YS Jagan:ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలి
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా చూడాలని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కనీస మద్దతు ధర అందించాలన్నదే లక్ష్యం
పంటల కొనుగోళ్లపై సమీక్షలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా చూడాలని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అన్నదాతలకు కనీస మద్దతు ధర అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, వారికి సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం, సమాచార లోపం ఉండకూడదని సీఎం వివరించారు. ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై పౌరసరఫరాలు, వ్యవసాయశాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రైతులకు తోడుగా నిలిచేలా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ఇందులో మిల్లర్ల పాత్ర ఉండరాదు. కొనుగోళ్ల తరువాతే వారి భాగస్వామ్యం ఉండాలి. ధాన్యం నాణ్యత పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదు’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఆర్బీకేల్లో ఐదుగురు చొప్పున సిబ్బంది
‘ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)లో కనీసం ఐదుగురు సిబ్బంది ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు సేవలు అందించాలి. వీరే రైతుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడి పంటల కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీల కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు’ అని సీఎం వివరించారు. ‘అన్ని చోట్లా పంటల కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అనే దానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో అధికారులు దృష్టి పెట్టాలి. కొనుగోలు ప్రక్రియ తీరును పరిశీలించాలి. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి దృష్టికొచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించాలి’ అని ఆదేశించారు.
ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్: ‘పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేయాలి. వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి పరిష్కార చర్యలు తీసుకోవాలి. సాగుదారు హక్కు పత్రాల (క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు)పై రైతులకు మరింత అవగాహన కల్పించాలి’ అని సీఎం జగన్మోహన్రెడ్డి సూచించారు. రాష్ట్రంలో రోజుకు సగటున ధాన్యం కొనుగోళ్లు 42,237 మెట్రిక్ టన్నులకు చేరినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
సీఎం జగన్తో శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఎండీ హెచ్ఎం బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్
రాష్ట్రంలో శ్రీ సిమెంట్ కర్మాగారం
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ1,500 కోట్ల పెట్టుబడితో సిమెంట్ ప్లాంటును శ్రీ సిమెంట్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కంపెనీ ఎండీ హెచ్.ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ సోమవారం కలిశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది. 9 రాష్ట్రాల్లో సిమెంట్, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్లను శ్రీ సిమెంట్ సంస్థ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటి ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ప్లాంటు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని సీఎం కోరుకుంటున్నారని కంపెనీ ఎండీ హెచ్.ఎం.బంగూర్ పేర్కొన్నారు. ‘ఒక కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మాదిరే రాష్ట్ర బాగోగుల కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారు. దేశం కంటే రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉంది. అందుకే రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని ఆయన చెప్పారు. ప్లాంటు ఏర్పాటు వల్ల పారిశ్రామికాభివృద్ధితో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని జేఎండీ ప్రశాంత్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు. -
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. -
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు. -
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది. -
డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
సివిల్స్లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
వేకువనే పోలీసు పంజా
పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
జగన్ హయాంలో పెరిగిన శిరోముండనం ఘటనలు
జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. -
ఏపీఈఏపీ సెట్కు 3,54,235 దరఖాస్తులు
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
వెబ్సైట్లో పాలిసెట్ హాల్టికెట్లు
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు హాల్టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
కొయ్.. రాజా.. కొయ్!
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. -
క్షేత్రస్థాయికి ఎన్నికల నిఘా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
-
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
-
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
-
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
-
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు