40% తగ్గిన విమాన ప్రయాణికులు
కరోనా మహమ్మారి ప్రభావం విమాన ప్రయాణాలపై ఇంకా కొనసాగుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు గత జనవరిలో 40 శాతం మేర తగ్గి 77.34 లక్షలకు పరిమితమయ్యాయని పౌర
జనవరిలో 77.34 లక్షలే: డీజీసీఏ
ముంబయి: కరోనా మహమ్మారి ప్రభావం విమాన ప్రయాణాలపై ఇంకా కొనసాగుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు గత జనవరిలో 40 శాతం మేర తగ్గి 77.34 లక్షలకు పరిమితమయ్యాయని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) వెల్లడించింది. కాగా 2020 జనవరిలో 1.27 కోట్ల ప్రయాణికులు దేశీయ మార్గాల్లో ప్రయాణించినట్లు పేర్కొంది. ఇండిగో, స్పైస్జెట్, ఎయిరిండియా, గోఎయిర్, విస్తారా, ఎయిరేషియా ఇండియాల్లో ప్రయాణికుల భర్తీ సామర్థ్యం (లోడ్ ఫ్యాక్టర్) 70-64.9 శాతం మధ్య నమోదైంది. ఇండిగో 54.30 శాతం మార్కెట్ వాటాతో 42.03 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేసింది. దీని తరవాత విస్తారా 12.8 శాతం వాటాతో 9.92 లక్షల మందిని చేరవేసింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి బయలుదేరే లేదా చేరుకునే ఇండిగో విమానాలు 93.7 శాతం కచ్చిత సమయానికి నడిచాయని డీజీసీఏ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?