IPO: డిసెంబరు 2న ఆనంద్ రాఠీ వెల్త్ ఐపీఓ
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఆనంద్ రాఠీ ఆధ్వర్యంలోని ఆనంద్ రాఠీ వెల్త్ డిసెంబరు 2న ఐపీఓకి రాబోతోంది....
దిల్లీ: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఆనంద్ రాఠీ ఆధ్వర్యంలోని ఆనంద్ రాఠీ వెల్త్ డిసెంబరు 2న ఐపీఓకి రాబోతోంది. మూడు రోజులు కొనసాగే ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబరు 6న ముగిసింది. ధరల శ్రేణిని రూ.530-550గా నిర్ణయించారు. మొత్తం రూ.660 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పబ్లిక్ ఇష్యూలో ఉన్న మొత్తం 1.2 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) కింద విక్రయిస్తున్నవే. వీటిలో 2.5 లక్షల షేర్లు ఉద్యోగులకు రిజర్వు చేశారు. 15శాతం షేర్లను సంస్థాగతేతర మదుపర్లు, 35 శాతం రిటైల్ మదుపర్లకు, మిగిలిన షేర్లను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. కనీసం 27 షేర్లను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
ఆనంద్ రాఠీ వెల్త్ను 2002లో స్థాపించారు. ఆంఫీ వద్ద నమోదైన ఈ సంస్థ ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ పథకాలను పంపిణీ చేస్తోంది. మార్చి 31, 2019 - ఆగస్టు 31, 2021 మధ్య కంపెనీ నిర్వహణలోని ఆస్తుల మొత్తం (ఏయూఎం) 22.74 శాతం పెరిగింది. సెప్టెంబరు 2018లోనూ సంస్థ రూ.425 కోట్ల సమీకరణ లక్ష్యంతో సెబీ వద్ద ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’