Tech Giants: టెక్ దిగ్గజాలపై ఆగని చైనా జరిమానాలు
చైనాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలపై అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొరడా ఝళిపిస్తూనే ఉంది. తాజాగా మరికొన్ని కంపెనీలపై భారీ జరిమానా విధించింది....
బీజింగ్: చైనాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలపై అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తూనే ఉంది. తాజాగా మరికొన్ని కంపెనీలపై భారీ జరిమానా విధించింది. టెక్ రంగంలో గుత్తాధిపత్యాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. తాజాగా జరిమానా ఎదుర్కొన్న కంపెనీల్లో జాక్ మా నేతృత్వంలోని అలీబాబా గ్రూప్, టెన్సెంట్ హోల్డింగ్స్ వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి.
ఆయా కంపెనీలు ఎనిమిదేళ్ల క్రితం వరకు చేపట్టిన దాదాపు 43 సంస్థల కొనుగోళ్లను గోప్యంగా ఉంచాయని చైనా ‘స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్’ పేర్కొంది. ఇది ఆయా రంగంలో గుత్తాధిపత్యం కోసం చేసిన చర్యగా పరిగణించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. అందుకే ఒక్కో ఉల్లంఘనకు దాదాపు 80 వేల డాలర్ల జరిమానా విధించామని తెలిపింది. గుత్తాధిపత్యాన్ని అరికట్టడం, సమాచార భద్రత సహా ఇతర కారణాలతో చైనా ప్రభుత్వం దాదాపు ఏడాది కాలంగా వివిధ టెక్ కంపెనీలపై విరుచుకుపడుతోంది. ఆయా రంగాల్లో కొన్ని కంపెనీల ఆధిపత్యం పెరిగిపోతోందని జిన్పింగ్ సర్కార్ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. అలాగే, పోటీలోకి కొత్త కంపెనీలు రాకుండా అడ్డుకుంటుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే చర్యలు చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది.
తాజాగా జరిమానా ఎదుర్కొన్న కంపెనీల్లో అలీబాబా, టెన్సెంట్ సహా జేడీ.కామ్, సనింగ్ లిమిటెడ్, బైడూ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. గత ఏప్రిల్లో వివిధ చట్టాల ఉల్లంఘనల పేరిట అలీబాబాకు 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే మేటువాన్ అనే ఆహార పంపిణీ సంస్థకు 534 మిలియన్ డాలర్ల జరిమానా వేశారు.
► Read latest Business News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!