CM Jagan - Jagananna Vidya Kanuka: రాత పుస్తకాలనూ వదల్లేదు

జగనన్న విద్యాకానుకలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఇచ్చే రాత పుస్తకాలపైనా (నోట్‌బుక్స్‌) ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాన్ని ముద్రించారు.

Updated : 11 Jun 2023 07:12 IST

జగనన్న విద్యాకానుకలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఇచ్చే రాత పుస్తకాలపైనా (నోట్‌బుక్స్‌) ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాన్ని ముద్రించారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌, బూట్లు, సాక్సులు, బెల్టు తదితర సామగ్రితో కూడిన జేవీకే కిట్‌ను అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జగనన్న విద్యాకానుక గుంటూరు స్టాక్‌ పాయింట్‌లో విద్యాసామగ్రి మొత్తాన్ని ప్రదర్శనగా ఉంచారు. వాటిని పరిశీలించగా పాఠ్య, రాత పుస్తకాలపై జగన్‌ చిత్రాన్ని ముద్రించగా.. బ్యాగ్‌పై జగనన్న విద్యాకానుక అని రాయించారు. 

ఈనాడు గుంటూరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని