ఎంఎస్ఎంఈ సంస్థల వృద్ధి లక్ష్యంగా ‘ఫిక్కీ’ విధాన పత్రం
దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సులువుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి కల్పించటానికి అనువైన విధాన పత్రాన్ని ఫిక్కీ (భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య), అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్)...
ఈనాడు, హైదరాబాద్: దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సులువుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి కల్పించటానికి అనువైన విధాన పత్రాన్ని ఫిక్కీ (భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య), అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) సంయుక్తంగా రూపొందించాయి. ‘ఉద్యోగ్ సహాయక్ ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్’ అనే పేరుతో తీర్చిదిద్దిన ఈ విధాన పత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటే వచ్చే అయిదేళ్ల కాలంలో దేశంలో కొత్తగా ఒక కోటి ఉద్యోగాలు సృష్టించవచ్చని ఈ సందర్భంగా ఫిక్కీ పేర్కొంది. పదేళ్ల కాలంలో 6 కోట్ల ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. అంతేగాక వచ్చే పదేళ్ల కాలంలో రూ.2.16 లక్షల కోట్ల సంపద (ఎకనామిక్ వాల్యూ యాడెడ్- ఈవీఏ) లభిస్తుందని వివరించింది. ‘ఉద్యోగాల్లేని వృద్ధి’ తో ఎదురయ్యే సమస్యలను ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఛైర్మన్ టి.మురళీధరన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించని పక్షంలో ‘డొమోగ్రాఫిక్ డివిడెండ్’ ప్రయోజనాలను మనం కోల్పోయే ప్రమాదం ఎదురవుతుందని అన్నారు. కొత్తగా సూక్ష్మ సంస్థలను తయారు చేయటం కంటే ప్రస్తుతం ఎంఎస్ఎంఈ సంస్థలు అభివృద్ధి చెందే వీలుకల్పిస్తే మంచి ఫలితాలను వస్తాయని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన అమిత్ బసోల్ అభిప్రాయపడ్డారు. ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిలీప్ ఛినాయ్ స్పందిస్తూ నైపుణ్యాలు పెంపొందించటానికి ఒక వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చు కంటే తక్కువ ఖర్చులో సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు అండగా నిలిచే అవకాశం ఉందని వివరించారు.
ఫలితాల పట్టిక
కంపెనీ నికర లాభం/(నష్టం) మొ¯యం
2020-21 2019-20 2020-21 2019-20
డీసీబీ బ్యాంకు 96.21 96.70 1,023.86 990.89
జేఎమ్ ఫైనాన్షియల్స్ 181.00 158.00 891.00 905.00
మహీంద్రా లైఫ్సైన్సెస్ (11.19) 1.81 70.19 85.00
బిర్లా కార్ప్ 148.42 81.49 1822.82 1735.39
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత