Metaverse: మెటావర్స్లో అత్యధిక భాగం భారత్లోనే అభివృద్ధి
మెటావర్స్లో అత్యధిక భాగం భారత్లోనే అభివృద్ధి చేస్తారని మెటా (ఫేస్బుక్ కొత్తపేరు) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ బుధవారం వెల్లడించారు.
ఇంటర్నెట్డెస్క్: మెటావర్స్లో అత్యధిక భాగం భారత్లోనే అభివృద్ధి చేస్తారని మెటా (ఫేస్బుక్ కొత్తపేరు) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ బుధవారం వెల్లడించారు. భారత్లోనే అత్యధిక మంది డెవలపర్లు, తయారీదారులు, క్రియేటర్ కమ్యూనిటీలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘భారత్లో డెవలప్మెంట్ వ్యవస్థను పరిశీలించండి. అక్కడ వ్యక్తిగత స్థాయిలో తయారీదారులు ఉన్నారు. అదే భారత్ను ప్రత్యేకంగా నిలుపుతుంది. చాలా వరకూ మెటావర్స్ ఇక్కడే అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం’’ అని ఫ్యూయల్ ఫర్ ఇండియా వర్చువల్ సదస్సులో ఆయన పేర్కొన్నారు.
‘‘భారత్లోని డెవలపర్స్ మెటావర్స్ నిర్మాణంలో పాలుపంచుకొంటారా అంటే.. కచ్చితంగా భాగస్వాములవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ దానిలో అతిపెద్ద భాగం కానుంది’’ అని మార్క్ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫేస్బుక్, వాట్సాప్లను భారత్లోనే వాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. భారత్లో వాట్సాప్ను 530 మిలియన్ల మంది, 410 మిలియన్ల మంది ఫేస్బుక్, 210 మిలియన్ల మంది ఇన్స్టాగ్రామ్ను వినియోగిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు