Kuppam: కుప్పానికి భారీగా స్థానికేతరులు
ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తూ ప్రచార సమయం ముగిశాక సైతం వందల సంఖ్యలో స్థానికేతరులు కుప్పం పురపాలిక పరిధిలోకి వచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, దొంగ ఓట్లేయడమే వారి పని
ఫొటోలు, వీడియోలను జత చేసి ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఈనాడు, ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తూ ప్రచార సమయం ముగిశాక సైతం వందల సంఖ్యలో స్థానికేతరులు కుప్పం పురపాలిక పరిధిలోకి వచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, పోలింగ్ రోజు దొంగ ఓట్లేయడమే లక్ష్యంగా వైకాపా నాయకులు వారికి స్థానికంగా ఆశ్రయమిచ్చారని మండిపడ్డారు. ‘‘ప్రచార గడువు ముగిసినా వైకాపా వారు స్థానికేతరులను కుప్పానికి తీసుకొస్తున్నారు. వారితో డబ్బు పంపిణీ చేయిస్తున్నారు. ఓటర్లను, తెదేపా నాయకులను బెదిరిస్తున్నారు. దీన్ని పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు’ అని ఆరోపించారు. ‘‘దొంగ ఓట్లు వేసేందుకు తీసుకొచ్చిన వారందరినీ వేర్వేరు చోట్ల ఉంచారు. దీనిపై మీకు, డీజీపీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం. వీటిపై సమాచారమిచ్చినా పోలీసులు స్పందించక ఎదురుకేసులు పెడుతున్నారు. దురుద్దేశంతో వస్తున్న స్థానికేతరులను అడ్డుకోకపోతే స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘కుప్పం 23, 24వ వార్డుల్లో ఓటర్లకు డబ్బు పంచుతున్న స్థానికేతరుల్ని తెదేపా పట్టణ అధ్యక్షుడు రాజకుమార్ అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోపు వైకాపావారు రాజ్కుమార్ను కులం పేరుతో దూషించారు. చాలాసేపటికి వచ్చిన పోలీసులు.. ఫిర్యాదునివ్వాలంటూ రాజ్కుమార్ను స్టేషన్కు రప్పించి తీరా అక్కడికెళ్లాక వైకాపావారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన్ని అరెస్టు చేశారు. స్థానిక వైకాపా నేతలతో కుమ్మక్కైన పోలీసుల తీరుకు ఇదో ఉదాహరణ. స్థానికేతరులను వాహనాల్లో తరలించిన ఫొటోలు, వీడియోలను లేఖకు జత చేస్తున్నాం. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక పోలీసులను, జిల్లా కలెక్టర్ను ఆదేశించండి’’ అని లేఖలో కోరారు.
* కుప్పంలో డబ్బు పంచుతూ నోట్ల కట్టలతో పట్టుబడ్డ వైకాపా నేతలను అరెస్టు చేయకుండా పోలీసులు తమ పార్టీ నేతలను బెదిరించడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరులో తమ పార్టీ నేత కప్పిర శ్రీనివాసులును మంత్రి అనిల్కుమార్ వారం రోజులుగా పోలీసుస్టేషన్కు పిలిపించి వేధించడం వైకాపా దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసులు ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఆయనకు ప్రాణహాని జరిగితే మంత్రి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
* కుప్పం పట్టణ తెదేపా అధ్యక్షుడు రాజశేఖర్, నెల్లూరులో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో ఉన్న తెదేపా నేత కప్పిర శ్రీనివాసులు, భార్య రేవతిని.. చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.
నేడు కుప్పం వెళ్లనున్న చంద్రబాబు
చంద్రబాబు సోమవారం కుప్పం వెళ్లనున్నారు. కుప్పం పురపాలక సంఘానికి సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్తారు. ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తారు.
తెదేపాలోకి పులివెందుల నియోజకవర్గ వాసులు
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన పులివెందుల నియోజకవర్గ వాసులు
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని నల్లపురెడ్డిపల్లె, వేంపల్లి, రావులకొలను పంచాయతీలకు చెందిన 25 కుటుంబాలవారు ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. ‘జగన్ సొంత నియోజకవర్గంనుంచి పలువురు యువకులు.. తెదేపాలో చేరేందుకు ముందుకు వచ్చారు. సొంత నియోజకవర్గంలోని వారే సీఎం పాలనపై విసిగిపోయారు’ అని పేర్కొన్నారు. ‘ఓటు హక్కు వచ్చినప్పటినుంచి మొదట్లో కాంగ్రెస్కు, తర్వాత వైకాపాకు ఏజెంట్గా పనిచేశాం. యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా నల్లపురెడ్డిపల్లెలో 500 మందివరకు నిరుద్యోగులు ఉపాధి లేకుండా ఉన్నారు. గిట్టుబాటు ధరలందక రైతులు కూడా స్వచ్ఛందంగా తెదేపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని పార్టీలో చేరిన కార్యకర్తలు చెప్పారు. ‘మొదట్నుంచి వైకాపాలో ఉన్నాం.. స్టేషన్ల చుట్టూ తిరిగాం.. ప్రతిపక్షంలో చేరితే అంతకంటే ఎక్కువ శిక్ష ఉంటుందని తెలిసినా తెగించాం. తెదేపాలో చేరాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం’ అని వివరించారు. మారుజోల్ల కులవర్ధన్రెడ్డి, హరీశ్ మేకల, అశోక్ మేకల, మహేశ్, రమేశ్, ఓబులేసు, చంటి మారుతి కలమల్ల, కలిబాబు, మునిస్వామి, భార్గవ్ గోగుల, నారాయణస్వామి, వీరయ్య, వినయ్, డేరంగుల శ్రీనివాస్, మేదర గంగన్న, ఉప్పు కుమార్, పఠాన్ అన్వర్, పామిశెట్టి మహేశ్, తమ్మిశెట్టి వెంకటయ్య, షేక్ రఫీ, అమీర్, శంకర్ తదితరులు పార్టీలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే