Vande Bharat: తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందేభారత్లు
శతాబ్ది, రాజధాని కంటే ఆధునికమైన, వేగవంతమైన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అతి త్వరలోనే మరిన్ని కేటాయిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో 35 స్టేషన్ల అభివృద్ధి
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
సుతారపు సోమశేఖర్
ఈనాడు - హైదరాబాద్
శతాబ్ది, రాజధాని కంటే ఆధునికమైన, వేగవంతమైన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అతి త్వరలోనే మరిన్ని కేటాయిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఆదివారం వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం అనంతరం అశ్వినీ వైష్ణవ్ ‘ఈనాడు’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్తగా బెర్తులతో కూడిన స్లీపర్ వందేభారత్, వందే మెట్రో రైలు డిజైన్ పూర్తయిందని, త్వరలో వాటి ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 35 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని.. త్వరలో వాటి పేర్లు ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందించబోయే అతిపెద్ద బహుమతిగా దీనిని అభివర్ణించారు.
తెలుగు రాష్ట్రాలకు ఎన్ని వందేభారత్లు ఇచ్చే అవకాశం ఉంది?
అతి త్వరలోనే సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, విజయవాడకు ఈ రైళ్లను ప్రారంభిస్తాం. మూడేళ్లలో 475 వందేభారత్లను ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. ఎనిమిది రైళ్లు పట్టాలెక్కాయి. తొలిదశలో దేశంలో 75 నగరాలను అనుసంధానించడం లక్ష్యం. సికింద్రాబాద్-విశాఖపట్నం రైలుతో 30 నగరాలు పూర్తయ్యాయి. ప్రతి 10 రోజులకు ఒకటి అందుబాటులోకి తెస్తున్నాం. తొమ్మిదో వందేభారత్ని ఈ నెల 23, 24 తేదీల్లో ప్రారంభిస్తాం. ఈ రైళ్ల జీవితకాలం 35 సంవత్సరాలు. మొదటివిడత పూర్తయ్యాక రెండో దఫాలో తెలుగు రాష్ట్రాలకు కొత్త వందేభారత్ రైళ్లు వస్తాయి. తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రధాన నగరాలను వీటితో అనుసంధానం చేస్తాం.
వందేభారత్ గరిష్ఠ వేగం 160-180 కి.మీ. ప్రస్తుత ట్రాక్ల సామర్థ్యం 110-130 కి.మీ. మాత్రమే కదా?
గతంలో రైలు పట్టాల సామర్థ్యం గంటకు 70 కి.మీ. మాత్రమే. గత ఎనిమిదేళ్లలో 110 కి.మీ.కు, కొన్నిచోట్ల 130 కి.మీ.కు పెంచాం.సికింద్రాబాద్-విజయవాడ సహా పలు మార్గాల్లో ట్రాక్ సామర్థ్యాన్ని ఏడాది, ఏడాదిన్నరలో 160 కి.మీ.కు పెంచబోతున్నాం.
ఛార్జీలు భారీగా ఉన్నాయి. సామాన్యులు ఈ రైళ్లలో ప్రయాణించగలరా?
ప్రయాణికులు ఇప్పుడు సమయానికి, సౌకర్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. త్వరగా గమ్యం చేరాలని, ప్రయాణంలో అనుభూతి పొందాలని కోరుకుంటున్నారు. అవన్నీ వందేభారత్లో ఉన్నాయి.
కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఈసారైనా కేటాయింపులు పెరిగే అవకాశం ఉందా?
రైల్వేపరంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి గతేడాది రూ.12 వేల కోట్లు కేటాయించాం. అతి పెద్ద రాష్ట్రం, ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర్ప్రదేశ్కు ఇచ్చింది రూ.11 వేల కోట్లే.
తెలంగాణకు ఇచ్చింది రూ.3 వేల కోట్లే కదా?
2014కు ముందుతో పోలిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు చాలా రెట్లు పెంచాం. ఇంకా అధిక నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రాజెక్టులకు భూసేకరణలో జాప్యంతో పాటు, రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయడంలేదు. రాష్ట్రం సహకరించాలి.
బీబీనగర్-నల్లపాడు రెండోలైను మంజూరు ఎప్పుడు?
యూపీఏ హయాంతో పోలిస్తే ప్రస్తుతం నాలుగు రెట్లు ఎక్కువ డబ్లింగ్ (రెండో లైను) చేశాం. బీబీనగర్-నల్లపాడు డబ్లింగ్ ప్రాజెక్టుకు అధిక నిధులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు భూమి సేకరించి ఇవ్వాలి. ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ఎప్పుడు మొదలవుతాయి?
జోన్ ప్రధాన కార్యాలయ భవనాలకు స్థలం ఖరారైంది. నిర్మాణ పనులు పూర్తయ్యాక కొత్త జోన్కు జనరల్ మేనేజర్ (జీఎం)ని నియమిస్తాం.
తెలంగాణలో కాజీపేట, ఏపీలో బాలాజీ రైల్వే డివిజన్లు కావాలన్న డిమాండ్లపై..?
చిన్న జోన్లు, డివిజన్లతో రైల్వే శాఖ సామర్థ్యం తగ్గుతుంది. ఒక రైలు గమ్యస్థానం చేరేలోగా అనేక డివిజన్ల మీదుగా ప్రయాణించాలి. రైళ్లను సురక్షితంగా తమ సరిహద్దులు దాటించడం వంటి బాధ్యతలు ఆయా డివిజన్లపైనే ఉంటాయి. మధ్యలో లోకో సిబ్బంది మారుతుంటారు. ఈ అంశాల నేపథ్యంలో కొత్త డివిజన్ల ఏర్పాటు సాధ్యం కాదు.
రైళ్లలో జనరల్ బోగీలు రెండు, మూడే ఉండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు కదా?
కొవిడ్ తగ్గాక జనరల్ బోగీలను పునరుద్ధరించాం. మొత్తం జనరల్ బోగీలు మాత్రమే ఉండే రైళ్లను కొన్ని ప్రవేశపెట్టాం. మరిన్ని ప్రవేశపెడతాం.
సీనియర్ సిటిజన్లకు రాయితీ ప్రయాణం ఎప్పుడు పునరుద్ధరిస్తారు?
ఇప్పటికే ప్రతి ప్రయాణికుడికి 55 శాతం రాయితీ ఇస్తున్నాం. సబ్సిడీల రూపంలో ఏటా రూ.59 వేల కోట్లు భరిస్తున్నాం. సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ ఇప్పట్లో ఉండకపోవచ్చు.
హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పట్టణాలు, నగరాలకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు నడిపే అవకాశం ఉందా?
దేశవ్యాప్తంగా కొత్త రకం వందే మెట్రో రైళ్లు తీసుకురాబోతున్నాం. వీటి ప్రయాణదూరం 200-250 కి.మీ. మాత్రమే ఉంటుంది. మధ్యలో అనేక పట్టణాల్లో ఆ రైళ్లు ఆగుతూ అందరికీ అందుబాటులో ఉంటాయి. 2024లో వీటి ఉత్పత్తి మొదలవుతుంది. వీటి రాకతో తెలంగాణలో ఇంటర్సిటీ అవసరం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.