Manipur Election Results 2022: మణిపురాధీశులు కమలనాథులే!
మణిపుర్ శాసనసభ ఎన్నికలలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన భాజపా ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. గత ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్
పక్కా ప్రణాళికతో భాజపా ఘన విజయం
ఈనాడు, గువాహటి: మణిపుర్ శాసనసభ ఎన్నికలలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన భాజపా ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. గత ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ ఈసారి పూర్తిగా చతికిలపడింది. మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన భాజపా 32 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఈసారి ఆరు స్థానాలు సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి ఏడు, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు ఐదు సీట్లు దక్కాయి. కుకీ పీపుల్స్ పార్టీ అలయెన్స్ (కేపీఏ) రెండు, స్వతంత్రులు మూడు సీట్లను సాధించారు. 2002 నుంచి 2017 వరకూ వరుసగా మూడుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ దఫా ఐదు సీట్లకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, జనతాదళ్ (సెక్యులర్) పొత్తు పెట్టుకున్నప్పటికీ ‘హస్తం’ పార్టీకి కలిసిరాలేదు.
2017లో జరిగిన మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 28 స్థానాలు రాగా భాజపాకు 21 మాత్రమే వచ్చాయి. ఎన్పీపీ, ఎపీఎఫ్ తోడ్పాటుతో కమలం పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తాజా ఎన్నికలకు ముందు విభేదాలు రావడంతో భాజపా సొంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. భాజపా ఓట్ల శాతం 37.8కి పెరిగింది. కాంగ్రెస్ మాత్రం 16.8 శాతంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హెయిన్గాంగ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై 18,271 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం ఇబోబీ సింగ్ విజయం సాధించారు.
పల్లెలకు వెళ్లి... పర్వతాలు ఎక్కి...
రాజకీయ చాణక్యం ప్రదర్శించడంతోపాటు గత అయిదేళ్లలో ప్రజలలోకి విస్తృతంగా వెళ్లేందుకు భాజపా నాయకులు ప్రయత్నించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములు రచ్చచేస్తున్నా సంయమనంతో వ్యవహరించి అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి బీరేన్సింగ్ దృష్టి సారించారు. గ్రామాలకు వెళదాం (గో టు విలేజస్), కొండలకు వెళదాం (గో టు హిల్స్) వంటి ప్రణాళికల ద్వారా ఆయన జనానికి చేరువయ్యేందుకు ప్రయత్నించారు. ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి విలువ లేకుండా చేశామని పార్టీ నాయకులు ప్రకటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి రథం జంట ఇంజన్ల మీద పరుగులు తీస్తుందన్న మోదీ ప్రచారం భాజపాకు కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
జర్నలిస్టు నుంచి సీఎం వరకు..
ఇంఫాల్: మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్సింగ్.. జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లో చేరి అంచలంచెలుగా ఎదిగారు. 1992లో ‘నహరోల్జి తౌడాంగ్’ అనే వార్తా పత్రికను ప్రారంభించి 2001 వరకు ఎడిటర్గా పనిచేశారు. ఆ గుర్తింపుతోనే 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత డెమొక్రటిక్ రెవల్యూషనరీ పీపుల్స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కాంగ్రెస్లోకి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. స్వల్ఫకాలంలోనే ఇబోబి సింగ్కు అత్యంత సన్నిహితుడిగా మారారు. 2002 నుంచి 2016 వరకు కాంగ్రెస్ హయాంలో పలు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు. 2016లో కాంగ్రెస్తో విబేధించి భాజపాలో చేరారు. 2017 ఎన్నికల్లో ఎన్పీపీ, ఎన్పీఎఫ్, ఎల్జేపీ, టీఎంసీల భాగస్వామ్యంతో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2020లో పార్టీలో ఆయనపై వ్యతిరేకత బహిర్గతమైనప్పటికీ రాజకీయ చతురతతో సద్దుమణిగేలా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
సంక్షిప్త వార్తలు
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.