NV Ramana:ప్రభుత్వం, కార్యనిర్వాహక వ్యవస్థ
‘న్యాయం చేయడం అనేది కోర్టుల పనే కాదు.. ప్రభుత్వ బాధ్యత కూడా. రాజ్యాంగంలో పేర్కొన్న కొన్ని అధికరణల ప్రకారం న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం
చట్టానికి లోబడి పని చేయాలి
పౌర హక్కులకు భంగం వాటిల్లితే కోర్టులను ఆశ్రయించాలి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ
ఈనాడు, అమరావతి: ‘న్యాయం చేయడం అనేది కోర్టుల పనే కాదు.. ప్రభుత్వ బాధ్యత కూడా. రాజ్యాంగంలో పేర్కొన్న కొన్ని అధికరణల ప్రకారం న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, కార్య నిర్వాహక వర్గంపై ఉంది. ప్రభుత్వం, కార్య నిర్వాహక వ్యవస్థలు చట్టానికి లోబడి పనిచేస్తే.. ఎవరూ న్యాయస్థానాలకు రావాల్సిన పనిలేదు. ఈ రెండూ పరిధులు దాటినప్పుడు.. న్యాయస్థానాలు తప్పకుండా జోక్యం చేసుకుంటాయి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో సీజేఐకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంలోని మూడు విభాగాలు ధర్మబద్ధంగా పని చేస్తే వాటిపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పౌర హక్కులకు భంగం కలిగితే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి’ అని సూచించారు.
సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా
న్యాయ వ్యవస్థను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు సుదీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదని సీజేఐ చెప్పారు. ‘నాకు ముందున్న సీజేఐలు వీటిని ప్రస్తావించారు. ఇప్పుడు నేను చెబుతున్నా. నా తర్వాత వచ్చినవారూ ప్రస్తావిస్తారు. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యాన్ని క్రమంగా మర్చిపోతున్నారు. పోలీసులు కేసు పెట్టినప్పుడో, న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడే అందరికీ గుర్తుకువస్తోంది. మిగిలిన సమయాల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ న్యాయస్థానాలకు రావాలని కోరుకోను. కాకపోతే తమ హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పకుండా కోర్టు తలుపు తట్టాల్సిందే. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థను భారతీయీకరణ చేయాలి. దేశంలోని సామాన్యుల నుంచి పెద్దవారి వరకు.. న్యాయ ప్రక్రియ, కోర్టులు, చట్టాలు అంటే అర్ధం కాని బ్రహ్మ పదార్థంలా చూస్తున్నారు. సరళీకరణ జరిగితేనే న్యాయవ్యవస్థ అందరికీ చేరువవుతుంది. తన కేసు గురించి ఏం మాట్లాడుకుంటున్నారో కక్షిదారులకు తెలియాలి. తీర్పు ఏం చెబుతున్నారో అర్థం కావాలి. అప్పుడే న్యాయస్థానాల పట్ల గౌరవం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా న్యాయ విభాగంలో కనీస సదుపాయాలు పెరగాలి. ప్రస్తుతం దేశంలోని వివిధ కోర్టుల్లో 4.60 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అన్ని కేసులు ఉండటం పెద్ద సంఖ్యేమీ కాదు. అయితే చిన్న కేసులను కూడా ఏళ్ల తరబడి సాగదీయకుండా సత్వరమే తీర్పులివ్వాల్సిన బాధ్యత న్యాయస్థానాలు, జడ్జిలపై ఉంది. ఇందులో ప్రభుత్వానికీ బాధ్యత ఉంది. న్యాయ వ్యవస్థలో సమస్యలను పరిష్కరించి అందరికీ న్యాయం అందించాలని ప్రయత్నిస్తున్నా. ఇందులో భాగంగా జడ్జిల ఖాళీలను భర్తీ చేయడం, కొత్త కోర్టుల ఏర్పాటు, చట్టాల సవరణలకు శాయశక్తులా కృషి చేస్తున్నా’ అని జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు.
ఈ పురస్కారం బాధ్యతను పెంచింది
‘ఈ పురస్కారం నాకు మరింత బాధ్యతను పెంచింది. సాధించాల్సింది చాలా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. మీ ఆశలకు అనుగుణంగా పనిచేసి, న్యాయ కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగురవేస్తా’ అని సీజేఐ హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగంపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ‘ప్రజలు తమ హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలంటే.. వారికి హక్కుల గురించి తెలియ జేయాలి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు నేను గౌరవాధ్యక్షుణ్ని. మేం అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం. నాణ్యమైన, నమ్మకమైన న్యాయ సహాయం అందించేందుకు కృషి చేస్తున్నాం. రూల్ ఆఫ్ లా (చట్టబద్ధమైన పాలన) చాలా ముఖ్యం. ఇది లేకపోతే ఏ దేశంలోనైనా అరాచకం ప్రబలుతుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మేధావి వర్గంవైపు చూస్తుంటారు. వారు ప్రజలకు ఇతోధికంగా తోడ్పాటు అందించినప్పుడే దేశానికి, రాజ్యాంగానికి మేలు చేసిన వారవుతారు’ అని సీజేఐ చెప్పారు.
బెజవాడ, కృష్ణా నీళ్లే నా బలం
‘విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. అనేక రాజకీయ సిద్ధాంతాలకు పుట్టినిల్లు. నేను ఇక్కడే న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టి, తర్వాత హైదరాబాద్కు మకాం మార్చాను. బెజవాడ వీడి వెళ్లాలంటే చాలా బాధేసింది. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇక్కడికి వచ్చి సోమవారం ఉదయానికి తిరిగి హైదరాబాద్ వెళ్లేవాణ్ని. నాకు ఈ నగరంతో ఎన్నో ఆనందకరమైన అనుభూతులు ఉన్నాయి. ఇక్కడివారు ఎంతోమంది న్యాయవాదులు, అధ్యాపకులు, వైద్యులు, పాత్రికేయులు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించారు. కానీ.. గతంలో నేను చూసినంత గొప్పగా ఇప్పుడు విజయవాడ లేదన్నది వాస్తవం. మళ్లీ ఒకసారి జూలు విదిల్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి చేరడానికి, దృఢంగా తయారవడానికి బెజవాడ, కృష్ణా నీళ్లు నాకెంతో దోహదపడ్డాయి’ అని జస్టిస్ ఎన్.వి.రమణ ఆనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.
తెలుగును మరవద్దు..
‘తెలుగు భాష ఎంతో ఉత్కృష్టమైనది. మాతృభాషను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆంగ్లం కానీ మరే భాష అయినా నేర్చుకోండి ఫర్వాలేదు. కానీ అమ్మ భాషపై మనకు సరైన పునాది లేకపోతే.. మన ఆలోచనల్లో పరిపక్వత రాదు. తెలుగులోనే మాట్లాడండి. పుస్తకాలు చదవండి. తెలుగులో ఉత్తరాలు రాయడం అలవాటు చేసుకోండి. తెలుగు భాష ఔన్నత్యాన్ని, సంస్కృతి, సాహిత్యం గురించి ప్రపంచానికి తెలియజేయండి. ఇదే నేను మీ అందరికీ ఇచ్చే సందేశం’ అని సీజేఐ చెప్పారు.
జస్టిస్ ఎన్.వి.రమణ, ఆయన సతీమణి శివమాలను విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా సీజేఐకి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. పురస్కారం కింద ఆయనకు ఇవ్వాల్సిన రూ.25 వేల నగదును.. ఎస్కేసీవీ చిల్డ్రన్ హోం, నవజీవన్ బాలభవన్లకు చెరి సగం అందజేశారు. జస్టిస్ ఎన్.వి.రమణ పేరున ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు ఆంధ్ర హాస్పిటల్ ప్రకటించింది. సిద్ధార్థ అకాడమీ జస్టిస్ ఎన్.వి.రమణకు పురస్కారాన్ని అందజేసింది. అనంతరం ఐఎంఏ, ఛాంబర్ ఆఫ్ కామర్స్, వాసవ్య మహిళా మండలి, సర్వోదయ ట్రస్టు, రెడ్క్రాస్ సొసైటీ, క్రెడాయ్, తదితర సంస్థల ప్రతినిధులు సీజేఐ దంపతులను సత్కరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత కుమార్ మిశ్ర, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ హాజరయ్యారు.
భారీగా తరలివచ్చిన ప్రముఖులు
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, అచ్చెన్నాయుడు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామి, రహదారులు భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కర్ణాటక అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ హెప్సిబా రాణి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతికుమార్, పర్యావరణవేత్త అజయ్ కాట్రగడ్డ తదితరులు సీజేఐని కలిసిన వారిలో ఉన్నారు.
వేదికపై నుంచి దిగి వచ్చిన సీజేఐ
గుంటూరుకు చెందిన న్యాయవాది పరంధామయ్య సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణను కలవడానికి వచ్చారు. ఆయన వయోభారంతో వేదికపైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతుండటాన్ని జస్టిస్ రమణ చూశారు. పైకి రావొద్దని వారించి.. వెంటనే తానే కిందకు దిగి వచ్చి కలిశారు. పరంధామయ్యను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.