YSRCP: వైకాపా హవా
రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, 4 పురపాలక సంఘాలు, 8 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా హవా కొనసాగింది. నెల్లూరుతో పాటు, 10 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైకాపా స్పష్టమైన ఆధిక్యత సాధించింది. నెల్లూరులో పోలింగ్కు ముందే 8 డివిజన్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న వైకాపా.. మొత్తం 54 డివిజన్లనూ తన ఖాతాలో వేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీనీ గెలుచుకుంది. ప్రకాశం జిల్లాలోని దర్శిలో 20 వార్డులకు తెదేపా 13, వైకాపా ఏడు చోట్ల గెలుపొందాయి. కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఫలితాలు చివరివరకు ఉత్కంఠ రేపాయి.
మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యం
నెల్లూరు కార్పొరేషన్ ఏకపక్షం
కుప్పంలోనూ గెలుపు
దర్శిలో తెదేపా విజయం
రెబల్ చేరికతో కొండపల్లిలో ఆధిక్యం
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, 4 పురపాలక సంఘాలు, 8 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా హవా కొనసాగింది. నెల్లూరుతో పాటు, 10 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైకాపా స్పష్టమైన ఆధిక్యత సాధించింది. నెల్లూరులో పోలింగ్కు ముందే 8 డివిజన్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న వైకాపా.. మొత్తం 54 డివిజన్లనూ తన ఖాతాలో వేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీనీ గెలుచుకుంది. ప్రకాశం జిల్లాలోని దర్శిలో 20 వార్డులకు తెదేపా 13, వైకాపా ఏడు చోట్ల గెలుపొందాయి. కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఫలితాలు చివరివరకు ఉత్కంఠ రేపాయి. 29 వార్డులకు వైకాపా, తెదేపా చెరో 14 గెలుచుకున్నాయి. తెదేపా టిక్కెట్ దక్కక, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి, గెలిచిన శ్రీలక్ష్మి.. ఫలితాలు వెలువడిన వెంటనే సొంత గూటికి చేరారు. చంద్రబాబును కలిసి తెదేపాకు మద్దతు ప్రకటించారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే కొండపల్లి పీఠాన్ని తెదేపా గెలుచుకునే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోనూ తెదేపా గట్టి పోటీనిచ్చింది. అక్కడ 31 వార్డులకు వైకాపా 17, తెదేపా 14 చోట్ల గెలుపొందాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సొంత నియోజకవర్గంలోని బేతంచర్లలో తెదేపా హోరాహోరీగా పోరాడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్లో నాలుగు డివిజన్లలోనూ వైకాపా విజయం సాధించింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 328 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రాగా, 28 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 320 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి వైకాపా 239 స్థానాల్ని, తెదేపా 80 స్థానాల్ని గెలుచుకున్నాయి. జనసేన ఐదు చోట్ల, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు చోట్ల విజయం సాధించారు.
ఉప ఎన్నికల్లోనూ ఫ్యాన్ జోరు
రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 12 పట్టణాల్లోని 25 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైకాపా ఆధిక్యత కొనసాగింది. ఆ పార్టీ 22 స్థానాల్ని గెలుచుకోగా, తెదేపా రెండు చోట్ల గెలిచింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ 23వ వార్డు తెదేపా వశమైంది.
* గుంటూరు, విశాఖ నగరాల్లో కార్పొరేటర్లు చనిపోవడం వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు గెలిచాయి. గుంటూరు ఆరో డివిజన్ నుంచి ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన వైకాపా కార్పొరేటర్ పాదర్తి రమేష్గాంధీ మరణించడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ వైకాపా అభ్యర్థి ఆత్మకూరి నాగేశ్వరరావుపై తెదేపా అభ్యర్థి పి.సమత 537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
* విశాఖలో 31వ డివిజన్లో వైకాపా అభ్యర్థి బిపిన్కుమార్ జైన్ గెలుపొందారు. అక్కడ తెదేపా కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మరణించడంతో, ఆయన భార్య గాయత్రీ ఫణికుమారి తెదేపా తరఫున పోటీచేశారు. జైన్ మొదట కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఆయనకు బి-ఫారం ఇచ్చింది. వైకాపా కూడా తమ అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టింది. ఆ తర్వాత మానవతా దృక్పథంతో పోటీ నుంచి వైదొలగుతున్నట్లు కాంగ్రెస్, వైకాపా ప్రకటించాయి. బిపిన్కుమార్కు కాంగ్రెస్ ఎ-ఫారం ఇవ్వలేదు. రిటర్నింగ్ అధికారి ఆయనను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించి, బీరువా గుర్తు కేటాయించారు. వైకాపా అప్పటికప్పుడు రంగంలోకి దిగి జైన్ని తమ అభ్యర్థిగా ప్రకటించి, బి-ఫారం ఇచ్చింది. జైన్ను వైకాపా అభ్యర్థిగా గుర్తిస్తూ ఆర్వో కొత్త జాబితా విడుదల చేయడంపై వివాదం నెలకొంది.
వైకాపా ఎమ్మెల్యే సొంత వార్డులో తెదేపా
* కడప జిల్లా కమలాపురంలో వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి సొంత వార్డైన.. ఆరో వార్డులో తెదేపా అభ్యర్థి షేక్ రెహానా గెలుపొందారు. ఇక్కడ 20 వార్డులకు వైకాపా 15, తెదేపా 5 గెలుచుకున్నాయి. తెదేపా అభ్యర్థులు ఒకటో వార్డులో 6, ఆరో వార్డులో 20, పన్నెండో వార్డులో 2, పదమూడో వార్డులో 7, 19వ వార్డులో 3 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వైకాపా విజ్ఞప్తి మేరకు 1, 12, 19 వార్డుల్లో మూడేసి సార్లు రీకౌంటింగ్ చేసినా అదే ఫలితం వచ్చింది. తెదేపా తరపున గెలిచిన ఐదుగురిలో నలుగురూ ముస్లింలే.
* కుప్పం ఎన్నికల్లో ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా రాలేదు. రెస్కో ఛైర్మన్ సెంథిల్కుమార్ తమ్ముడు, 22వ వార్డు అభ్యర్థి అరుళ్పై తెదేపా అభ్యర్థి సురేష్ 233 ఓట్ల తేడాతో గెలుపొందారు. 11 వార్డులో తెదేపా అభ్యర్థి కస్తూరికి ఆరు ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. 21వ వార్డులో వైకాపా అభ్యర్థి లావణ్య ఏడు ఓట్ల తేడాతో గెలిచారు.
* ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సొంత నియోజకవర్గంలోని బేతంచర్ల నగర పంచాయతీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెదేపా గట్టి పోటీనిచ్చింది. వైకాపా 14 స్థానాలు గెలవగా, తెదేపా ఆరు చోట్ల గెలుపొందింది. 5, 7, 8, 19 వార్డుల్ని 100లోపు ఓట్ల తేడాతో తెదేపా కోల్పోయింది.
* గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో తెదేపా గట్టి పోటీనిచ్చింది. 20 వార్డులకు తెదేపా 7, జనసేన ఒకచోట గెలిచాయి. 11 వార్డుల్లో వైకాపా, ఒకచోట ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి గెలిచారు.
రీకౌంటింగ్లో కొన్ని ఫలితాలు తారుమారు
* కొండపల్లిలో ఒకటో వార్డులో వైకాపా గెలవగా.. ఫలితాన్ని మార్చారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి. రీకౌంటింగ్కు పట్టుబట్టినా అధికారులు తిరస్కరించారు.
* జగ్గయ్యపేటలో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఎమ్మెల్యే ఉదయభాను ప్రవేశించడంపై తెదేపా అభ్యంతరం తెలిపింది.
* జగ్గయ్యపేటలో 3 వార్డుల్లో పదిలోపు ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. 13వ వార్డులో 6 ఓట్లతో తెదేపా గెలవగా, వైకాపా రీకౌంటింగ్ కోరింది. రెండు దఫాల లెక్కింపు తర్వాత.. వైకాపా 5 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు.
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం 8వ వార్డులో తెదేపా ఒక్క ఓటుతో గెలిచిందనిచెప్పి తర్వాత వైకాపా విజయాన్ని ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాతా ఆ ఫలితాన్నే ఖరారు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!