Mekapati Goutham Reddy: గౌతమ్రెడ్డి హఠాన్మరణం
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో
హైదరాబాద్లోని నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిన ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి
హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలింపు
వైద్యులు గంటన్నర ప్రయత్నించినా దక్కని ఫలితం
తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎంలు జగన్, కేసీఆర్తోపాటు తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి
రాష్ట్రంలో రెండు రోజులు సంతాప దినాలు
రేపు ఉదయగిరిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ఈనాడు, హైదరాబాద్, అమరావతి - న్యూస్టుడే, ఫిల్మ్నగర్: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చిన వైద్యులు కార్డియో పల్మనరీ రిససటేషన్ (సీపీఆర్) చేశారు. ఎంత ప్రయత్నించినా గౌతమ్రెడ్డిలో చలనం లేకపోవడంతో ఉదయం 9.16 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ‘మంత్రి గౌతమ్రెడ్డి ఉదయం ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయనలో ఎలాంటి స్పందనా లేదు. శ్వాస కూడా తీసుకోవడం లేదు. గుండె వైద్యనిపుణులు, అత్యవసర వైద్య సిబ్బంది మంత్రిని రక్షించేందుకు ప్రయత్నించారు. దాదాపు 90 నిమిషాలపాటు సీపీఆర్ చేశారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని అపోలో ఆసుపత్రి వైద్య వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
ఉదయం 11.40 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రి నుంచి గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్లోని నివాసానికి తరలించారు. మంత్రి మృతి వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నేతను కోల్పోవడం చాలా విషాదకరమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.
రెండుసార్లు కొవిడ్ నుంచి బయటపడి...
గౌతమ్రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి. తండ్రిబాటలోనే రాజకీయ అరంగేట్రం చేసి 2014, 2019ల్లో వరుసగా రెండుసార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వరించింది. వివాదరహితుడిగా.. పరిశ్రమల, ఐటీ శాఖల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా దుబాయ్లో పర్యటించి, ఆదివారమే నగరానికి తిరిగొచ్చారు. గౌతమ్రెడ్డి రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డారు. మొదటి వేవ్లోనే ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో రెండు, మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, కోలుకున్నారు. గత నెల 22న మరోసారి (కరోనా మూడో వేవ్లో) కొవిడ్ బారినపడి ఇంట్లోనే ఐసొలేషన్లో ఉండి కోలుకున్నారు. గుండె ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపించిందా అనే అంశాన్ని కూడా వైద్య వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల గౌతమ్రెడ్డి బాగా శ్రద్ధ చూపుతుంటారు. నిత్యం రెండు గంటలపాటు వ్యాయామం చేస్తుంటారని సన్నిహితులు తెలిపారు. ఆరోగ్యపరంగానూ ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన హఠాన్మరణాన్ని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చికిత్సకు స్పందించకపోవడంతో యాంజియోగ్రామ్, ఇతర పరీక్షలు చేయడానికి వీలు కాలేదని వైద్యులు తెలిపారు. దీంతో గుండె కవాటాల్లో ఏవైనా పూడికలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా చెప్పడం కష్టమన్నారు.
హుటాహుటిన అపోలోకు తెలంగాణ మంత్రులు
గౌతమ్రెడ్డి మృతి వార్త తెలియగానే తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పువ్వాడ అజయ్కుమార్, ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, వైతెపా అధ్యక్షురాలు షర్మిల, సీఎం జగన్ తల్లి విజయమ్మ, కేవీపీ రామచంద్రరావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. గౌతమ్రెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.
గౌతమ్రెడ్డి మృతికి ప్రభుత్వం విచారం
పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మరణానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయన మృతికి నివాళిగా సోమ, మంగళవారాల్ని సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాల్ని అవనతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. గౌతమ్రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికార లాంఛనాలతో జరుగుతాయని వెల్లడించారు. అమెరికాలో ఉన్న గౌతమ్ కుమారుడు అర్జున్రెడ్డి మంగళవారం రాత్రికి చేరుకొనే అవకాశాలున్నాయి. మృతదేహాన్ని మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి నెల్లూరులోని పోలీస్ పరేడ్గ్రౌండ్కి హెలికాప్టర్లో తరలిస్తారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లి, ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది
సోమవారం ఉదయం 7.20 సమయంలో నిద్ర లేచి బయటకు వచ్చిన ఆయన సోఫాలో కూర్చున్నారు. ఒక్కసారిగా గుండెను చేతితో పట్టుకొని విలవిలలాడిపోయారు. గట్టిగా పిలవడంతో కింద ఉన్న నేను పరుగెత్తుకుంటూ పైకి వచ్చాను. అప్పటికే ఆయన కింద పడిపోయి ఉన్నారు. కూర్చోబెట్టి గుండెలపై బాగా వత్తాను. మంచినీళ్లు అడిగారు. తెచ్చి ఇచ్చినా తాగలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు లిఫ్ట్ వద్దకు తీసుకొచ్చేసరికి నాలుక మడతపడింది. నెమ్మదిగా అపస్మారక స్థితికి వెళ్లిపోతున్నారు. కారులో పడుకోబెట్టి 13 నిమిషాల్లోనే ఆసుపత్రికి తీసుకొచ్చాం. కారులో వచ్చేటప్పుడు శ్వాస ఉంది కానీ మాట్లాడలేదు. ఆసుపత్రిలో చేర్పించాం. ఆయన ఉదయం 8 గంటలకు జిమ్కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లి రాత్రి 9.30 గంటలకు తిరిగి వచ్చాం. మాకు దేవుడులాంటి మా సార్.. దూరమవడం జీర్ణించుకోలేకపోతున్నాం. 2003 నుంచి ఆయన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాను. నన్ను ఏనాడూ పనివాడిగా చూడలేదు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ అభయమిచ్చేవారు.
- నాగేశ్వరరావు, గౌతమ్రెడ్డి డ్రైవర్, ప్రత్యక్షసాక్షి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు