Tamilnadu: విద్వేషాలు విడిచి వైవిధ్యంగా నడిచి.. తమిళనాట రాజకీయ కక్షలకు చెల్లు
ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలంటే ప్రత్యర్థులపై ప్రతీకారాలకు పెట్టింది పేరు. డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఒకరింటికి మరొకరు శుభకార్యాలకు కూడా వెళ్లరని ప్రతీతి. డీఎంకే నుంచి కరుణానిధి, అన్నాడీఎంకే
ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన పరిస్థితి..
ఈనాడు-చెన్నై, న్యూస్టుడే-చెన్నై: ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలంటే ప్రత్యర్థులపై ప్రతీకారాలకు పెట్టింది పేరు. డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఒకరింటికి మరొకరు శుభకార్యాలకు కూడా వెళ్లరని ప్రతీతి.
డీఎంకే నుంచి కరుణానిధి, అన్నాడీఎంకే నుంచి జయలలిత.. ఇద్దరిలో ఎవరు సీఎం అయినా.. ప్రతిపక్షంపై ప్రతీకార రాజకీయాలు చేసేవారు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు సాక్షాత్తు అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానం, ఆ తర్వాత జయ అధికారంలోకి రాగానే అర్ధరాత్రి కరుణానిధిని అరెస్టు చేసి తీసుకువెళ్లిన తీరు అప్పట్లో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి.
ఇవన్నీ ఒకప్పటి మాటలు.. గతేడాది డీఎంకే అధికారంలోకి వచ్చి స్టాలిన్ సీఎం అయ్యాక.. ఈ వైఖరిని మార్చేశారు. రాజకీయాలు, పరిపాలనను వేరు చూస్తూ స్టాలిన్ తీసుకొచ్చిన సరికొత్త మార్పులు ప్రశంసలు పొందుతున్నాయి. విద్వేష రాజకీయాలు, గత ప్రభుత్వాల హయాంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడం, నిధుల్ని దుబారా చేయడం వంటివి ఆయన పూర్తిగా పక్కనపెట్టారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నపుడు తెచ్చిన పథకాల్ని దాదాపుగా కొనసాగించడంతోపాటు వాటి పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి విరుద్ధంగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలోని పథకాల్లో కొన్నింటిని రద్దు చేయగా చాలావాటికి పేర్లు మార్చేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పూర్తిగా మూతపెట్టారు. తాజాగా.. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. దీంతో సహజంగానే పొరుగు రాష్ట్రంలోని పరిస్థితి గురించి తెలుసుకోవడం ఆసక్తికరం.. ఆ వివరాలివి..
జయ బొమ్మతోనే స్కూల్ బ్యాగులు
తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందుకు అన్నాడీఎంకే హయాంలో పాఠశాల విద్యార్థుల బ్యాగులపై మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అప్పటి సీఎం ఎడప్పాడి పళనిస్వామి బొమ్మలు ముద్రించారు. డీఎంకే వచ్చాక వారి చిత్రాలతో మిగిలి ఉన్న 65 లక్షల బ్యాగుల్ని పక్కన పారేయడకుండా విద్యార్థులకు పంపిణీ చేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 13 కోట్లు ఆదా అయింది.
అమ్మ క్యాంటీన్లకు ఆదరణ..
జయలలిత హయాంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అమ్మ క్యాంటీన్లను ప్రవేశపెట్టింది. పేదలకు తక్కువ ధరలతో ఆహారం అందించే ఈ కేంద్రాల్ని స్టాలిన్ ప్రభుత్వం రద్దు చేయకుండా.. వాటిని అదే పేరుతో మరింత మెరుగ్గా కొనసాగిస్తుండడం ప్రశంసలు కురిపిస్తోంది. అలాగే జయలలిత 2001-06 మధ్య కాలంలో ఆలయాల్లో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని డీఎంకే ప్రభుత్వం మరిన్ని ఆలయాలకు విస్తరించింది. ఈ పథకం ప్రస్తుతం 756 ఆలయాల్లో అందుబాటులో ఉంది.
ఆసుపత్రుల్లో అమ్మ చిత్రాలే నేటికీ..
జయలలిత అనారోగ్యంతో ఉన్నప్పుడు స్టాలిన్ పలుమార్లు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో ఇప్పటికీ జయలలిత ఫొటోలు, పోస్టర్లు ఉన్నాయి. తాజాగా చెన్నైలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన చెస్ ఒలింపియాడ్ ముగింపు కార్యక్రమంలో జయలలిత మహిళా సాధికారతకు చేసిన కృషి గురించి ప్రస్తావించారు. ప్రతిపక్షాలు సైతం ఈ చర్యను ప్రశంసించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు