UP Assembly Election Results 2022: డబుల్ ఇంజిన్.. డబుల్ సక్సెస్..
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాజపా మరోసారి తన సత్తా చాటింది. మోదీ-యోగి ద్వయం కరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ (డబుల్ ఇంజిన్) ప్రభుత్వం ఉండాలన్న ఆ
ఉత్తర్ప్రదేశ్లో కమలదళ అద్వితీయ విజయం
ఈనాడు, లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాజపా మరోసారి తన సత్తా చాటింది. మోదీ-యోగి ద్వయం కరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ (డబుల్ ఇంజిన్) ప్రభుత్వం ఉండాలన్న ఆ ఇద్దరు నేతల పిలుపు సత్ఫలితాలనిచ్చింది. ఎన్నికలకు ముందు ఓబీసీ నేతలు పార్టీకి దూరమైనా, రైతులు, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురైనా... అభివృద్ధి, సురక్ష నినాదాలతో ప్రతికూలతలన్నిటినీ అధిగమించింది. అధికారంలోకి వస్తామని ఆశించిన సమాజ్వాదీల అంచనాలను తలకిందులు చేసింది. గురువారం అర్థరాత్రి చివరి సమాచారం తెలిసే సమయానికి ...మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 251 స్థానాల్లో గెలుపొందగా మరో మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. దాని మిత్రపక్షాలు అప్నాదళ్(సోనెవాల్) 12 చోట్ల, నిషాద్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ, దాని మిత్ర పక్షాలు 120 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ పార్టీలైన బీఎస్పీ, కాంగ్రెస్ల ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలింది. ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ భారీగా నష్టపోయింది. కేవలం ఒకే ఒక స్థానంతో ఆ పార్టీ సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2017లో గెలుచుకున్న సీట్లలో 18ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకున్న ఏడు సీట్లలో అయిదింటిని కోల్పోయి రెండు స్థానాలకే పరిమితం కానుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 321 సీట్లను గెలుచుకున్న భాజపా కూటమి బలం ఈ దఫా కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో భాజపాకి 41.4 శాతానికి పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అప్నాదళ్(సోనెలాల్), నిషాద్పార్టీలతో కలిసి భాజపా ఉమ్మడిగా పోటీచేసింది. 370 స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా అనుప్రియ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్(సోనెలాల్) 17 స్థానాల్లో, నిషాద్ పార్టీ 16 స్థానాల్లో బరిలోకి దిగాయి. తమకు కేటాయించిన 16 సీట్లలో నిషాద్ పార్టీ గుర్తుపై 10 మంది, ఆరుగురు కమలం గుర్తుతో పోటీ చేశారు.
* సమాజ్వాదీ పార్టీకి పోలైన ఓట్లలో 32శాతం, ఆర్ఎల్డీకి 2.93శాతం, బీఎస్పీకి 12.9శాతం, కాంగ్రెస్కు 2.37 శాతం ఓట్లు వచ్చాయి. ఆప్, ఎంఐఎంలకు 0.5శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి.
* గోరఖ్పుర్ అర్బన్ స్థానంలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తన సమీప ప్రత్యర్థి, ఎస్పీ అభ్యర్థి సుభావతి శుక్లపై లక్ష ఓట్లకు పైగా తేడాతో గెలిచారు.
* ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య సిరాతు నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థిని పల్లవి పటేల్ చేతిలో 7,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
* ప్రముఖ ఓబీసీ నాయకుడు, ఎన్నికలకు ముందు ఆదిత్యనాథ్ కేబినెట్ నుంచి వైదొలగి ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కుషీనగర్ జిల్లా ఫాజిల్నగర్లో 45వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
* విపక్ష ఎస్పీ కూటమిలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) 8 స్థానాలను, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఆరు స్థానాలను గెలుచుకున్నాయి.
* నోయిడాలో భాజపా అభ్యర్థి పంకజ్సింగ్ చరిత్ర సృష్టించారు. ఆయన లక్షా 79వేల ఓట్లతో గెలుపొంది రికార్డు సృష్టించారు.
* కుషీనగర్ జిల్లాలోని తమ్కుహిరాజ్ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్కుమార్ లల్లూ ఓటమి పాలయ్యారు.
* యూపీలోని బుందేల్ఖండ్లో భాజపా మరోసారి అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్ఖండ్లోని మొత్తం 19 స్థానాల్లో భాజపా విజయం సాధించగా, ఓట్ల లెక్కింపుపై చివరి సమాచారం అందే సమయానికి ఈసారి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.