NTR Daughter: తాడు బిగిసి స్వరపేటిక విరగటంతో ఉమామహేశ్వరి మృతి

దివంగత ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతి కేసులో ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులు పోస్టుమార్టం నివేదికను శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు అందజేశారు. ఈ నెల ఒకటో తేదీన

Updated : 06 Aug 2022 07:49 IST

పోస్టుమార్టం నివేదిక అందజేసిన వైద్యులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: దివంగత ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతి కేసులో ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులు పోస్టుమార్టం నివేదికను శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు అందజేశారు. ఈ నెల ఒకటో తేదీన ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె భౌతికకాయానికి వైద్యులు పంచనామా నిర్వహించారు. మెడ చుట్టూ తాడు గట్టిగా బిగించుకోవడం వల్ల స్వరపేటిక విరిగి ఆమె మరణించినట్లు తేల్చారు. అనుమానాస్పద మృతి కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని