బడ్జెట్ వేళ.. పసిడి, వెండి ధరలు ఇలా...
బడ్జెట్ సమర్పించనున్నఈ కీలకమైన రోజు దేశంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
ముంబయి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 11 గంటలకు 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ కీలకమైన రోజు దేశంలో బంగారం, వెండి ధరలు గోల్డ్ రిటర్న్స్ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. భారత్లో 22 కేరట్ల పసిడి ధర పది గ్రాములకు రూ.47,970 కాగా.. 24 కేరట్లు రూ.48,970 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుత ధర కిలోకు రూ.69,800 ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఆదివారం 22, 24 కేరట్ల బంగారం ధరలు వరుసగా రూ.47,960, రూ.48,960 ఉండటం గమనార్హం.
ఐతే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఎక్సైజు డ్యూటీ, రాష్ట్ర పన్నులు, మజూరీ తదితర అంశాలను అనుసరించి బంగారు ఆభరణాల ధరలో స్వల్ప భేదాలు ఉండవచ్చు. ఈ మేరకు దేశంలోని నాలుగు ముఖ్య నగరాల్లో 22 కేరట్లు, 24 కేరట్ల బంగారం ధరలు పది గ్రాములకు గాను ఇలా ఉన్నాయి:
- దిల్లీ: రూ. 47,970- రూ. 52,320
- ముంబయి: రూ. 47,970- రూ. 48,970
- చెన్నై: రూ. 46,570- రూ. 50,790
- కోల్కతా: రూ. 48,340- రూ. 51,040
అదేవిధంగా వెండి కిలో ధర దిల్లీ, ముంబయి, కోల్కతా నగరాల్లో రూ. 69,800 ఉండగా.. చెన్నైలో మాత్రం రూ. 74, 600గా ఉంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె