Andhra News: పొలంలో బంగారం ‘పండింది’.. ఆయిల్‌పాం తోటలో బంగారు నాణేలు!

ఆయిల్‌పాం తోటలో తవ్వుతుండగా పురాతన కాలానికి చెందిన 18 బంగారు నాణేలు దొరికిన ఘటన ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 03 Dec 2022 07:39 IST

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే:   ఆయిల్‌పాం తోటలో తవ్వుతుండగా పురాతన కాలానికి చెందిన 18 బంగారు నాణేలు దొరికిన ఘటన ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామ పరిధిలో గత నెల 29న ఇవి లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రామంలో మానుకొండ తేజస్వికి చెందిన ఆయిల్‌పాం తోటలో పైపులైన్‌ కోసం తవ్వుతుండగా బంగారు నాణేలున్న మట్టి పిడత దొరికింది. ఆమె భర్త సత్యనారాయణ ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన తహసీల్దారు పి.నాగమణి వచ్చి నాణేలతోపాటు వాటిని ఉంచిన మట్టి పిడతను పరిశీలించారు. ఒక్కో నాణెం సుమారు 8 గ్రాములకు పైగా బరువు ఉన్నాయని నిర్ధారించారు. ఇవి రెండు శతాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని