Omicron Variant: మరింతగా పాకుతోంది
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ మరిన్ని దేశాలకు వ్యాపించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో సోమవారం ఈ కేసులు వెలుగుచూశాయి. పోర్చుగీస్కు చెందిన 13 మంది ఫుట్బాల్ క్రీడాకారులకు కొత్త వేరియంట్
ఒమిక్రాన్ను అడ్డుకునేందుకు పలు దేశాల చర్యలు
ఫిలిప్పీన్స్లోని క్యూజోన్ నగరంలో కరోనా వ్యాక్సిన్ కోసం బారులు తీరిన ప్రజలు
దిల్లీ, ద హేగ్, టోక్యో, బ్రసెల్స్: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ మరిన్ని దేశాలకు వ్యాపించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో సోమవారం ఈ కేసులు వెలుగుచూశాయి. పోర్చుగీస్కు చెందిన 13 మంది ఫుట్బాల్ క్రీడాకారులకు కొత్త వేరియంట్ సోకింది! దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తొలిసారి వెలుగుచూసిన ప్రాంతంలోనే వీరంతా ఇటీవల పర్యటించినట్టు పోర్చుగీస్ నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి గత శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్న వారిలో 61 మంది పాజిటివ్ వ్యక్తులు ఉండగా, వారిలో 13 మంది కొత్త వేరియంట్ బాధితులేనని నిర్ధారణ అయింది. ఫ్రాన్స్లో ఇలాంటి ఎనిమిది అనుమానిత కేసులు వెలుగు చూశాయి. స్కాట్లాండ్లో తాజాగా ఆరుగురు ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో బ్రిటన్లో ఈ కేసుల సంఖ్య 11కు చేరింది. ఆస్ట్రేలియాలో 5, జర్మనీలో 3, కెనడాలో రెండు కేసులు నమోదయ్యాయి. బెల్జియం, డెన్మార్క్ల్లోనూ కొత్త వేరియంట్ ఉ((నికి బయటపడింది. ఒమిక్రాన్ వ్యాప్తి వేగం అందుకున్నట్టు భావించిన పలు దేశాలు... కట్టడి చర్యలను మరింత ముమ్మరం చేశాయి. జపాన్లో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కానప్పటికీ... తమ సరిహద్దులను మూసివేస్తున్నామని, మంగళవారం నుంచి విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నామని ఆ దేశ ప్రధానమంత్రి ఫుమియో కిషిద ప్రకటించారు. భారత్లో ఇప్పటివరకూ కొత్త వేరియంట్ కారక కేసులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
అప్పటివరకూ తప్పదు
అనేక మార్పుల ఫలితంగా ఉద్భవించిన ‘ఒమిక్రాన్’ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని, బాధితుల్లో తీవ్రస్థాయి అనారోగ్యానికి దారితీయవచ్చని, టీకా తీసుకున్నవారికీ సోకవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో... అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డా.ఆంటోనీ ఫౌచీ సోమవారం స్పందించారు. కొత్త వేరియంట్ తీవ్రత, దాని తీరుతెన్నులపై మరో రెండు వారాల్లో నిర్దిష్ట సమాచారం లభించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా, మరికొన్ని ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయుల రాకను నిషేధిస్తున్నట్టు తెలిపారు. ‘‘దక్షిణాఫ్రికాలో తక్కువ సమయంలోనే కొత్త వేరియంట్ ఎక్కువమందికి వ్యాపించింది. అలాగని ఇది డెల్టాను మించిపోతుందని చెప్పలేం. కొవిడ్ జాగ్రత్తల గురించి విని జనం అలసిపోయారు. కానీ, వైరస్ అలసిపోదు’’ అని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డా.ఫ్రాన్సిస్ కొలిన్స్ పేర్కొన్నారు. హాంకాంగ్లో ఒమిక్రాన్ సోకిన ఇద్దరు వ్యక్తులు ఫైజర్ టీకా తీసుకున్నవారే. వారికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి.
ఆంక్షలను ఎత్తివేయాలి: రామఫోసా
కొత్త వేరియంట్ ఉందని పలు దేశాలు తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గతంలో ఉద్ధృతులు తలెత్తినప్పుడు వ్యాక్సిన్ల లభ్యత అంతగా లేదు. ఇప్పడు మా దగ్గర 12 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత టీకాలు లభిస్తున్నాయి. మహమ్మారి ఇప్పటికిప్పుడు మానవాళిని వీడిపోయేది కాదు. సుమారు 20 దేశాలు తొందరపడి మాపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆర్థికంగా, సామాజికంగా ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వెంటనే నిషేధం ఎత్తివేయాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్వో బాసటగా నిలిచింది. ‘‘ఆఫ్రికన్ దేశాలకు మేము తోడున్నాం. ప్రయాణ ఆంక్షలు విధించడం వల్ల ఒమిక్రాన్ వ్యాప్తి ఆలస్యం కావచ్చు. కానీ, చాలామంది జీవితాలపైనా, జీవనోపాధులపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఆంక్షలను శాస్త్రీయ ఆధారంగానే విధించాలి తప్ప... అమర్యాదగా, అనుచితంగా కాదు’’ అని ఆ సంస్థ పేర్కొంది. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్ తలెత్తిన విషయాన్ని దాచిపెట్టకుండా ప్రపంచానికి వెల్లడించారని, తద్వారా చాలామంది ప్రాణాలను కాపాడారని యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రశంసించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ