హోమ్ లోన్ @ 6.40%.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 6.40 శాతానికే హోమ్ లోన్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 6.40 శాతానికే హోమ్ లోన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. గతంలో 6.80 శాతంగా ఉన్న వడ్డీ రేటును సవరిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. రిటైల్ బొనాంజా ఫెస్టివ్ ధమాకా పేరిట ఈ ఆఫర్ను ప్రకటించింది. డిసెంబర్ 13 నుంచి తగ్గించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది.
కారు లోన్పై సైతం వడ్డీరేట్లను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తగ్గించింది. గతంలో 7.05 శాతం ఉండగా మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకుని 6.80 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. క్రెడిట్ స్కోరు ఆధారంగా వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. బంగారు, గృహ, కారు లోన్పై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు పేర్కొంది. ఫెస్టివ్ బొనాంజాను వినియోగించుకోవడం ద్వారా వినియోగదారులు రుణాలపై పెద్ద మొత్తంలో ఆదా చేసుకోగలుగుతారని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ తామ్టా అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు