మౌలిక ప్రాజెక్టులపై రూ.4.34 లక్షల కోట్ల భారం
రూ.150 కోట్లు, అంత కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టిన 442 మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం కావడంతో, అదనంగా రూ.4.34 లక్షల కోట్ల భారం.....
దిల్లీ: రూ.150 కోట్లు, అంత కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టిన 442 మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం కావడంతో, అదనంగా రూ.4.34 లక్షల కోట్ల భారం పడుతోందని గణాంక, పథకాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. మొత్తం 1,671 మౌలిక ప్రాజెక్టుల్లో 536 ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. 1,671 ప్రాజెక్టులకు తొలుత అంచనా వేసిన వ్యయం రూ.21,21,383.82 కోట్లు కాగా, ఇప్పుడు అది రూ.25,55,957.52 కోట్లకు పెరిగిందని (20.49 శాతం మేర) మంత్రిత్వ శాఖ 2020 నవంబరు నివేదికలో వెల్లడించింది. గత నెలాఖరుకు ఈ ప్రాజెక్టులపై రూ.11,93,997.81 కోట్ల మేర (46.71 శాతం) ప్రభుత్వం వ్యయం చేసిందని పేర్కొంది. 536 ప్రాజెక్టుల్లో 120 ప్రాజెక్టులు 1-12 నెలలు, 134 ప్రాజెక్టులు 13-24 నెలలు, 162 ప్రాజెక్టులు 25-60 నెలలు, 120 ప్రాజెక్టులు 61 నెలలకు పైగా ఆలస్యమవుతాయని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా