నిర్మలా సీతారామన్ చేతిలో బడ్జెట్ వ్యాక్సిన్
ఈసారి బడ్జెట్ చాలా కీలకమైనదిగా ఆర్థికనిపుణులు భావిస్తున్నారు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఒక మహమ్మారి, స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో తీవ్ర నష్టం, నాలుగు దశాబ్దాలలో మొదటిసారి వార్షిక సంకోచం , ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక కోవిడ్-19 కేసులు, మిలియన్ల ఉద్యోగాలు కోల్పోవడం, వేర్వేరు రంగాలలో క్షీణత, నెమ్మదిగా కోలుకున్న కొన్ని రంగాలు.. ఇవన్నీ మనం 2020 సంవత్సరంలో చూశాం
ఫిబ్రవరి 1 న లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2021-22 ను సమర్పించబోతున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎదుర్కొంటున్న వాస్తవికత ఇదే. ఆమె చేసిన అన్ని ప్రకటనలు, చర్యల వెనుక ఒకే అంతిమ లక్ష్యం: అదే భారతదేశాన్ని పునరుద్ధరించడం, మునుపటి దశకు తీసుకురావడం.
మన్మోహన్ సింగ్ సమర్పించిన 1991 బడ్జెట్ కంటే అతి ముఖ్యమైన బడ్జెట్ ఇది. ఎందుకంటే సీతారామన్ కంటే ముందు ఉన్న ఆర్థిక మంత్రులు - అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ - వారి సమయంలో అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా క్లిష్టమైనది అని చెప్పుకోవచ్చు.
గత సంవత్సరం భారతదేశం లాక్డౌన్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా ప్రారంభమయ్యాయి. కొన్ని కీలక సూచికలు, సెప్టెంబర్- అక్టోబర్ నాటికి, 2019-20 నుంచి అంచనా వేసిన డేటాను సరిపోల్చాయి లేదా అధిగమించాయి. ఏదేమైనా నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి డేటా ప్రకారం ఆర్థిక వ్యవస్థ మరీ అంత దీనస్థితికి వెళ్లలేదని అర్థమైంది.
ప్రజల్లో పెరిగిన చైతన్యంతో పాటు పెరుగుతున్న కోవిడ్-19 కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ భారత్లో తగ్గుముఖం పట్టడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. చాలా బ్యాంకులు, రేటింగ్ ఏజెన్సీలు, సంస్థలు 2021 ఆర్థిక సంవత్సరం కోసం వారి జీడీపీ అంచనాలను తగ్గించాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2022 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చూస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్