కోల్‌ ఇండియా వాటాదార్లకు అదనంగా 20-25% డివిడెండు

వాటాదార్లకు కోల్‌ ఇండియా అదనంగా 20-25% డివిడెండును చెల్లించే అవకాశం ఉంది. దీనిపై సోమవారం (ఈనెల 14న)

Published : 14 Jun 2021 01:34 IST

నేడు ప్రకటించే అవకాశం!

దిల్లీ: వాటాదార్లకు కోల్‌ ఇండియా అదనంగా 20-25% డివిడెండును చెల్లించే అవకాశం ఉంది. దీనిపై సోమవారం (ఈనెల 14న) సంస్థ ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. ఆ రోజే నాలుగో త్రైమాసిక ఫలితాలను కూడా సంస్థ వెల్లడిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2020-21 సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనప్పటికీ.. సవరించిన మూలధన వ్యయాల లక్ష్యాన్ని మాత్రం కోల్‌ ఇండియా అధిగమించింది. ‘మరోమారు డివిడెండును ప్రకటించేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. అయితే రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఇచ్చిన రెండు మధ్యంతర డివిడెండులు రూ.7.5, రూ.5 కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంద’ని ఆ వర్గాలు తెలియజేశాయి. ‘రెండు మధ్యంతర డివిడెండుల మొత్తం రూ.12.50. మొత్తం తుది డివిడెండు ఒక్కో షేరుకు రూ.15 కంటే తక్కువగా ఉండాలంటే తుది డివిడెండు రూ.2- 2.50గా ప్రకటించాల్సి ఉంటుంద’ని పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని