Goutham Reddy: గౌతమ్ లేరని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా
దివంగత మేకపాటి గౌతమ్రెడ్డి లేని లోటు భర్తీ చేయలేమని.. ఆయన అందరి మనసుల్లో అగ్రస్థానంలో నిలిచిపోయారని సీఎం జగన్ అన్నారు. ఆయన కుటుంబానికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
సంస్మరణ సభలో సీఎం
ఈనాడు డిజిటల్, నెల్లూరు: కలెక్టరేట్, న్యూస్టుడే: దివంగత మేకపాటి గౌతమ్రెడ్డి లేని లోటు భర్తీ చేయలేమని.. ఆయన అందరి మనసుల్లో అగ్రస్థానంలో నిలిచిపోయారని సీఎం జగన్ అన్నారు. ఆయన కుటుంబానికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ మండలం కనుపర్తిపాడులో సోమవారం నిర్వహించిన గౌతమ్రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.
‘‘గౌతమ్ మన మధ్య లేరని అంటే.. నమ్మడానికీ మనసుకు కష్టంగా ఉంది. ఇంకా కనిపిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.
నా ప్రతి అడుగులో తోడుగా..
‘నాకు చిన్నప్పటి నుంచి గౌతమ్రెడ్డి పరిచయం. మంచి స్నేహితుడు. నేను లేకపోయింటే గౌతమ్ బహుశా రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో. అప్పట్లో కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీతో ఒక యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో గౌతమ్తో ఉన్న సాన్నిహిత్యమే కాంగ్రెస్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్రెడ్డి నాకు అండగా నిలబడేలా చేసింది. ప్రతి అడుగులోనూ స్నేహితుడిగా తోడున్నారు. నాకంటే ఒక సంవత్సరం పెద్దవాడైనా.. నన్నే అన్నగా భావించేవారు. మేమంతా ఉన్నాం.. నువ్వు చేయగలవు అని ప్రోత్సహించేవారు. నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చా. మంచి నాయకుడిగా ఎదిగారు. పరిశ్రమలు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, నాకు మంచి పేరు వస్తుందని గౌతమ్ తాపత్రయ పడేవారు. దుబాయ్ సదస్సు నుంచి వచ్చిన తర్వాత కలిసి విషయాలు వివరించేందుకు సమయం కూడా అడిగారు. ఈలోపే ఇలా జరిగిపోయింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.
సంగం బ్యారేజీకి గౌతమ్ పేరు
‘రాజమోహన్రెడ్డి కోరినట్టుగా.. ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాలను వ్యవసాయ, ఉద్యాన కళాశాలగా మారుస్తాం. అవకాశముంటే యూనివర్సిటీగా చేస్తాం. గౌతమ్ చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు నీరందిస్తాం. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-2లో ఉన్న ఉదయగిరి, బద్వేలు ప్రాంతాన్ని ఫేజ్-1లోకి తీసుకొచ్చి పనులు వేగవంతం చేస్తాం. మే 15లోపు సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని మంత్రి అనిల్కుమార్ తెలిపారు. మంచి రోజు చూసుకుని నేను మళ్లీ వస్తా. గౌతమ్రెడ్డి కుటుంబసభ్యుల సమక్షంలో ప్రాజెక్టును ప్రారంభిస్తాం. గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలిచేలా ‘మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ’గా నామకరణం చేస్తాం’’ అని జగన్ చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు అనిల్కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు కల్యాణచక్రవర్తి, ఎమ్మెల్యేలు కోటôరెడ్డి శ్రీధర్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, వరప్రసాద్రావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది.