Supreme Court: ప్రధాని భద్రతా వైఫల్యంపై స్వతంత్ర కమిటీ
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై దాఖలైన పిటిషన్పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తం అంశంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో....
విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ
కేంద్ర, పంజాబ్ ప్రభుత్వ దర్యాప్తులపై స్టే
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం ఆదేశాలు
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై దాఖలైన పిటిషన్పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తం అంశంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు.. తమ దర్యాప్తులను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ‘లాయర్స్ వాయిస్’ అనే సంస్థ వేసిన పిటిషన్పై సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము నియమించే కమిటీలో చండీగఢ్ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఐజీ, పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అదనపు డీజీపీ (భద్రత) కూడా సభ్యులుగా ఉంటారన్న సంకేతాలను ధర్మాసనమిచ్చింది. విచారణ సందర్భంగా తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఏడుగురు అధికారులకు కేంద్రం నోటీసులు ఇవ్వడాన్ని పంజాబ్ అడ్వకేట్ జనరల్ డి.ఎస్.పట్వాలియా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పరచిన కమిటీల దర్యాప్తును నిలిపివేయాలంటూ గత(జనవరి 7) విచారణలో న్యాయస్థానం మౌఖిక ఆదేశాలిచ్చినా.. నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎప్పుడు నోటీసులిచ్చారని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. భద్రతా వైఫల్యం జరిగిందా లేదా అన్న అంశంపై కమిటీ వేసి.. అది నివేదిక ఇవ్వకముందే ప్రధాన కార్యదర్శి, డీజీపీలను దోషులుగా నిర్ధారిస్తూ నోటీసులెలా ఇస్తారని నిలదీసింది. అయితే ధర్మాసనం ఆదేశాల్వికముందే తాము నోటీసులిచ్చామని మెహతా వివరణ ఇచ్చారు.
తర్వాత ఆయన తన వాదనలు వినిపిస్తూ.. ప్రధానమంత్రి భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించిందని పేర్కొన్నారు. మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో ఎలాంటి అంతరాయాలు లేవంటూ చెప్పారని, చివరకు రోడ్డు దిగ్బంధించిన ఆందోళనకారులకు 100 మీటర్ల సమీపంలో ప్రధాని వాహనశ్రేణి నిలిచిపోవాల్సి వచ్చిందని, ఇది ఆ రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కమిటీ దర్యాప్తును కొనసాగనివ్వాలని మెహతా అభ్యర్థించారు. దీనిపై పట్వాలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. పంజాబ్ ప్రభుత్వ అధికారులది తప్పు అయితే వారిని ఉరితీయండి గానీ.. నిష్పక్షపాత విచారణ మాత్రం జరిగేలా చూడాలని విన్నవించారు.
మోదీ భద్రతా కేసు వాదించొద్దంటూ ‘సుప్రీం’ న్యాయవాదులకు బెదిరింపు కాల్స్
ప్రధాని పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై జరుగుతున్న కేసు వాదనను నిలిపివేయాలంటూ సోమవారం తమకు ఖలిస్థాన్ అనుకూల సంస్థ... సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జీ) నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినట్లు పలువురు సుప్రీం కోర్టు న్యాయవాదులు తెలిపారు. ఇవన్నీ రికార్డెడ్ కాల్స్ అని, బ్రిటన్ నుంచి వచ్చాయని పేర్కొన్నారు.
ఇందులో ఫిరోజ్పుర్లో ప్రధాని పర్యటనను తామే అడ్డుకున్నామని ఎస్ఎఫ్జీ ప్రకటించుకుంది. పంజాబ్ రైతులు, సిక్కులకు వ్యతిరేకంగా నమోదయ్యే కేసులకు దూరంగా ఉండాలని న్యాయవాదులను హెచ్చరించింది. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఒక్కరికి కూడా ఇప్పటివరకు శిక్షపడలేదని గుర్తు చేసింది. ఈ ఫోన్కాల్స్పై సత్వరం చర్య తీసుకోవాలని న్యాయవాదులు.. సుప్రీంకోర్టుకు లేఖ రాశారు.
విఫలంపై సుప్రీంకోర్టులోమరో పిటిషన్ దాఖలు
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ సోమవారం దాఖలైంది. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అనిరుద్ధ్ తివారీ, డీజీపీ చటోపాధ్యాయ, ఫిరోజ్పుర్ ఎస్ఎస్పీ హర్మన్దీప్ సింగ్ హన్స్ పాత్రపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) లేదా ఇంకేదైనా ప్రముఖ సంస్థతో విచారణ చేయించాలని పిటిషన్లో న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.