PRC: సమావేశాలతో కాలయాపన వద్దు.. సీఎం దగ్గరకు ఎప్పుడు?
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో బుధవారం జరిగిన చర్చల్లో ఫిట్మెంట్పై ఎలాంటి స్పష్టత రాలేదు. పదేపదే సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పితే.. ముఖ్యమంత్రి వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ఉద్యోగ సంఘ
సీఎస్తో భేటీలో ఉద్యోగ సంఘాల ప్రశ్నలు
వారంలో తీసుకెళ్తామన్న సీఎస్ సమీర్శర్మ
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో బుధవారం జరిగిన చర్చల్లో ఫిట్మెంట్పై ఎలాంటి స్పష్టత రాలేదు. పదేపదే సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పితే.. ముఖ్యమంత్రి వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వారంలో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్, కార్యదర్శి శశిభూషణ్ బుధవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఫిట్మెంట్ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి మరోసారి అభిప్రాయాలను తీసుకున్నారు. వాటిని ఈ వారంలో మరోసారి సీఎం జగన్కు వివరిస్తామని సీఎస్ చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన డిమాండ్లపైనా చర్చించారు. పీఎఫ్, జీఎల్ఎస్ఐ, వైద్య బిల్లులు, పదవీ విరమణ ప్రయోజనాలు, రుణాలకు సంబంధించిన చెల్లింపులను క్రిస్మస్ నుంచి ప్రాధాన్యత క్రమంలో మార్చిలోపు పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు మాత్రం జనవరిలోపే చెల్లింపులు పూర్తి చేయాలని కోరాయి. ఉద్యోగ సంఘాల సమావేశం కంటే ముందుకు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సీఎస్ సమావేశమయ్యారు. గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు వెల్లడించిన డిమాండ్లు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై చర్చించారు. మొత్తం 28 శాఖల్లో 816 సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో అత్యధికంగా ఆర్థిక శాఖలో 334, పాఠశాల విద్యలో 168, ఉన్నత విద్యలో 71, రెవెెన్యూలో 30, వైద్యారోగ్యశాఖలో 28 అంశాలున్నాయి.
వీలైన అన్నింటినీ పరిష్కరిస్తాం: సీఎస్
ఉద్యోగుల డిమాండ్లలో వీలైనన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ అన్నారు. ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పీఆర్సీ ఫిట్మెంట్ మినహా మిగతా 70 డిమాండ్ల పరిష్కారానికి పరిశీలిస్తున్నాం. కార్యదర్శుల సమావేశంలో చర్చించాం. పీఆర్సీ ఫిట్మెంట్, పెండింగ్ బిల్లుల చెల్లింపు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాల స్పందన తీసుకున్నాం. వీటిని మరోసారి పరిశీలించి ఉద్యోగ సంఘాలతో మాట్లాడతాం’ అని పేర్కొన్నారు.
ప్రథమ ప్రాధాన్యం జీపీఎఫ్.. తర్వాత ఏపీజీఎల్ఐ
బండి శ్రీనివాసరావు, ఏపీజేఏసీ
ప్రథమ ప్రాధాన్యంగా జీపీఎఫ్ బకాయిలు, తర్వాత ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్లులు, పదవీ విరమణ చేసిన వారి బిల్లుల చెల్లింపుల్ని పరిశీలిస్తామని ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చారు. మార్చిలోపు బిల్లులన్నీ క్లియర్ చేస్తామన్నారు. అశుతోష్ మిశ్రా సిఫార్సుల్ని యథాతథంగా అమలు చేయాలి.
సజ్జల వ్యాఖ్యలతో ఉద్యోగుల్లో ఆందోళన
బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఆందోళన ఎక్కువైంది. వచ్చే వారంలో సీఎం వద్దకు తీసుకెళ్లి.. పీఆర్సీ అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. 45% ఫిట్మెంట్ ప్రకటిస్తే రూ.8,200 కోట్లు మాత్రమే ఏడాదికి ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలియజేశాం. ప్రభుత్వ ఉద్యోగులతోపాటే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకూ పీఆర్సీ ప్రయోజనాలను వర్తింపజేసేలా ఒకేసారి ప్రకటన చేయాలని కోరుతున్నాం.
అధికారులే సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు
వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం
ఎంతసేపూ మా అభిప్రాయాలు అడుగుతున్నారు తప్ప.. సీఎంకు ఏం చెబుతున్నారు? ఆయన ఏం చెప్పారనే సంగతి అధికారులు మాకు చెప్పడం లేదు. ఖర్చు ఎక్కువ చేసి చూపిస్తున్నారు. సీఎం ఎక్కడ ఎక్కువ ఇస్తారో అని.. అన్నీ ఎక్కువ చేసి చూపిస్తూ ఉద్యోగులకు నష్టం కలిగేలా చేస్తున్నారు. 34% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని కోరాం.
కూరగాయల బేరంగా ఉంది
సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
ఉద్యోగులు, వారి కుటుంబ జీవన స్థితిగతులపై ప్రభావం చూపే పీఆర్సీ వ్యవహారం.. కూరగాయల బేరం, మార్కెట్ సంత తీరుగా ఉండటం దురదృష్టకరం. ఉన్నతస్థాయి సమావేశంలో అంశాల వారీగా పరిష్కారానికి కృషి చేయకుండా... ఊకదంపుడు ఉపన్యాసాలకే ఉద్యోగ సంఘాలు పరిమితమవుతున్నాయి. ఈ కథ ఎప్పటికి సుఖాంతమవుతుందో అర్థం కావట్లేదు. వారం రోజుల్లో సీఎంతో మాట్లాడి.. ఏ సంగతి చెబుతానని సీఎస్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
-
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
మూడు నెలల్లో రూ.300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల విలువైన నగదు, వస్తువులు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
రాష్ట్రంలో దయనీయ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు
రాష్ట్రంలో అయిదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ అన్నారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా
వివేకా హత్య అంశంపై కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది.