరాలకు సంబంధించి 15.21 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని ఇటీవల నూజివీడులో సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే అర్హులను గుర్తించబోగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అయింది. తాజా లెక్కల ప్రకారం.. 10.58 లక్షల ఎకరాల భూములకు మాత్రమే అర్హులు ఉన్నారు. మిగిలిన దాదాపు 17 లక్షల ఎకరాల భూముల వివరాలు కనిపించడంలేదు. అసలు 11.61 లక్షల ఎకరాలు ఎసైన్డ్ కేటగిరిలోనే లేవు. చాలా భూములను రెవెన్యూ సిబ్బందిని మభ్యపెట్టి.. ఆన్లైన్లో మార్పులు చేయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే 6.18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ రికార్డుల్లో అనుభవదారు లేదా వారసుల పేర్లు లేవు. మరో 30 వేల ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కుంటల పరిధిలో ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఘనంగా పేర్కొన్నట్లు 15.21 లక్షలమందికి బదులు కనీసం ఐదారు లక్షలమందికైనా యాజమాన్య హక్కులు లభిస్తాయా.. అనేది సందిగ్ధమే. ఎసైన్డ్ భూములు పొంది 20 ఏళ్లు దాటిన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం గత ఆగస్టు నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సుమారు 27.14 లక్షల ఎకరాల వరకు పంపిణీ జరిగిందని, అర్హులు 15.21 లక్షల మంది ఉంటారని అంచనా వేయగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చాలా జిల్లాల్లో కేటాయింపులు జరిగిన దానికంటే అర్హులు తక్కువగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లోనైతే మండలాలవారీగా అర్హులైన లబ్ధిదారులు లేనేలేరు.
వందల ఎకరాలే ఉన్నాయి
విశాఖ జిల్లాలో 3,037కు 666, గుంటూరు జిల్లాలో 6,518కు 648 ఎకరాలను మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశినాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, ఉమ్మడి కృష్ణా జిల్లా అయినంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో ఎసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి చేరాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని గిరిజనుల్లో 50% మంది లబ్ధిదారుల వద్దే ప్రస్తుతం భూమి ఉంది. అడవుల సమీపంలో, సాగుకు పనికిరాని భూములు మాత్రమే అనుభవదారుల చేతుల్లో ఉన్నాయి. చాలాచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు కాలక్రమేణా పెరిగాయి. దీంతో అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాల్లోని ఎసైన్డ్ భూములు 70% వరకు అనధికారికంగా చేతులు మారాయి. పరాధీనమైన భూముల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. మరోవైపు.. ఈ పథకం కింద అర్హుల సంఖ్య పెంచేందుకు ఉన్న మార్గాల గురించి సమాలోచనలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆడుదాం ఆంధ్ర’కు వాలంటీర్లే అంపైర్లు
ఎన్ని విమర్శలు ఎదురైనా.. లోటుపాట్లు కనిపిస్తున్నా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను మమ అనిపించడానికే ప్రభుత్వం, అధికారులు సిద్ధమయ్యారు. తగిన సాధన సంపత్తి లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి క్రీడల సందడి మొదలుకానుంది. -
అయిదు ఎకరాలు ఎందుకు? ఆరున్నరెకరాలు ఇస్తాం తీసుకో..!
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని అయిదు ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? కబ్జా నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలి. -
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు. -
సొంతిల్లు ఉన్నంత మాత్రాన నివాసితుడిగా పరిగణించొద్దు
‘ఇతర రాష్ట్రాల్లోని తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవటం కోసం వచ్చే ఫాం-8లను పరిశీలించేటప్పుడు.. దరఖాస్తుదారుకు ఆ ప్రాంతంలో సొంతిల్లు ఉన్నంత మాత్రాన అక్కడి నివాసితుడిగా పరిగణించరాదు. -
విద్యుత్ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు
రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..
ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు! -
గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. -
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. -
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా..
సీఎం జగన్ తిరుపతి జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ.. ‘బాధితులకు రేషన్ బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ లీటరు, ఒక కిలో ఆనియన్, ఒక కేజీ ఉల్లిగడ్డ. -
వరద మింగిన రైతు కష్టం
మిగ్జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో పంట కోశారు. -
విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు జగన్ ప్రభుత్వం రాజకీయ చెద పట్టించింది. సరస్వతి నిలయాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చి భ్రష్ఠు పట్టించింది. అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉపకులపతు (వీసీ)లను నియమించడం.. అలా వచ్చిన వీసీలు విద్యను, విద్యార్థులను పట్టించుకోకుండా... -
తెల్లకాగితం మీద పేర్లు రాసిస్తే... ఓట్లు తొలగిస్తున్నారు
చాలా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు తెల్లకాగితాలపై పేర్లు రాసిస్తుంటే.. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
ప్రభుత్వ తీరుపై వ్యాజ్యం వేయడమే పాపమా?
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. -
కరవు కాటు.. తుపాను పోటు.. కనికరం చూపని సర్కారు
ఖరీఫ్లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్జాం తుపాను చిదిమేసింది. -
రోడ్డెక్కిన పాడి రైతులు
సీఎం జగన్ సొంత జిల్లాలోనే పాడిరైతులు గిట్టుబాటు ధర కోసం శుక్రవారం రోడ్డెక్కారు. పాలను నేలపై పారబోసి ఆగ్రహం ప్రదర్శించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమస్యపై వేడుకున్నారు. ఆపై ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించి అక్కడే బైఠాయించారు. -
35 నిమిషాల్లోనే ముగించేశారు!
ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ప్రతిపక్షాలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు రెండు- మూడు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మమ అనిపిస్తున్నారు. -
తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ నారాయణ
మిగ్జాం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. -
నలుగురి ఉసురు తీసిన ముసురు
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో తట్టుకోలేక నలుగురు కౌలు రైతులు తనువు చాలించారు. కంటిపాపలా కాపాడుకున్న పంట పొలం కళ్లముందు కొట్టుకుపోవడం, వరి పనల నుంచి మొలకలు రావడం చూసి వారు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. -
ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు.. ఓట్లెలా అడుగుతాం!
కౌన్సిలర్లుగా అధికార పార్టీ నుంచి ఎన్నికైనా.. ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయామని, మరికొన్ని నెలల్లో ఎన్నికల కోడ్ వస్తుండటంతో ప్రజలను ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతామని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు తెదేపా రూ.60 లక్షల సాయం
విశాఖ చేపలరేవులో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు తెదేపా అధికారంలోకి రాగానే కొత్త బోట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. -
నిజాన్ని దాచి.. నూరు శాతం గొప్పలు
నూటికి నూరు శాతం పిల్లలను బడికి పంపడంలో దేశంలో తొలి జిల్లాగా నంద్యాల రికార్డు సృష్టించిందని ప్రభుత్వం చేసిన ప్రకటనలో డొల్లతనం బయటపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతుండడంతో గణాంకాలను దాచేస్తున్న ప్రభుత్వం..


తాజా వార్తలు (Latest News)
-
TS News: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!
-
పొరపాటున పేలిన ఎస్.ఐ. తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా
-
Anganwadi Vacancy: తెలంగాణలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీ
-
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
-
డోరు తెరుచుకున్నా పైకి రాని లిఫ్ట్.. నాలుగో అంతస్తు నుంచి పడి కొరియర్ బాయ్ మృతి
-
ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి