Internet: ‘ప్రమాదంలో’ ఇంటర్నెట్
ప్రపంచానికి మరో సంక్లిష్ట సవాలు ఎదురైంది! ప్రభుత్వాలు, సంస్థల అంతర్గత నెట్వర్కుల్లోకి దుండగులు సులభంగా చొచ్చుకెళ్లి... డేటాను తస్కరించేందుకు వీలు కల్పించే కొత్త సాఫ్ట్వేర్ బగ్ పుట్టుకొచ్చింది. దీని పేరు ‘లాగ్4షెల్’. చాపకింద నీరులా
గేమింగ్ సాఫ్ట్వేర్లో హానికర బగ్
ఇప్పటికే పలు సర్వర్లకు వ్యాప్తి?
ప్రభుత్వాల, సంస్థల డేటా, అంతర్గత నెట్వర్క్లకు తీవ్ర ముప్పు
బోస్టన్: ప్రపంచానికి మరో సంక్లిష్ట సవాలు ఎదురైంది! ప్రభుత్వాలు, సంస్థల అంతర్గత నెట్వర్కుల్లోకి దుండగులు సులభంగా చొచ్చుకెళ్లి... డేటాను తస్కరించేందుకు వీలు కల్పించే కొత్త సాఫ్ట్వేర్ బగ్ పుట్టుకొచ్చింది. దీని పేరు ‘లాగ్4షెల్’. చాపకింద నీరులా విస్తరించిన ఈ సమస్య గురువారం వెలుగుచూసింది. గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది. గత దశాబ్దకాలంలో తలెత్తిన అత్యంత ప్రమాదకర బగ్గా నిపుణులు దీన్ని భావిస్తున్నారు.
ఏమిటిది?
ఇంటర్నెట్లో యాప్లు, సర్వీసులు నిరంతరాయంగా పనిచేయడానికి... వాటి యాజమాన్య నెట్వర్క్ల సెక్యూరిటీ వ్యవస్థలు లాగిన్ లైబ్రరీలను వినియోగిస్తుంటాయి. ఇలాంటి వాటిలో ‘లాగ్4జే’కు మంచి పేరుంది. ఇది ఓపెన్ సోర్స్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలాసంస్థలు ఈ లాగిన్ లైబ్రరీని వినియోగిస్తున్నాయి. అయితే, దీనిసాఫ్ట్వేర్లో ఇటీవల ఓ భారీ లోపం తలెత్తింది. ఫలితంగా ఎవరైనా ఇతర నెట్వర్కుల్లోకి పాస్వర్డ్ లేకుండానే చొరబడేందుకు ఆస్కారం లభించింది! ఈ బగ్ అక్కడితో ఆగకుండా చిన్నారులు ఎక్కువగా వినియోగించే ఆన్లైన్ గేమింగ్ సాఫ్ట్వేర్ టూల్ ‘మైన్క్రాఫ్ట్’లోనూ కనిపించింది. మరిన్ని సర్వర్లకూ ఇది వ్యాపించి ఉండొచ్చని, నష్టతీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అంచనా చిక్కడం లేదని నిపుణులు చెప్పారు.
ఎలాంటి ముప్పు ఉంటుంది?
క్లౌడ్ సర్వర్లను ఉపయోగించే ప్రభుత్వ, వాణిజ్య సంస్థల సాఫ్ట్వేర్ యుటిలిటీలు ‘లాగ్4షెల్’ ప్రభావానికి గురైనట్టు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్ట్రైక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆడమ్ మేయర్స్ శనివారం వెల్లడించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే... ఈ బగ్ సాయంతో నేరస్థులు, గూఢచారులు అంతర్గత నెట్వర్కుల్లోకి సులభంగా ప్రవేశించే ముప్పు ఉంటుందని తెలిపారు. అత్యంత కీలక డేటాను వారు తస్కరించేందుకూ, మార్పులు చేసేందుకూ, మాల్వేర్ను ప్రవేశ పెట్టేందుకూ ఈ బగ్ తావిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ‘‘ఇంటర్నెట్ ప్రస్తుతం మంటల్లో చిక్కుకొంది’’ అని మేయర్స్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే లక్షల సర్వర్లలో ఈ బగ్ లోడ్ అయిందని, ఏ స్థాయిలో ప్రమాదం వాటిల్లిందన్నది తెలియడానికి మరిన్నిరోజులు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో, ఆధునిక కంప్యూటింగ్ చరిత్రలో సంభవించిన అత్యంత ప్రమాదకరమైన, భారీ సాంకేతిక లోపం ఇదే కావచ్చని మరో సైబర్ సెక్యూరిటీ సంస్థ టెనబుల్ సీఈవో అమిత్ యోరాన్ పేర్కొన్నారు.
అప్రమత్తమైన మైక్రోసాఫ్ట్...
వెబ్సైట్, వెబ్ సర్వీసులను నిర్వహించే ఓపెన్ సోర్స్ ‘అపాచీ సాఫ్ట్వేర్’లో ఈ బగ్ ఉందంటూ చైనా సాంకేతిక దిగ్గజ సంస్థ అలీబాబా గత నవంబరులోనే అప్రమత్తం చేసింది. కానీ, అప్పటికే ఇది చాలా నెట్వర్క్ల్లో చొరబడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమింగ్ వేదిక ‘మైన్క్రాఫ్’్టలో లాగ్4షెల్ సంకేతాలు వెలుగుచూశాయి. దీంతో దాని యాజమాన్య సంస్థ మైక్రోసాఫ్ట్ అప్రమత్తమై, సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేసింది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా బగ్ నుంచి రక్షణ పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఆపిల్, అమెజాన్, ట్విటర్, క్లౌడ్ఫ్లేర్ వంటి సంస్థల సర్వర్లకూ ‘లాగ్4షెల్’ వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బగ్ తమ సర్వర్లలో చొరబడినట్టు ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలూ లేవని క్లౌడ్ఫ్లేర్ వెల్లడించింది. మిగతా దిగ్గజ సంస్థలు మాత్రం ఇంకా దీనిపై స్పందించలేదు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM