Sachivalayam:వెంటనే ప్రొబేషన్ ఇవ్వాలి
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమకు వెంటనే ప్రొబేషన్ ఖరారు చేసి, వేతన స్కేళ్లు వర్తింపజేయాలన్న డిమాండుతో పలుచోట్ల వివిధ రూపాల్లో ఆదివారం నిరసనలు తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగుల నిరసనలు
సీఎం తదితరులకు ట్వీట్లు
ఈనాడు - అమరావతి, యంత్రాంగం: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమకు వెంటనే ప్రొబేషన్ ఖరారు చేసి, వేతన స్కేళ్లు వర్తింపజేయాలన్న డిమాండుతో పలుచోట్ల వివిధ రూపాల్లో ఆదివారం నిరసనలు తెలియజేశారు. 2021 అక్టోబరు రెండో తేదీ నాటికే తాము ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయిందని, ఇచ్చిన మాట ప్రకారం అప్పుడే ప్రొబేషన్ ఖరారు చేయాల్సి ఉన్నా ఇప్పటివరకూ చేయకుండా జాప్యం
చేసింది చాలక... ఈ ఏడాది జూన్ 30లోగా చేస్తామంటూ ప్రకటించడమేంటి? అంటూ ఆందోళన బాట పట్టారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించారు. వేల మంది ట్వీట్ల రూపంలో తమ డిమాండును ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అధికారిక వాట్సప్ గ్రూపుల నుంచి శనివారం వైదొలిగిన ఉద్యోగుల్లో కొందరు తిరిగి చేరగా... చాలా మంది ఇంకా చేరలేదు. సోమవారం పెన్డౌన్ చేయాలని కొందరు సచివాలయ ఉద్యోగులు బృందాలుగా వారి వారి వాట్సప్ గ్రూపుల్లో పిలుపునిచ్చారు.
మానవహారం, ప్రదర్శనతో నిరసనలు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి నాలుగు రహదారుల కూడలి వరకూ భారీ ప్రదర్శన చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు.
* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం నిరసన తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. చాగల్లు మండలంలో మంత్రి తానేటి వనితకు, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వినతిపత్రాలు అందించారు.
* తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం సమావేశమయ్యారు. సోమవారం నుంచి కార్యాచరణ అమలుచేస్తామని వెల్లడించారు.
విధులకు గైర్హాజరైన వారి వివరాల సేకరణ
ఈ నెల 8, 9 తేదీల్లో విధులకు హాజరుకాని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వివరాలను కొన్నిచోట్ల జిల్లా అధికారులు మండల స్థాయి అధికారుల నుంచి తెప్పిస్తున్నారు. విధులకు హాజరు కాకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని మరికొన్ని జిల్లాల్లో మెసేజ్లు పంపిస్తున్నారు. ప్రకాశం డీఎంహెచ్వో వివరాలు తెప్పించగా, అనంతపురం జడ్పీ సీఈవో భాస్కర్రెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు విధుల బహిష్కరణ
‘ప్రొబేషన్ ఖరారును పొడిగిస్తూ సీఎం జగన్ చేసిన ప్రకటనకు నిరసనగా సచివాలయ ఉద్యోగులందరూ సోమవారం విధులను బహిష్కరించాలి’ అని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి సచివాలయాల ఎదుట నిరసన తెలియజేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేష్, షేక్ అబ్దుల్ రజాక్ పిలుపునిచ్చారు.
నేడు ఉద్యోగ సంఘాలతో సమావేశం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో ఆయా ఉద్యోగ సంఘాల నాయకులతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు. ఆరు సంఘాల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను పిలిచారు.
పే స్కేళ్లు ఇవ్వాలని ట్వీట్ల వెల్లువ
తమకు వెంటనే ప్రొబేషన్ ఖరారు చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. సీఎం జగన్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విటర్ ఖాతాలతో పాటు ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు. ‘గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల మంది నిరుద్యోగులకు శాశ్వత ప్రభుత్వోద్యోగాలు కల్పించినందుకు ధన్యవాదాలు. కరోనా సమయంలోనూ అంకితభావంతో సేవలు అందించాం. ప్రొబేషన్ పూర్తి చేసుకుని మూడు నెలలైంది. ఇప్పటికీ రెగ్యులరైజేషన్ పూర్తి కాకపోవటంపై మనోవేదనకు గురవుతున్నాం. వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి పే స్కేళ్లు కల్పించాలి’ అంటూ సీఎం జగన్కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాసిన లేఖను కొందరు తమ ట్వీట్లకు జతపరిచారు. కొందరు పోస్టుకార్డులపై డిమాండు రాసి వాటిని ట్విటర్లో పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్