దివాలా విజ్ఞప్తికి బ్యాంకులకు గడువు లేదు
ఏదైనా కార్పొరేట్ రుణస్వీకర్తపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించడానికి బ్యాంకు/ఆర్థిక సంస్థకు గడువు అంటూ ఉండదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సదరు రుణ ఖాతాను ఎన్పీఏ (మొండి
మూడేళ్ల తర్వాతా దాఖలు చేయొచ్చు
సుప్రీం కోర్టు స్పష్టీకరణ
దిల్లీ: ఏదైనా కార్పొరేట్ రుణస్వీకర్తపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించడానికి బ్యాంకు/ఆర్థిక సంస్థకు గడువు అంటూ ఉండదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సదరు రుణ ఖాతాను ఎన్పీఏ (మొండి బకాయి)గా ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల తర్వాత కూడా దివాలా పిటిషన్ దాఖలు చేయవచ్చని..ఎటువంటి గడువు ముగిసినట్లు భావించరాదని తెలిపింది. దేనా బ్యాంకు(ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా) దాఖలు చేసిన పిటిషన్కు దివాలా చట్టం(ఐబీసీ) సెక్షన్ 7 కింద గడువు ముగిసిపోయిందంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) జారీ చేసిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరా బెనర్జీ వి. రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఒక వేళ అటువంటి మూడేళ్ల గడువు పూర్తయితే.. మరో మూడేళ్ల పాటు గడువు పొడిగింపు జరుగుతుందని తమ తీర్పులో వెల్లడించింది.
గంటల్లోనే పూర్తి స్పందన
విండ్లాస్, ఎక్సారో టైల్స్ ఐపీఓ ధమాకా
కృష్ణ డయాగ్నోస్టిక్స్, దేవయానీ సైతం
దిల్లీ: ఈ మధ్య పబ్లిక్ ఇష్యూల టైం మామూలుగా లేదు. మార్కెట్లోకి వచ్చిన వెంటనే 100 శాతం స్పందన వచ్చేస్తోంది. తాజాగా బుధవారం విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణ డయాగ్నోస్టిక్స్, దేవయానీ ఐపీఓలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తి స్పందనను దక్కించుకున్నాయి. రిటైల్ మదుపర్ల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. మూడు రోజుల గడువు పూర్తయ్యే సరికి ఈ స్పందన ఎంత వరకు వెళుతుందో చూడాలి.
* విండ్లాస్ బయోటెక్ ఐపీఓకు 61,36,252 షేర్లు ఆఫర్కు పెట్టగా తొలి రోజునే 3.15 రెట్ల మేర(1,93,37,310) బిడ్లు వచ్చాయి. రిటైల్ మదుపర్ల నుంచి 6.12 రెట్లు ఎక్కువ స్పందన రావడం విశేషం. యాంకర్ మదుపర్ల నుంచి ఈ కంపెనీ మంగళవారం రూ.120 కోట్లు సమీకరించింది. ధరల శ్రేణి(రూ.448-460) గరిష్ఠ స్థాయి వద్ద ఈ కంపెనీ రూ.401.53 కోట్లను సమీకరించవచ్చు.
* ఎక్సారో టైల్స్ కూడా మంగళవారం యాంకర్ఇన్వెస్టర్ల నుంచి రూ.23.68 కోట్లను సమీకరించింది. రూ.161.08 కోట్ల ఐపీఓకు ఆఫర్కు పెట్టిన 1,14,50,675 షేర్లతో పోలిస్తే 4.63 రెట్లు ఎక్కువ బిడ్లు వచ్చాయి. రిటైల్ మదుపర్ల నుంచి 9.24 రెట్ల స్పందన వచ్చింది. శుక్రవారం పూర్తయ్యే ఈ ఐపీఓకు ధరల శ్రేణి రూ.118-120.
* కృష్ణా డయాగ్నోస్టిక్స్ సైతం యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా బుధవారం రూ.537 కోట్లు సమీకరించింది. బుధవారం ప్రారంభమైన ఐపీఓకు 1.98 రెట్ల స్పందన లభించింది. 71,12,099 షేర్లకు గాను 1,40,63,685 బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ మదుపర్ల నుంచి ఏకంగా 9.55 రెట్ల స్పందన వచ్చింది. రూ.933-954 ధరల శ్రేణిలో గరిష్ఠ స్థాయి వద్ద రూ.1213.3 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
* పిజ్జా హట్, కేఎఫ్సీ, కోస్టా కాఫీలకు అతిపెద్ద ఫ్రాంచైజీ అయిన దేవయానీ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకు 2.69 రెట్ల స్పందన లభించడం విశేషం. రిటైలర్లు 11.35 రెట్లు అధికంగా స్పందించారు. రూ.86-90 ధరల శ్రేణిలో వచ్చిన ఈ ఇష్యూ ద్వారా రూ.1,838 కోట్లు సమీకరించాలని సంస్థ భావిస్తోంది. ఈ కంపెనీ బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.825 కోట్ల నిధులను సమీకరించింది.
* నిర్మా గ్రూప్నకు చెందిన నువాకో విస్తాస్ కార్పొరేషన్ రూ.5,000 కోట్ల సమీకరణ కోసం తెచ్చిన ఐపీఓకు రూ.560-570ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఆగస్టు 9న ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 11న ముగుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత