Omicran:రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు
రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి చెన్నై విమానాశ్రయం ద్వారా తిరుపతికి వచ్చిన మహిళకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే విజయనగరం జిల్లాకు చెందిన
తిరుపతిలో మహిళకు సోకినట్లు గుర్తింపు
ఈనెల 10న కెన్యా నుంచి వచ్చిన బాధితురాలు
ఈనాడు, తిరుపతి: రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి చెన్నై విమానాశ్రయం ద్వారా తిరుపతికి వచ్చిన మహిళకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి (34) ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 45 మంది కొవిడ్ బారినపడ్డారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిందరి నమూనాలను సీసీఎంబీకి పంపారు. అంతా ఆరోగ్యంగా ఉన్నారు.
కెన్యాకు చెందిన మహిళ (39) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 10న చెన్నై వచ్చారు. అక్కడి నుంచి కారులో తిరుపతిలోని తన తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్నారు. ఆమెకు ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో చెన్నై విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ నిర్వహించలేదు. ఇంటికి వచ్చాక తన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా గడిపారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ నెల 12న ఆమె నుంచి నమూనా సేకరించి పరీక్షించగా... కొవిడ్ పాజిటివ్ వచ్చింది. నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ సీసీఎంబీకి పంపించారు. ఒమిక్రాన్ వేరియంట్ను నిర్ధారిస్తూ సీసీఎంబీ ఈనెల 22న సమాచారం ఇచ్చారు. బాధిత మహిళను తిరుపతిలోని విష్ణు నివాసంలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకురాలు హైమావతి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 103 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!