డిజిటల్ గోల్డ్ సదుపాయాన్ని ప్రారంభించిన 'అమెజాన్ పే'
అమెజాన్ వినియోగదారులకు ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేసి విక్రయించే అవకాశం ఉంటుందని పేర్కొంది.....
అమెజాన్ వినియోగదారులకు ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేసి విక్రయించే అవకాశం ఉంటుందని పేర్కొంది
అమెజాన్ ఇండియా ఆర్థిక సేవల విభాగం ‘అమెజాన్-పే’ ఆన్లైన్లో బంగారాన్ని కొనుగోలు చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. అది కూడా కేవలం రూ.5 తో కూడా బంగారం కొనుగోలు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ‘గోల్డ్ వాల్ట్’ పేరుతో, ‘సేఫ్గోల్డ్’ భాగస్వామ్యంతో అమెజాన్పే దీనిని ప్రారంభించింది. సేఫ్గోల్డ్ 995స్వచ్చత గల 24 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తుంది. అమెజాన్ వినియోగదారులు తమ ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారాన్ని ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, తిరిగి అమ్మవచ్చు. బంగారం భద్రత కోసం లాకర్ తీసుకోవడం వంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది.
- Paytm, PhonePe, Google Pay, MobiKwik, Freecharge సహా ఇతర డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్లు కూడా డిజిటల్ బంగారం ఆఫర్లను పెంచుతున్నాయి.
- ఇందులో Paytm, Google Pay , Phonepe వంటివి వినియోగదారులు రూ.1 తో కూడాబంగారాన్ని కొనుగోలు చేసే అవకశాన్ని కల్పిస్తున్నాయి.
- గూగుల్ పే గత ఏడాది ఏప్రిల్లో డిజిటల్ బంగారం సదుపాయాన్ని ప్రారంభించగా, పేటీఎం, ఫోన్పే రెండూ తమ ప్లాట్ఫామ్లపై 2017 లోనే అందుబాటులోకి తెచ్చాయి. ఇక మొబిక్విక్ 2018 లో దీనిని ఆవిష్కరించింది.
- చైనా ఎలక్ట్రానిక్స్ ప్లేయర్ షియోమి, ఏప్రిల్లో తన చెల్లింపుల ప్లాట్ఫాం అయిన ఎంఐపేలో డిజిటల్ బంగారాన్ని ప్రవేశపెట్టింది.
- లాక్డౌన్ సమయంలో దుకాణానికి వచ్చి బంగారాన్ని కొనుగోలు చేయడానికి వినియోగదారులకు వీలులేకపోవడంతో, డిజిటల్ చెల్లింపుల సంస్థలు తమ ప్లాట్ఫామ్లో లావాదేవీలను పెంచడానికి, వారి డిజిటల్ బంగారం ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి.
- అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్లో, నోయిడాకు చెందిన ‘పేటీఎం’ తన ప్లాట్ఫామ్లో 37 కిలోల డిజిటల్ బంగారాన్ని విక్రయించినట్లు తెలిపింది. బెంగళూరుకు చెందిన 'ఫోన్’పే ఈ సంవత్సరంలో 100 కిలోల బంగారాన్ని డిజిటల్గా విక్రయించినట్లు పేర్కొంది.
- గత సంవత్సరంతో పోల్చితే ప్లాట్ఫామ్లో మొత్తం డిజిటల్ బంగారు లావాదేవీలు 125 శాతం పెరిగాయని, సగటు కొనుగోళ్ల శాతం కూడా 165 శాతానికి పెరిగిందని ఫ్లిప్కార్ట్ యాజమాన్యంలోని 'ఫోన్’పే తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ