చైనాలో పేదరిక నిర్మూలనకు అలీబాబా గ్రూప్ చేయూత
ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చైనాలో పేదరిక నిర్మూలనకు 1,550 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.13 లక్షల కోట్లు)వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శుక్రవారం ప్రకటించింది. చైనా అధ్యక్షుడు షి
1,550 కోట్ల డాలర్ల సాయం
బీజింగ్: ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చైనాలో పేదరిక నిర్మూలనకు 1,550 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.13 లక్షల కోట్లు)వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శుక్రవారం ప్రకటించింది. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ చేపట్టిన ప్రచారానికి మద్దతు ప్రకటించింది. ఉద్యోగాల సృష్టి కోసం 10 ప్రాజెక్టుల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నట్లు తెలిపింది. కంపెనీ నడుస్తున్న షాంఘై దక్షిణ భాగంలోని ఝెజియాంగ్ ప్రావిన్స్లో ఆదాయ అసమానతలను తగ్గించడానికి 1,250 కోట్ల డాలర్లు వ్యయం చేస్తామని అలీబాబా గ్రూప్ తెలిపింది. ‘సమాజం బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ సరిగా ఉంటుంది. అప్పుడే అలీబాబా గ్రూప్ కూడా బాగుంటుందని నమ్ముతున్నామ’ని సీఈఓ డేనియల్ ఝాంగ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే, గత నెలలో మరో టెక్ దిగ్గజం టెన్సెంట్ కూడా 770 కోట్ల డాలర్లను ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నామని ప్రకటించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కంపెనీ చేస్తున్న వ్యయాలను ఇది రెట్టింపు చేసింది. మరో ఇ-కామర్స్ కంపెనీ పిన్డ్యుయోడ్యుయో కూడా 150 కోట్ల డాలర్లను వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులపై ఖర్చు చేస్తామని గత నెలలో ప్రకటించింది.
ఫెడరల్ బ్యాంక్ నుంచి కొత్త క్రెడిట్ కార్డు
ఈనాడు, హైదరాబాద్: ఫెడరల్ బ్యాంక్ కొత్తగా మూడు రకాల క్రెడిట్ కార్డులను ఆవిష్కరించింది. అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ వీసాతో కలిసి వీటిని తీసుకొచ్చినట్లు శుక్రవారం వెల్లడించింది. వీటిలో అధికాదాయం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా సెలెస్టా కార్డు, కుటుంబ అవసరాలకు ఎక్కువగా వాడే వారి కోసం ఇంపీరియో, యువతను లక్ష్యంగా చేసుకుని సిగ్నెట్ కార్డులను తీసుకొచ్చింది. త్వరలోనే రూపే క్రెడిట్ కార్డులను కూడా విడుదల చేయబోతున్నట్లు బ్యాంకు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ