TDP: వైకాపా జేబు సంస్థలా రాష్ట్ర మహిళా కమిషన్
రాష్ట్రంలో మహిళా కమిషన్ వైకాపా జేబు సంస్థలా వ్యవహరిస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచార ఘటనలో నిందితులపై ఏం చర్యలు
మూడేళ్లలో మహిళలపై 800పైగా అఘాయిత్యాలు జరిగితే ఎంతమందికి నోటీసులిచ్చారు?
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ధ్వజం
పెద్ద ఎత్తున కార్యకర్తలతో కమిషన్ కార్యాలయం ముట్టడి
ఈనాడు డిజిటల్- అమరావతి, విజయవాడ (అలంకార్కూడలి), న్యూస్టుడే: రాష్ట్రంలో మహిళా కమిషన్ వైకాపా జేబు సంస్థలా వ్యవహరిస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచార ఘటనలో నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో అతివలపై 800పైగా అత్యాచారాలు జరిగితే మహిళా కమిషన్ ఎంత మందికి నోటీసులిచ్చిందని ప్రశ్నించారు. మంగళగిరిలోని కమిషన్ కార్యాలయాన్ని బుధవారం తెలుగు మహిళలతో కలిసి ఆమె ముట్టడించారు. అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులతో కలిసి కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు వినతిపత్రం సమర్పించారు. ‘జగన్రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది’ పేరిట రాసిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. ఈ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేయడంతో అనిత, వాసిరెడ్డి పద్మ మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అనిత విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని మహిళా కమిషన్ రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇస్తోంది. వాసిరెడ్డి పద్మ అధికార పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు తప్ప మహిళల కోసం ఆలోచించడం లేదు. బాధితురాలికి ఇక్కడ న్యాయం జరిగేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఏ మూల ఆడబిడ్డకు అన్యాయం జరిగినా తెదేపా అండగా ఉంటుంది. తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు చెల్లవు. బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని కమిషన్ కార్యదర్శి చెబుతున్నారు. అదేదో ముందు వైకాపా మంత్రులకు ఇవ్వాలి’ అని అనిత పేర్కొన్నారు.
మహిళలతో పోలీసుల దురుసు ప్రవర్తన
అంతకముందు మహిళా కమిషన్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున తెలుగు మహిళలు ముట్టడించారు. పోలీసులు లోపలికి వెళ్లనివ్వకపోవడంతో సుమారు రెండు గంటలపైగా మండుటెండలోనే ఆందోళనకు దిగారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ కొందరు నేలపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎండలో ఎక్కువసేపు నిరసన తెలపడంతో బాధితురాలి తల్లి శరీరంలో చక్కర స్థాయిలు తగ్గి సొమ్మసిల్లిపోయారు. ఆమెకు తోటి మహిళలు సపర్యలు చేశారు. ప్రధాన గేటును నెట్టుకుని లోనికి వెళ్లేందుకు మహిళలు యత్నించడం, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మహిళలని కూడా చూడకుండా పురుష పోలీసులు తమతో దురుసుగా వ్యవహరించారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు లోనికి వెళ్లడానికి అనుమతి లేకపోతే కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మే కిందకు రావాలని డిమాండ్ చేశారు. కొంత వాగ్వాదం అనంతరం పరిమిత సంఖ్యలో మహిళలను పోలీసులు లోపలికి అనుమతిచ్చారు.
చంద్రబాబు పరామర్శిస్తే ఉలికిపాటా: బొండా ఉమా
విజయవాడలో అత్యాచార బాధితురాలిని మాజీ సీఎం చంద్రబాబు పరామర్శిస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడ ధర్నాచౌక్లో తెదేపా చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిని బంధించి 30 గంటల పాటు అత్యాచారం చేస్తే.. ఆసుపత్రి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఇంత ఘోరం జరిగితే.. ఆసుపత్రి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బాధితురాలు తన నియోజకవర్గానికి చెందిన యువతి కావడంతో, న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. కూతవేటు దూరంలోనే ఉన్నా బాధితురాలిని పరామర్శించడానికి మూడు రోజుల వరకు హోంమంత్రికి తీరిక లేదా? అన్నారు. పరామర్శకు తెదేపా అధినేత చంద్రబాబు వస్తున్నారని తెలియగానే మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారన్నారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే హోం మంత్రి మీడియా ముందుకొచ్చారని విమర్శించారు. తనను ప్రశ్నిస్తున్నారనే కోపంతో వాసిరెడ్డి పద్మ పలువురి మహిళలను చెయ్యెత్తి కొట్టబోయారన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా తెదేపా
చుట్టుగుంట, న్యూస్టుడే: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబానికి తెదేపా అండగా నిలిచింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పంపిన రూ.5 లక్షలను బుధవారం విజయవాడలో తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్ద తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేతుల మీదుగా అందజేశారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. బొండా ఉమా రాబట్టే తమకు మేలు జరిగిందన్నారు. చంద్రబాబు వచ్చి పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. ఉమా మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు తమను భయపెట్టాలని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చూస్తున్నారన్నారు. కమిషన్ సభ్యులంతా కలిసి చర్చించాకే నోటీసులు జారీ చేయాలని, అవేమీ లేకుండానే తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే తమకు నోటీసులిచ్చారని ఉమా ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు