బ్యాంకులకు 4 రోజుల వరుస సెలవులు!
దేశవ్యాప్తంగా శనివారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయనున్నాయి. రెండు రోజులు సెలవు దినాలు కాగా.. మిగిలిన......
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా శనివారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. రెండు రోజులు సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా ఖాతాదారులకు సేవలు దూరం కానున్నాయి. మార్చి 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు. 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.
రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఒక ప్రభుత్వరంగ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిది యూనియన్లతో కూడిన ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) సమ్మె తలపెట్టింది. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మె కారణంగా ఎస్బీఐ, కెనరా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్