RBI: ఆర్బీఐకు సీఐఐ వినతి
బ్యాంకులకు, నాన్బ్యాంకిగ్ ఫైనాన్షియల్ సంస్థలకు ఆడిటర్ల నియామకంపై ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని
ఇంటర్నెట్డెస్క్: బ్యాంకులకు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు ఆడిటర్ల నియామకంపై ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కోరింది. ఆ సర్క్యులర్ కారణంగా కొవిడ్ సమయంలో ఎన్బీఎఫ్సీలకు ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంది. ఆర్బీఐ గతనెల 27వ తేదీన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆడిటర్ల నియామకంపై కొన్ని నిబంధనలు విధించింది. దీంతోపాటు ఆడిటర్ల రీ అపాయింట్మెంట్కు కొంతకాల వ్యవధిని ఏర్పాటు చేసింది. దీనిపై సీఐఐ స్పందించింది.
‘‘ఈ నిబంధనల కారణంగా కంపెనీలకు ఇబ్బందులు పెరుగుతాయి. ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుంది. ఆడిట్స్ సంఖ్యపై నిబంధనలు, జాయింట్ ఆడిట్లు, రొటేషన్ నిబంధనలు వంటివి వాణిజ్య బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు వర్తింపచేసి ఉండకూడదు. ఎటువంటి నిబంధనలు మార్చకుండా కూడా ఆర్బీఐ తన లక్ష్యాలను చేరుకోవచ్చు’’ అని సీఐఐ పేర్కొంది. అంతేకాదు ఈ మార్పులు అస్థిరమైన పాలసీలకు పునాదులు వేస్తాయని విమర్శించింది.
ఆర్బీఐ ఏప్రిల్ 27వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేసింది. డిపాజిట్లు స్వీకరించని, రూ.1000 కోట్లలోపు ఆస్తులు ఉన్న ఎన్బీఎఫ్సీలను దీని నుంచి మినహాయించింది. మిగిలిన ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు మూడేళ్ల ఆడిట్ను పూర్తి చేస్తే కనుక వెంటనే ఆడిటర్లను మార్చేయాలని పేర్కొంది. ఇక రూ.15వేల కోట్లు పైబడిన ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు జాయింట్ ఆడిటర్లను నియమించాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం